Jump to content

TG Crop Loan: రెండో విడత పంటరుణాల మాఫీ నిధుల విడుదల... లబ్ధిదారుల్లో చివరి స్థానంలో హైదరాబాద్


psycopk

Recommended Posts

Crop Loan: రెండో విడత పంటరుణాల మాఫీ నిధుల విడుదల... లబ్ధిదారుల్లో చివరి స్థానంలో హైదరాబాద్ 

30-07-2024 Tue 13:57 | Telangana
Second phase crop loans released
 

 

  • లక్షన్నర లోపు రుణాల మాఫీకి నిధుల విడుదల
  • 6.4 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 6,190 కోట్లు జ‌మ
  • అసెంబ్లీ ప్రాంగణంలో నిధులు విడుదల చేసిన సీఎం
రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. మొదటి దఫాలో రూ.1 లక్ష లోపు రుణాలు మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈసారి రూ.లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగ‌ణంలో విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. 

లక్ష నుంచి లక్షన్నర రూపాయల లోపు రుణాలను ఇప్పుడు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడ‌త‌లో 6.4 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 6,190 కోట్లు జ‌మ చేసిన‌ట్లు తెలిపింది. తొలి విడత‌లో 11.34 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.6,035 కోట్లు జ‌మ చేశారు. రుణ‌మాఫీ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 17.75 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ది చేకూరిన‌ట్లు ప్రభుత్వం పేర్కొంది. రెండు ద‌శ‌ల్లో క‌లిపి రైతుల ఖాతాల్లో రూ. 12,225 కోట్ల‌ను జ‌మ చేసిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

రెండు విడ‌త‌ల్లో కలిసి అత్య‌ధికంగా నల్గొండ జిల్లాలోని 1,37,430 మంది రైతులకు రూ.984.34 కోట్లు విడుద‌ల చేశారు. ఆ తర్వాత స్థానంలో 80,395 మంది రైతులకు లబ్ధి చేకూరడం ద్వారా నాగర్ కర్నూల్ రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాకు రూ.583.87 కోట్లు విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో 77,951 మంది ల‌బ్ది పొందారు. ఈ జిల్లాకు రూ. 563.99 కోట్ల నిధులు విడుదలయ్యాయి. చివరి మూడు స్థానాల్లో ములుగు (17,788 మంది రైతుల‌కు రూ. 130.94 కోట్లు), మేడ్చల్ మల్కాజ్‌గిరి (2,799 మంది రైతులకు రూ.15.56 కోట్లు), హైదరాబాద్ ఉన్నాయి. హైదరాబాద్‌లో మొదటి విడతలో ముగ్గురు, రెండో విడతలో నలుగురు రైతులకు లబ్ధి చేకూరింది.
Link to comment
Share on other sites

Revanth Reddy: కార్పోరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులకు లక్షల కోట్లు మోసం చేశారు: రేవంత్ రెడ్డి 

30-07-2024 Tue 14:18 | Telangana
Revanth Reddy blames corporate comanies who cheted banks
 

 

  • కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమన్న రేవంత్ రెడ్డి
  • తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య
  • ఏ రైతూ ఆర్థిక సంక్షోభంలో కూరుకోకూడదనేది తమ విధానమన్న సీఎం
కార్పోరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే రుణమాఫీ చేశామన్నారు. కార్పోరేట్ కంపెనీలు రూ.14 లక్షల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టాయని, అదే సమయంలో తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకోకూడదనేది తమ విధానం అన్నారు. గతంలో ఎంతోమంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లలో ఈరోజు పండుగ రోజు అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తాము మూడు విడతలుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...