Jump to content

Chandrababu ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరతాం: సీఎం చంద్రబాబు


psycopk

Recommended Posts

Chandrababu ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరతాం: సీఎం చంద్రబాబు 

01-09-2024 Sun 22:02 | Andhra
Chandrababu press meet at Vijayawada collectorate
 

 

  • ఏపీలో భారీ వర్షాలు
  • విజయవాడ ప్రాంతంలో వరదలు
  • 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయన్న చంద్రబాబు
  • వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడలో వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన బాధితుల పరిస్థితి పట్ల చలించిపోయారు. దీనిపై మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేపు కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. తద్వారా రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు. 

శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు వస్తోందని వివరించారు. మున్నేరు, బుడమేరు నుంచి కూడా భారీగా నీరు వస్తోందని చెప్పారు. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీళ్లు విజయవాడకు వచ్చాయని వెల్లడించారు. బుడమేరు నిర్వహణను వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాటు పట్టించుకోకపోవడమే దీనికి కారణం అని చంద్రబాబు మండిపడ్డారు. 

వరద బాధితులు సుమారు 2.76 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేశారు. ఇవాళ సింగ్ నగర్ లో వరద బాధితుల కష్టాలను స్వయంగా చూశానని తెలిపారు.  వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించాలని ఆదేశించానని పేర్కొన్నారు. 

రాష్ట్రానికి రేపు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 40 పవర్ బోట్లు, 6 హెలికాప్టర్లు వస్తున్నాయని వెల్లడించారు. సహాయ చర్యల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మోహరించామని అన్నారు. సహాయ చర్యలను రాత్రిపూట కూడా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 

కాగా, సమాచారం కోసం కమాండ్ కంట్రోల్ నెంబర్లు 112, 107 అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
Link to comment
Share on other sites

Narendra Modi: ఏపీలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ 

01-09-2024 Sun 23:12 | Andhra
PM Modi talks to Chandrababu on AP flood situations
 

  

ఏపీలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న వరద సహాయ చర్యలను సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు. అందుకు మోదీ స్పందిస్తూ... ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలను ఆదేశించామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని స్పష్టం చేశామని వెల్లడించారు. తక్షణమే ఆయా శాఖల నుంచి ఏపీకి అవసరమైన సామగ్రి పంపాలని ఆదేశించామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. 
Link to comment
Share on other sites

 

Chandrababu: ఏపీలో వరద పరిస్థితులను అమిత్ షాకు ఫోన్ లో వివరించిన సీఎం చంద్రబాబు 

01-09-2024 Sun 20:09 | Andhra
CM Chandrababu explains flood situations in AP to Amit Shah
 

 

  • ఏపీలో కుండపోత వానలు
  • విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం
  • నీట మునిగిన విజయవాడ
  • అన్ని రకాల సాయం అందిస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చిన అమిత్ షా
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు వరద సహాయ చర్యలను వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం... ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా పవర్ బోట్లు పంపాలని అమిత్ షాను కోరారు. 

ఈ సందర్భంగా అమిత్ షా సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సాయం చేస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. హోంశాఖ కార్యదర్శి ద్వారా తక్షణ సాయం అందేలా చూస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...