Jump to content

ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు: చంద్రబాబు


psycopk

Recommended Posts

Chandrababu: ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు: చంద్రబాబు 

11-04-2024 Thu 19:20 | Andhra
  • పి.గన్నవరంలో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • ప్రజల్లో ఇవాళ అభద్రతా భావం కనిపిస్తోందన్న చంద్రబాబు
  • జగన్ జనాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకుంటున్నాడని ఆగ్రహం
 
Chandrababu speech in P Gannavaram Praja Galam

టీడీపీ అధినేత చంద్రబాబు కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఒక చాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు... మీలో బాధ, ఆవేదన చూశాను... మీలో అభద్రతా భావం కనిపిస్తోంది....  ఇవాళ, నేను పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చింది మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు... సిద్ధం సిద్ధం అంటున్న వాళ్లకు మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కల్యాణ్ చెప్పారు... దానికి మీరు సిద్ధమా? అని అడిగారు.

ఈ ముఖ్యమంత్రి ఓ తమాషా ఆట ఆడుతున్నాడు... పవన్ కల్యాణ్ ఎప్పుడైనా మాట్లాడితే ఆయనపై ఆ కులం వాళ్లతో మాటల దాడి చేయిస్తాడు... నేను మాట్లాడితే నా కులం వాళ్లను ఎగదోసి బూతులు తిట్టించాడు... అందుకే చెబుతున్నా... మీరు కొట్టే దెబ్బ జగన్ కు అదిరిపోవాలి... మళ్లీ ఇంట్లోంచి బయటికి రాకుండా చితక్కొట్టండి... అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. 

ఆ ముగ్గురు నాయకుల సాక్షిగా చెబుతున్నా

బాలయోగి గారు నాకు చిరకాల మిత్రుడు. కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయిలో దేశంలోనే స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. బాలయోగి చనిపోయినా ఆయన మీ హృదయాల్లో శాశ్వతంగా ఉంటారు. బాలయోగిని స్పీకర్ గా చేసిన ఘనత టీడీపీది. 

ఇవాళ మహాత్మ జ్యోతిరావ్ పూలే జయంతి. మొన్ననే బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి జరుపుకున్నాం. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి జరుపుకోబోతున్నాం. ఈ ముగ్గురి నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం... బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మేం స్వీకరిస్తున్నాం. బీసీలకు ఒక డిక్లరేషన్ ప్రకటించాం. ఈ డిక్లరేషన్ తో బీసీల తలరాత మారుతుంది. 

50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తాం. సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి రూ.30 వేలు... ఐదేళ్లలో రూ.1.50 లక్షలతో బీసీలను ఆర్థికంగా ముందుకు తీసుకువస్తాం. ఇదే కాదు... స్థానిక సంస్థల్లో మళ్లీ 34 శాతం బీసీ రిజర్వేషన్లు తీసుకువస్తాం. 

చట్టసభల్లోనూ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతాం, న్యాయం జరిపిస్తాం, తీర్మానం చేస్తాం. చట్టబద్ధంగా కులగణన చేస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం. ఆదరణ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడతాం. చంద్రన్న బీమా రూ.10 లక్షలు చేసే బాధ్యత తీసుకుంటాం. 

చెక్ పెట్టేందుకు ఇదే సమయం

రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదొక కీలక సమయం. ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు, కష్టాలకు చెక్ పెట్టే సమయం ఇది. ఐదు సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో  మార్పు వచ్చిందా, ఏ ఒక్కరికైనా, ఏ వర్గానికైనా, ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా? 

2014-19 మధ్య రూ.200 ఉన్న విద్యుత్ చార్జీ ఇవాళ రెండు వేలు అయింది. రూ.200గా ఉన్న విద్యుత్ చార్జీని రెండు వేలకు పెంచి, 99 శాతం హామీలు నెరవేర్చానని గొప్పలు చెప్పే ప్రభుత్వం మీకు కావాలా? ఐదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా లేదా? కడుపు నిండా తినే పరిస్థితిలో ఉన్నారా? ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగాయా లేదా? పన్నులు పెంచేశారు... చెత్తమీద కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి పన్నేశాడు. రాష్ట్రంలో విధ్వంస పాలన నెలకొంది. 

