Jump to content

ఈ నెల 7 నుంచి మళ్లీ ప్రచార బరిలోకి పవన్ కల్యాణ్


psycopk

Recommended Posts

Pawan Kalyan: ఈ నెల 7 నుంచి మళ్లీ ప్రచార బరిలోకి పవన్ కల్యాణ్ 

05-04-2024 Fri 16:26 | Andhra
  • పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్
  • ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్ర జ్వరం
  • చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లిన జనసేనాని
  • పవన్ కోలుకున్నారంటూ జనసేన పార్టీ ప్రకటన
 
Pawan Kalyan will continue election campaign from April 7

జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో, మళ్లీ ప్రచార బరిలో అడుగుపెట్టనున్నారు. ఏప్రిల్ 7 నుంచి వారాహి విజయభేరి యాత్రను కొనసాగించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 

ఈ నెల 7న అనకాపల్లిలో, ఈ నెల 8న ఎలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలకు పవన్ హాజరవుతారు. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇక నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Link to comment
Share on other sites

 

NDA Kutami: విజయవాడలో సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు 

05-04-2024 Fri 16:07 | Andhra
  • విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థుల హాజరు
  • అభ్యర్థుల గెలుపు, పార్టీల మధ్య సమన్వయంపై చర్చ
  • జగన్ పై ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందన్న సుజనా చౌదరి
 
NDA Kutami leaders meeting in Vijayawada

ఎన్డీయే కూటమి నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. విజయవాడ లోక్ సభ పరిధిలోని అభ్యర్థులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. 7 అసెంబ్లీ నియోజకర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జ్ లు, జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుపై, పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై వీరు చర్చలు జరిపారు. 

ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించుకుంటున్నామని చెప్పారు. సీఎం జగన్ పై ప్రజలు తిరగబడే పరిస్థితులు ఉన్నాయని సుజనా చౌదరి అన్నారు. రాజధానిని నాశనం చేసి, ఈ ప్రాంత అభివృద్ధికి తూట్లు పొడిచారని విమర్శించారు. ప్రజలు తిరగబడే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లడం కూటమితోనే సాధ్యమని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా ఫేక్ పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...