Jump to content

రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి.... ఉద్యోగస్తులందరికీ ఒకటే విన్నపం: చంద్రబాబు


psycopk

Recommended Posts

Chandrababu: రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి.... ఉద్యోగస్తులందరికీ ఒకటే విన్నపం: చంద్రబాబు 

03-05-2024 Fri 22:06 | Andhra
  • నెల్లూరులో భారీ రోడ్ షో
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • సింహపురి తిరగబడిందన్న చంద్రబాబు
  • వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు
 
Chandrababu appeals employees ahead of postal ballots oepening

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు సిటీలో నిర్వహించిన కూటమి రోడ్ షోకు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం నెల్లూరులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. 

పవన్ కల్యాణ్ ఇక్కడే తిరిగిన వ్యక్తి అని, పవన్ కు నెల్లూరులో గల్లీగల్లీ తెలుసు అని వెల్లడించారు. తనకు తిరుపతిలో ఎలా ప్రతి గల్లీ తెలుసో, పవన్ కు కూడా నెల్లూరులో ప్రతి చోటు  తెలుసని, ఇదే విషయాన్ని పవన్ కు కూడా చెప్పానని వివరించారు. సభకు విచ్చేసిన యువతను చూడగానే పవన్ కు బాల్యం గుర్తుకువచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, చరిత్ర తిరగరాసేందుకు నెల్లూరు తిరగబడిందని అన్నారు. 

"అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇంకోపక్క తెలుగుదేశం పార్టీ, మరోవైపు భారతీయ జనతా పార్టీ... ముగ్గురం కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా? అడ్డం వస్తే తొక్కుకుంటూ పోవడమే. మే 13న వైసీపీకి డిపాజిట్లు అయినా వస్తాయా? ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారి, ఒక బందిపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ నెల 13న అంతం పలకడానికి మీరంతా సిద్ధమా? 

ఈ యువతకు బంగారు భవిష్యత్ చూపించడం నా బాధ్యత, పవన్ కల్యాణ్ బాధ్యత. ఇవాళ జనసేన కండువా, ఇటు టీడీపీ జెండాల ఊపు చూస్తుంటే... సింహపురిలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు! రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది. 

రాసిపెట్టుకోండి... మే 13న ఎన్నికలు జరుగుతాయి, జూన్ 4న ఫలితాలు వస్తాయి. 25 లోక్ సభ స్థానాలకు 24... వీలైతే 25కి 25 మనం గెలుస్తున్నాం... 160కి పైబడి అసెంబ్లీ స్థానాలు కూడా మనమే గెలుస్తున్నాం. రాష్ట్రం బాగుపడాలన్నా, తెలుగుజాతి ముందుకుపోవాలన్నా సైకో ఈ రాష్ట్రం నుంచి పారిపోయేలా చేయాలి. 

రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా... 95 శాతం, వీలైతే 100 శాతం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించమని ఈ సింహపురి సభ నుంచి పిలుపునిస్తున్నా. 

డబ్బులతో, కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. అతను ఖర్చు పెట్టే డబ్బులు మీవే. జే బ్రాండ్ మద్యం ద్వారా వచ్చిన డబ్బులే, ఇసుక మాఫియా, భూ మాఫియాలో వచ్చిన డబ్బులే. ఈ జలగ జగనన్న మీకిచ్చేది రూ.10... మీ దగ్గర కొట్టేసింది రూ.100... దోచింది రూ.1000! ఆస్తి మీది... దాని మీద ఫొటో సైకోది. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధపడ్డాడు. 

వ్యతిరేక ఓటు చీలకూడదు అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. పవన్ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో... మేం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అనేక విధాలుగా తగ్గాం, ప్రజల కోసం  సర్దుబాటు చేసుకున్నాం. మే 13 వరకు ప్రజల్లో ఇదే స్ఫూర్తి కొనసాగాలి. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి, బంగాళాఖాతంలో అంత్యక్రియలు చేయాలి" అని చంద్రబాబు వివరించారు.

Link to comment
Share on other sites

Pawan Kalyan: నెల్లూరులో ఇంతటి స్వాగతం నేను ఊహించలేదు: పవన్ కల్యాణ్ 

03-05-2024 Fri 21:18 | Andhra
  • నెల్లూరులో కూటమి రోడ్ షో
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • తాను నెల్లూరులో చదువుకున్నానని తెలిపిన జనసేనాని
  • దేశభక్తి, ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడడం ఇక్కడే నేర్చుకున్నానని వెల్లడి
 
Pawan Kalyan says he never expect such huge welcome in Nellore

నెల్లూరు నగరంలో కూటమి ఆధ్వర్యంలో నేడు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, నెల్లూరులో ఇంతటి ఘనస్వాగతం లభిస్తుందని ఊహించలేదని అన్నారు. 

తాను ఇక్కడే దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ స్కూల్, వీఆర్సీలో చదువుకున్నానని వెల్లడించారు. ఆ సమయంలో రెండు అంశాలు నేర్చుకున్నానని, పార్టీ పెట్టడంలో ఆ అంశాలు సహాయపడ్డాయని తెలిపారు. ఒకటి దేశభక్తి, రెండు తప్పు జరిగితే పుచ్చలపల్లి సుందరయ్యలా బయటికొచ్చి గొంతు విప్పి మాట్లాడడం అని వివరించారు. నెల్లూరులో ఫతేఖాన్ పేట, మూలపేట, సంతపేట, రంగనాయకులుపేటలో తిరిగానని వెల్లడించారు. 