చిచ్చు పెట్టి చలికాచుకుంటున్నాడు

కోనసీమ... అందాలసీమ. సినిమాల్లో అందమైన లొకేషన్లు చూపించాలంటే... మా పవన్ కల్యాణ్ తో సహా అందరూ చూపించేది మొదట కోనసీమనే. ఇప్పుడు ఈ ప్రాంతం అంబేద్కర్ కోనసీమ అయింది. ఇక్కడ ఎవరైనా చెడ్డవ్యక్తులు ఉన్నారా? ఎవరైనా మంచి నీళ్లు ఇవ్వమంటే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనస్తత్వం కోనసీమ వాసుల సొంతం. ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజి కట్టిన కాటన్ ను ఇప్పటికీ ఆరాధిస్తుంటారు. 

అలాంటి కోనసీమలో కశ్మీర్ మాదిరిగా ఇంటర్నెట్  నిలిపివేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. ఒకప్పుడు పౌరుషంగా కూడా మాట్లాడడం తెలియని ఈ గోదావరి ప్రజల మధ్య జగన్ చిచ్చుపెట్టి చలి కాచుకుంటున్నాడు. 

మొదటి సంతకం దానిపైనే!

యువతకు ఉద్యోగాలు వచ్చాయా, డీఎస్సీ జరిపారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలంటే మా కూటమి రావాలి. అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుంది... అదీ మా కమిట్ మెంట్. మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఇక్కడే గోదావరి ఉంది... అయినా మీకు ఇసుక దొరుకుతోందా?

టీడీపీ హయాంలో రూ.1000గా ఉన్న ఇసుక ట్రాక్టర్ ఇప్పుడు రూ.5 వేలు... ఎవరికి పోతోంది ఈ డబ్బు? 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడు. ఎక్కడ చూసినా ఇసుక దందా, ఇసుక మాఫియా కనిపిస్తోంది. 

ఇక్కడ మందుబాబులు కూడా ఉన్నారు. టీడీపీ హయాంలో క్వార్టర్ బాటిల్ రూ.60... ఇప్పుడు క్వార్టర్ బ్యాటిల్ రూ.200... రూ.160 తేడా ఉంది... ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళుతోంది. 

పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నా 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2014లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయేకు సహకరించారు. అందుకే ఆనాడు గోదావరి జిల్లాల్లో వన్ సైడెడ్ ఎలక్షన్ల జరిగాయి. ఇప్పుడు ఇద్దరం కలిశాం... నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ కూడా మాతో కలిసింది... ఇక తిరుగుందా? మాకు ఎదురుగా నిలబడే దమ్ము జగన్ కు ఉందా? 

రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అయినా బాగున్నాడా? ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు.... వారిని కూడా అడుగుతున్నా. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత ఉండేది... ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే  గ్యారెంటీ లేని పరిస్థితి. 

ఇవాళ తీవ్రమైన ఒత్తిళ్లతో, ఆర్థిక ఇబ్బందులతో శంకర్రావు అనే కానిస్టేబుల్ విశాఖలతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులను అడుగుతున్నా... మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చాడా...? టీఏ, డీఏ, పీఎఫ్ అన్నీ పెండింగ్ పెట్టాడు. దాంతో కానిస్టేబుల్ శంకర్రావు దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ పి.గన్నవరం వంటి ప్రాంతాల్లోనూ గంజాయి దొరికే పరిస్థితులు ఉన్నాయి. 

కాపుల్లో కూడా పేదరికం ఉంది

ఇక్కడ కాపుల్లో కూడా పేదరికం ఉంది. వారి కోసం ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు చేసిన పార్టీ టీడీపీ. ఈ ముఖ్యమంత్రి రూ.2 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడతానని చెప్పాడు... మాట నిలబెట్టుకున్నాడా? 

