Jump to content

తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత 


psycopk

Recommended Posts

Shanthi Swaroop: తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత 

05-04-2024 Fri 10:36 | Both States
  • రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన శాంతిస్వరూప్
  • యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • తెలుగు ప్రజల మనసుల్లో శాంతిస్వరూప్ ది చెరగని స్థానం
 
First Telugu news reader Shanthi Swaroop passes away

తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 

1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ లో ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి పదేళ్ల పాటు ఆయన వార్తలు చదివారు. న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ పొందారు. రిటైర్ అయ్యేంత వరకు ఆయన వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతిస్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శాంతిస్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Link to comment
Share on other sites

Shanthi Swaroop: శాంతిస్వరూప్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, నారా లోకేశ్ 

05-04-2024 Fri 11:35 | Both States
  • న్యూస్ రీడర్ గా శాంతిస్వరూప్ తనదైన ముద్ర వేసుకున్నారన్న రేవంత్ రెడ్డి
  • ఆయన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయమని వ్యాఖ్య
  • వార్తలు అంటే శాంతిస్వరూప్ అన్నంతగా ప్రజలకు దగ్గరయ్యారన్న లోకేశ్
 
Revanth Reddy and Nara Lokesh pays tributes to Shanthi Swaroop

తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఖ్యాతి గడించిన శాంతిస్వరూప్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తొలి తరం న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన శాంతిస్వరూప్ గారి మరణం బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1983 నుంచి న్యూస్ రీడర్ గా శాంతిస్వరూప్ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. శాంతిస్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

దూరదర్శన్ అంటే వార్తలు... వార్తలు అంటే శాంతిస్వరూప్ గారు అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరైన శాంతిస్వరూప్ గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. శాంతిస్వరూప్ గారికి కన్నీటి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 

Link to comment
Share on other sites

Chandrababu: నేను, శాంతిస్వ‌రూప్ కలిసి 'ప్రజలతో ముఖ్యమంత్రి' అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేసేవాళ్లం: చంద్ర‌బాబు 

05-04-2024 Fri 13:24 | Andhra
  • తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్ శాంతిస్వ‌రూప్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింద‌న్న టీడీపీ అధినేత‌
  • తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతిస్వరూపేన‌న్న చంద్ర‌బాబు
  • 'ప్రజలతో ముఖ్యమంత్రి' అనే కార్యక్రమంతో ఆరేళ్ల త‌మ సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వైనం
 
TDP Chief Chandrababu Naidu Tweet on Veteran Doordarshan news reader Shanthi Swaroop

తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో ఆయన శుక్ర‌వారం తుదిశ్వాస విడిచారు. ఈ సంద‌ర్భంగా వివిధ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా శాంతిస్వ‌రూప్ మృతిప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 

'ఎక్స్' (ట్విటర్‌) వేదిక‌గా చంద్ర‌బాబు స్పందిస్తూ.. "తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్, యాంకర్, రచయిత శాంతిస్వ‌రూప్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతిస్వరూప్. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి 'ప్రజలతో ముఖ్యమంత్రి' అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేసేవాళ్లం. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకుని పరిష్కారం పొందేవారు. ఈ విధంగా మా అనుబంధం సుదీర్ఘమైనది. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని టీడీపీ అధినేత ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

Pawan Kalyan: శాంతిస్వరూప్ కన్నుమూతపై పవన్ కల్యాణ్ స్పందన 

05-04-2024 Fri 15:31 | Andhra
  • తెలుగులో తొలి న్యూస్ రీడర్ గా ఖ్యాతి పొందిన శాంతి స్వరూప్
  • గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ కన్నుమూత
  • దూరదర్శన్ వార్తలంటే ఆయనే గుర్తుకు వస్తారన్న పవన్
 
 
Pawan Kalyan reacts on news reader Shanti Swaroop demise

తెలుగు బుల్లితెర రంగంలో తొలి న్యూస్ రీడర్ గా ఖ్యాతి పొందిన శాంతిస్వరూప్ కన్నుమూశారు. రెండ్రోజుల కిందట గుండెపోటుకు గురైన శాంతిస్వరూప్ హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శాంతిస్వరూప్ మరణంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

"టీవీలో తొలిసారి తెలుగు వార్తలు చదివిన శాంతి స్వరూప్ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. శాంతి స్వరూప్ గారు వార్తలు చదివే విధానం, పదాలను స్పష్టంగా పలకడం వీక్షకులను మెప్పించాయి. దూరదర్శన్ వార్తలంటే ఆయనే గుర్తుకు వస్తారు. ఈ విషాద సమయంలో శాంతి స్వరూప్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు.

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

 

Shanthi Swaroop: తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత 

05-04-2024 Fri 10:36 | Both States
  • రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన శాంతిస్వరూప్
  • యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • తెలుగు ప్రజల మనసుల్లో శాంతిస్వరూప్ ది చెరగని స్థానం
 
First Telugu news reader Shanthi Swaroop passes away

తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 

1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ లో ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి పదేళ్ల పాటు ఆయన వార్తలు చదివారు. న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ పొందారు. రిటైర్ అయ్యేంత వరకు ఆయన వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతిస్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శాంతిస్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Papam eeyana 80s and 90s kids ki gurthundi. Avid reader and a good newsreader on DD. Om shanthi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...