ఇక్కడ కూటమి అభ్యర్థులు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని జనసేన శ్రేణులకు పవన్ పిలుపునిచ్చారు. గూండా ప్రభుత్వానికి మనం భయపడాలా? ఆత్మగౌరవాన్ని తీసేసే వ్యక్తులకు మనం భయపడతామా? వైఎస్ జగన్ కు మనం భయపడతామా? అంటూ కార్యకర్తల్లో కదనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు. 

సింహపురి ఇది... గుండె లోతుల్లోంచి అన్యాయానికి ఎదురుతిరిగే సింహపురి ఇది అని అభివర్ణించారు. బలంగా నిలబడదాం... మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా... అవినీతి కోటలు బద్దలు కొడదాం అని పిలుపునిచ్చారు

Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

 

Chandrababu: రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి.... ఉద్యోగస్తులందరికీ ఒకటే విన్నపం: చంద్రబాబు 

03-05-2024 Fri 22:06 | Andhra
  • నెల్లూరులో భారీ రోడ్ షో
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • సింహపురి తిరగబడిందన్న చంద్రబాబు
  • వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు
 
Chandrababu appeals employees ahead of postal ballots oepening

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు సిటీలో నిర్వహించిన కూటమి రోడ్ షోకు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం నెల్లూరులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. 

పవన్ కల్యాణ్ ఇక్కడే తిరిగిన వ్యక్తి అని, పవన్ కు నెల్లూరులో గల్లీగల్లీ తెలుసు అని వెల్లడించారు. తనకు తిరుపతిలో ఎలా ప్రతి గల్లీ తెలుసో, పవన్ కు కూడా నెల్లూరులో ప్రతి చోటు  తెలుసని, ఇదే విషయాన్ని పవన్ కు కూడా చెప్పానని వివరించారు. సభకు విచ్చేసిన యువతను చూడగానే పవన్ కు బాల్యం గుర్తుకువచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, చరిత్ర తిరగరాసేందుకు నెల్లూరు తిరగబడిందని అన్నారు. 

"అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇంకోపక్క తెలుగుదేశం పార్టీ, మరోవైపు భారతీయ జనతా పార్టీ... ముగ్గురం కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా? అడ్డం వస్తే తొక్కుకుంటూ పోవడమే. మే 13న వైసీపీకి డిపాజిట్లు అయినా వస్తాయా? ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారి, ఒక బందిపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ నెల 13న అంతం పలకడానికి మీరంతా సిద్ధమా? 

ఈ యువతకు బంగారు భవిష్యత్ చూపించడం నా బాధ్యత, పవన్ కల్యాణ్ బాధ్యత. ఇవాళ జనసేన కండువా, ఇటు టీడీపీ జెండాల ఊపు చూస్తుంటే... సింహపురిలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు! రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది. 

రాసిపెట్టుకోండి... మే 13న ఎన్నికలు జరుగుతాయి, జూన్ 4న ఫలితాలు వస్తాయి. 25 లోక్ సభ స్థానాలకు 24... వీలైతే 25కి 25 మనం గెలుస్తున్నాం... 160కి పైబడి అసెంబ్లీ స్థానాలు కూడా మనమే గెలుస్తున్నాం. రాష్ట్రం బాగుపడాలన్నా, తెలుగుజాతి ముందుకుపోవాలన్నా సైకో ఈ రాష్ట్రం నుంచి పారిపోయేలా చేయాలి. 

రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా... 95 శాతం, వీలైతే 100 శాతం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించమని ఈ సింహపురి సభ నుంచి పిలుపునిస్తున్నా. 

డబ్బులతో, కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. అతను ఖర్చు పెట్టే డబ్బులు మీవే. జే బ్రాండ్ మద్యం ద్వారా వచ్చిన డబ్బులే, ఇసుక మాఫియా, భూ మాఫియాలో వచ్చిన డబ్బులే. ఈ జలగ జగనన్న మీకిచ్చేది రూ.10... మీ దగ్గర కొట్టేసింది రూ.100... దోచింది రూ.1000! ఆస్తి మీది... దాని మీద ఫొటో సైకోది. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధపడ్డాడు. 

వ్యతిరేక ఓటు చీలకూడదు అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. పవన్ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో... మేం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అనేక విధాలుగా తగ్గాం, ప్రజల కోసం  సర్దుబాటు చేసుకున్నాం. మే 13 వరకు ప్రజల్లో ఇదే స్ఫూర్తి కొనసాగాలి. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి, బంగాళాఖాతంలో అంత్యక్రియలు చేయాలి" అని చంద్రబాబు వివరించారు.

Paytm's not eligible for postal ballots.. why you are posting here..🤣

  • Haha 1
Link to comment
Share on other sites

Eee Narayana inkaa em cheyyalani rajakeeyalu chesthunnado artham kaavtaledu!!

Konchem kuda siggunattu ledu!! 

Maa Babu gaaremo Lokesh kosam, PK emo package kosam!!

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...