Link to comment
Share on other sites

Chandrababu: విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్యపై చంద్రబాబు స్పందన 

11-04-2024 Thu 18:09 | Andhra
  • శంకర్రావు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్న చంద్రబాబు
  • ఏపీలో పోలీసు సిబ్బందిపై రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయని వెల్లడి
  • పోలీసుల ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని హితవు
  • కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ
 
Chandrababu responds on SPF Constable suicide incident in Vizag

విశాఖపట్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. శంకర్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. 

రాష్ట్రంలో పోలీసు సిబ్బందిపై రకరకాల ఒత్తిళ్లు ఉన్న మాట వాస్తవం అని తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా శాంతిభద్రతలు కాపాడే పోలీసుల ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ముఖ్యంగా, కానిస్టేబుళ్ల విషయంలో సరెండర్ లీవ్, అడిషనల్ సరెండర్ లీవ్ బకాయిలు ఎన్నో నెలలుగా చెల్లించాల్సి ఉందని వివరించారు. టీఏ, డీఏ బకాయిలు కూడా చెల్లించడంలేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. పీఆర్సీ ప్రకటన కూడా ఉద్యోగులను మోసం చేసిందని పేర్కొన్నారు. 

"పోలీసులకు వీక్లీ ఆఫ్ అన్నారు... అది అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే మొదట పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. అటు ఖాళీల భర్తీ లేదు... ఇటు వీక్లీ ఆఫ్ లేదు. పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయన్న విషయం గుర్తించాలి. ఇవి కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా తమ అవినీతికి, అరాచకాలకు సహకరించాలని పోలీసులను ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. ఇవన్నీ పోలీసులపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. 

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేస్తాం. ఈ మేరకు పోలీసు సోదరులకు హామీ ఇస్తున్నాను" అంటూ చంద్రబాబు సోషల్ మీడియాలో  పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Chandrababu: వైసీపీ గెలుస్తుందంటూ ఈటీవీ పేరుతో ఫేక్ వీడియో... తీవ్రంగా ఖండించిన చంద్రబాబు 

11-04-2024 Thu 16:48 | Andhra
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక చెప్పిందంటూ ప్రచారం
  • వైసీపీ ఓటమి ఖాయమని తెలియడంతో పైకి ఫేక్ పరిశ్రమను తెరపైకి తెచ్చిందన్న చంద్రబాబు
 
Chandrababu condemns fake video in the name of ETV

"ఏపీ ఎన్నికలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో... ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడి... 124 సీట్లతో రెండోసారి కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నిఘా సంస్థ... ఎన్డీయే కూటమి 51 సీట్లకే పరిమితం అవుతుందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో... గత నెలలో 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ... వైసీపీ గెలుపు ఖాయం కావడంతో ప్రచారానికి దూరంగా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు?"... అంటూ ఈటీవీ న్యూస్ చానల్ పేర్కొన్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఫేక్ వీడియో అని ఈటీవీ ఇప్పటికే ఖండించింది. 

తాజాగా ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫేక్ పరిశ్రమను వైసీపీ తెరపైకి తెచ్చిందని అన్నారు. జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించడంతో ఫేక్ పరిశ్రమను ఆశ్రయించారని విమర్శించారు. 

ఈ ఫేక్ పరిశ్రమలో భాగంగా తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ చానల్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని, ప్రజలు నమ్మే న్యూస్ చానల్ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేస్తారనే దుస్థితికి దిగజారారని విమర్శించారు. ఫేక్ ప్రచారం కోసం వీళ్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను కూడా వదల్లేదని అన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను దీటుగా తిప్పికొట్టాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సూపర్-6 పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. 

ఇక, వాలంటీర్లతో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారు, వాలంటీర్లను బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామంటే తట్టుకోలేకపోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
వైసీపీ దాడులను సమర్థంగా తిప్పికొట్టాలని, కూటమిలో ఏ పార్టీ అభ్యర్థికి అయినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఓట్లు పడేలా నాయకులు కృషి చేయాలని సూచించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...