Jump to content

వైఎస్ విగ్రహాల కోసం కోట్లు ఖర్చు! | 18 కోట్లు తగలెట్టారు..!


southyx

Recommended Posts

రూ.18 కోట్ల ప్రజాధనం.. వైఎస్‌ విగ్రహాలపాలు

ఇడుపులపాయలోని వైఎస్సార్‌ స్మారక రాజీవ్‌ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23.

 
 
 
 
 
 
 

ఇడుపులపాయలో రూ.10 కోట్లతో 23 విగ్రహాల ఏర్పాటు
48 అడుగుల ఎత్తయిన ఒక్క విగ్రహం ఖర్చే రూ.7.61 కోట్లు
సుందరీకరణ పేరిటా రూ.కోట్ల ఖర్చు

ap050724main3a.jpg

ఇడుపులపాయలోని వైఎస్సార్‌ స్మృతివనంలో ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి విగ్రహాం

ఈనాడు- అమరావతి, కడప: ఇడుపులపాయలోని వైఎస్సార్‌ స్మారక రాజీవ్‌ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా? మొత్తం 23. ఇందుకోసం ఖర్చు చేసిన ప్రజాధనం అక్షరాలా రూ.10 కోట్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 48 అడుగుల ఎత్తయిన ఒక విగ్రహానికే రూ.7.61 కోట్లు వెచ్చించారు. ఇంకో 22 విగ్రహాలకు మరో రూ.2.39 కోట్లు ఖర్చు చేశారు. అంతేనా.. విగ్రహాలకు విద్యుద్దీపాల అలంకరణ, చుట్టూ సుందరీకరణ పనుల కోసం మరో రూ.8 కోట్లు.. ఇలా గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఇడుపులపాయలో రూ.18 కోట్లను మంచినీళ్లలా ఖర్చు పెట్టేసింది. ఈ పనులకు పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ (పాడా) ద్వారా రూ.15.43 కోట్లు మంజూరు చేయించారు. పనుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించారు. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రూ.14.07 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అర్బన్‌ గ్రీన్, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇడుపులపాయలో పచ్చదనం పెంపొందించడానికి మరో రూ.4 కోట్ల వరకు వ్యయం చేశారు.

ap050724main3b_1.jpg

ఇడుపులపాయలోని వైఎస్సార్‌ స్మృతివనంలో ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి విగ్రహాం

టెండర్లు వేయడానికి వచ్చేవారికి తుపాకీతో బెదిరింపులు

ఈ పనులన్నీ జగన్‌ అస్మదీయ గుత్తేదారు సంస్థలకే కట్టబెట్టారు. ఇతరులు టెండర్లు వేయకుండా జగన్‌ మనుషులు తుపాకులతో బెదిరించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విగ్రహాల ఏర్పాటు, ఇతర పనులకు సంబంధించిన మొత్తం రూ.14 కోట్ల టెండర్‌ను ఎన్‌జేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 4.26% ఎక్సెస్‌కు దక్కించుకుంది. మరో డమ్మీ గుత్తేదారు సంస్థ ద్వారా ఎన్‌జేఆర్‌ కంటే ఎక్కువ మొత్తానికి టెండర్‌ వేయించారు. అంతకంటే తక్కువ మొత్తానికి కోట్‌ చేశారంటూ ఎన్‌జేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు అప్పగించారు. ఈ విషయంలో గుత్తేదారు సంస్థకు గత సీఎంఓలోని ఒక ఉన్నతాధికారితోపాటు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలో కీలక స్థానంలో ఉన్న ఓ ఇంజినీర్‌ సహకరించారు.

ap050724main3c.jpg

రాజశేఖరరెడ్డి పాదయాత్ర నమూనా విగ్రహం

చక్రం తిప్పింది కొండారెడ్డి 

ఇడుపులపాయలో పనుల టెండర్‌ ఎన్‌జేఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ చేతుల్లోకి వెళ్లినా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండల వైకాపా ఇన్‌ఛార్జి కొండారెడ్డి పనులు చేయించారు. విగ్రహాల ఏర్పాటు పనులకు ఇతరులెవరూ టెండర్లు వేయకుండా కొండారెడ్డే బెదిరించారన్న ఆరోపణలున్నాయి. ఆయన పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణ గుత్తేదారును బెదిరించిన కేసులో అరెస్టయిన కొండారెడ్డిని జిల్లా బహిష్కరణ చేయాలని నాటి ఎస్పీ అన్బురాజన్‌ కలెక్టర్‌కు ప్రతిపాదనలు కూడా పంపడం గమనార్హం.  

ap050724main3d.jpg

వైఎస్సార్‌ స్మృతివనంలో సుందరీకరణ

సమగ్ర విచారణకు సీఐడీకి ఎమ్మెల్యే బొండా ఫిర్యాదు 

ఇడుపులపాయలోని వైఎస్సార్‌ స్మృతివనంలో వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులపై సమగ్ర విచారణ జరపాలని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సీఐడీ అదనపు డైరక్టర్‌ జనరల్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 2019-24 మధ్య స్మృతివనంలో చేసిన పనులకు సంబంధించి టెండర్ల నుంచి నిధుల వ్యయం వరకు అనేక అక్రమాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌ విగ్రహాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ పనులకు సంబంధించిన టెండర్‌ను ఎన్‌.జనార్దనరావు (ఎన్‌జేఆర్‌) కన్‌స్ట్రక్షన్స్‌కు ఏకపక్షంగా కేటాయించారని ఆయన ఆరోపించారు

https://www.eenadu.net/telugu-news/ap-top-news/wastage-of-public-money-for-ysr-statues/2501/124124985

Okka Idupulapaya lo ne 10 kotlu anta 23 vigrahalaki.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...