Jump to content

madhuri kante house ee mukhyam..


psycopk

Recommended Posts

Duvvada: మాధురిని చూసేందుకు వెళ్లాలని ఉంది కానీ.. : దువ్వాడ

12-08-2024 Mon 11:19 | Andhra
Duvvada Srinivas Reaction On Divvela Madhuri Car Accident

 

  • తాను బయటకు వెళితే ఇల్లు కబ్జా చేస్తారని ఆరోపణ
  • మాధురి అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికీ దూరమైందని వ్యాఖ్య
  • రెండేళ్ల క్రితమే వాణికి విడాకుల నోటీసు ఇచ్చినట్లు వెల్లడి

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన దివ్వెల మాధురిని చూసేందుకు వెళ్లాలని ఉందని ఏపీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. అయితే, తాను బయటకు వెళితే తన భార్యాపిల్లలు ఇంటిని కబ్జా చేస్తారని ఆయన ఆరోపించారు. అందుకే ఆసుపత్రికి వెళ్లాలని ఉన్నా వెళ్లడం లేదని వివరించారు. ఈమేరకు సోమవారం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. డిప్రెషన్ కారణంగానే కారు ప్రమాదం జరిగిందని మాధురి తనతో చెప్పిందన్నారు. దువ్వాడ వాణి వ్యాఖ్యలతో మాధురి కుంగుబాటుకు లోనైందని వివరించారు.

వాణి ఆరోపణలు, ఈ గొడవ కారణంగా మాధురి అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికీ దూరమైందని సానుభూతి వ్యక్తం చేశారు. గతంలోనూ తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని చెప్పుకుని బాధపడిందని తెలిపారు. దీనిపై ఇంతకుముందు కూడా మాధురి ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని, తానే కాపాడి ధైర్యం చెప్పానని వివరించారు. మాధురి కారు ప్రమాదం డ్రామా అంటూ జరుగుతున్న ప్రచారంపై దువ్వాడ సీరియస్ గా స్పందించారు. డ్రామా చేయాలని ఎవరూ యాక్సిడెంట్ చేసుకోరని, యాక్సిడెంట్ లో ఏదైనా జరగరానిది జరిగితే ఏమై ఉండేదని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో మాధురి తలకు తీవ్ర గాయం అయిందని, ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు చెప్పారన్నారు.

కుటుంబ వివాదంపై స్పందిస్తూ..
భార్యాభర్తల మధ్య ఏంజరిగినా సమాజం భార్య వైపే మొగ్గు చూపుతుందని, భర్తనే తప్పుబడుతుందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. దువ్వాడ వాణి తండ్రి ఎలాంటి వ్యసనపరుడో అందరికీ తెలుసన్నారు. తన జీవితంలో ప్రతిక్షణం భార్యతో నరకం చూశానని, పిల్లలను తనపైకి ఉసిగొల్పిన వాణిది సైకో మనస్తత్వమని తెలిపారు. ఆమె తీరును భరించలేక రెండేళ్ల కిందటే విడాకుల నోటీసు ఇచ్చానని చెప్పారు. నిర్మొహమాటంగా మాట్లాడడం తన నైజమని, ఇది తనకు ఇంటాబయట శత్రువులను పెంచిందని దువ్వాడ వివరించారు.
  • Haha 1
Link to comment
Share on other sites

Divvela Madhuri: దివ్వెల మాధురిపై పోలీస్ కేసు

12-08-2024 Mon 12:48 | Andhra
Case registered against Divvela Madhuri

 

  • కారు ప్రమాదంపై కేసు పెట్టిన పోలీసులు
  • ప్రమాదం కాదు.. ఆత్మహత్యాయత్నమన్న మాధురి
  • వాణి ఆరోపణలతో డిప్రెషన్ కు గురయ్యానని వెల్లడి

వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాధురి ప్రస్తుతం పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, నిర్లక్ష్యంగా కారును నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారని మాధురిపై పలాస పోలీసులు కేసు పెట్టారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో మాధురి కలిసి ఉంటోందని, తన భర్తను తనకు కాకుండా చేసిందని దువ్వాడ వాణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వాణి తన కూతురు హైందవితో కలిసి టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందు నిరసన చేస్తున్నారు. ఇంట్లోకి అనుమతించాలని గత నాలుగు రోజులుగా రాత్రీపగలు అక్కడే ఉంటున్నారు. ఈ గొడవకు సంబంధించి మీడియా ముఖంగా వాణి, మాధురి పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. దీంతో టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ నివాసంపై తనకూ హక్కు ఉందని, ఇకపై పిల్లలతో కలిసి అక్కడే ఉంటానని మాధురి ఆదివారం ప్రకటించారు.

