Jump to content

Revanth Reddy: పాతబస్తీలో మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి


psycopk

Recommended Posts

Revanth Reddy: పాతబస్తీలో మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

08-03-2024 Fri 19:37 | Telangana
  • రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన 
  • తమ ప్రభుత్వం వరుసగా అభివృద్ధి పనులతో ముందుకు సాగుతోందన్న ముఖ్యమంత్రి
  • ఎన్నికల సమయంలోనే రాజకీయాలు... మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యత ఉంటుందని హామీ
CM Revanth Reddy laying foundation stone for the Old City Metro Rail Project

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాతబస్తీ మెట్రో రైలు మార్గానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర ఐదు స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి వెళ్లవచ్చు.

మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం వరుసగా అభివృద్ధి పనులతో ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయాల్లో అభివృద్ధికే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్‌కు తాగునీరు కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు.

Link to comment
Share on other sites

Asaduddin Owaisi: రేవంత్ రెడ్డి అయిదేళ్లు ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్లవచ్చు... మేం అండగా ఉంటాం: అసదుద్దీన్ ఒవైసీ

08-03-2024 Fri 20:15 | Telangana
  • రేవంత్ రెడ్డి పట్టుదల కలిగిన నేత... అందుకే ఈ స్థాయికి వచ్చారని కితాబు
  • అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని వెల్లడి
  • పాతబస్తీ అభివృద్ధికి రూ.120 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన అసదుద్దీన్
Asaduddin praises CM Revanth Reddy in Metro laying foundation stone

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిదేళ్లు ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్లవచ్చునని... తాము అండగా ఉంటామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముఖ్యమంత్రిపై అసదుద్దీన్ ప్రశంసలు కూడా కురిపించారు. రేవంత్ రెడ్డి చాలా పట్టుదల కలిగిన నేత అని... అందుకే ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. పాత బస్తీ మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అసదుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రేవంత్ రెడ్డికి తాము అండగా ఉంటామన్నారు.

తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని, కానీ కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి శక్తులను అడ్డుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రిని కలవగానే పాతబస్తీ అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేశారని చెబుతూ... ఈ నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవంతిని నిర్మించాలని కోరారు. కాంగ్రెస్ చేపట్టిన మూసీ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. చంచల్ గూడ జైలును హైదరాబాద్ వెలుపలకు తరలించి... ఆ స్థానంలో కేజీ టు పీజీ క్యాంపస్ నిర్మించాలని సూచించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...