సాయంత్రం తన కారులో టెక్కలికి బయలుదేరారు. ఈ క్రమంలోనే పలాస హైవేపై లక్ష్మీపురం టోల్‌గేట్‌ దగ్గర మాధురి నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న కారును వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో మాధురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది రోడ్డు ప్రమాదం కాదని, వాణి ఆరోపణలతో డిప్రెషన్ కు గురై తానే ఆ కారును ఢీ కొట్టానని మాధురి చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో విసుగుచెంది చనిపోవాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేశానన్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Duvvada: మాధురిని చూసేందుకు వెళ్లాలని ఉంది కానీ.. : దువ్వాడ

12-08-2024 Mon 11:19 | Andhra
Duvvada Srinivas Reaction On Divvela Madhuri Car Accident

 

  • తాను బయటకు వెళితే ఇల్లు కబ్జా చేస్తారని ఆరోపణ
  • మాధురి అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికీ దూరమైందని వ్యాఖ్య
  • రెండేళ్ల క్రితమే వాణికి విడాకుల నోటీసు ఇచ్చినట్లు వెల్లడి

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన దివ్వెల మాధురిని చూసేందుకు వెళ్లాలని ఉందని ఏపీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. అయితే, తాను బయటకు వెళితే తన భార్యాపిల్లలు ఇంటిని కబ్జా చేస్తారని ఆయన ఆరోపించారు. అందుకే ఆసుపత్రికి వెళ్లాలని ఉన్నా వెళ్లడం లేదని వివరించారు. ఈమేరకు సోమవారం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. డిప్రెషన్ కారణంగానే కారు ప్రమాదం జరిగిందని మాధురి తనతో చెప్పిందన్నారు. దువ్వాడ వాణి వ్యాఖ్యలతో మాధురి కుంగుబాటుకు లోనైందని వివరించారు.

వాణి ఆరోపణలు, ఈ గొడవ కారణంగా మాధురి అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికీ దూరమైందని సానుభూతి వ్యక్తం చేశారు. గతంలోనూ తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని చెప్పుకుని బాధపడిందని తెలిపారు. దీనిపై ఇంతకుముందు కూడా మాధురి ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని, తానే కాపాడి ధైర్యం చెప్పానని వివరించారు. మాధురి కారు ప్రమాదం డ్రామా అంటూ జరుగుతున్న ప్రచారంపై దువ్వాడ సీరియస్ గా స్పందించారు. డ్రామా చేయాలని ఎవరూ యాక్సిడెంట్ చేసుకోరని, యాక్సిడెంట్ లో ఏదైనా జరగరానిది జరిగితే ఏమై ఉండేదని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో మాధురి తలకు తీవ్ర గాయం అయిందని, ఏడాదిలో ఏమైనా జరగొచ్చని వైద్యులు చెప్పారన్నారు.

కుటుంబ వివాదంపై స్పందిస్తూ..
భార్యాభర్తల మధ్య ఏంజరిగినా సమాజం భార్య వైపే మొగ్గు చూపుతుందని, భర్తనే తప్పుబడుతుందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. దువ్వాడ వాణి తండ్రి ఎలాంటి వ్యసనపరుడో అందరికీ తెలుసన్నారు. తన జీవితంలో ప్రతిక్షణం భార్యతో నరకం చూశానని, పిల్లలను తనపైకి ఉసిగొల్పిన వాణిది సైకో మనస్తత్వమని తెలిపారు. ఆమె తీరును భరించలేక రెండేళ్ల కిందటే విడాకుల నోటీసు ఇచ్చానని చెప్పారు. నిర్మొహమాటంగా మాట్లాడడం తన నైజమని, ఇది తనకు ఇంటాబయట శత్రువులను పెంచిందని దువ్వాడ వివరించారు.

gangs of waseypur style lo defending aa dhuvva uncle

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...