Jump to content

Proud to say i am CBN fan


psycopk

Recommended Posts

CM Chandrababu: రాత్రంతా విజ‌య‌వాడ‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోనే సీఎం చంద్ర‌బాబు 

02-09-2024 Mon 06:40 | Andhra
CM Chandrababu Naidu Visit Vijayawada Flood Effected Areas in the Night Time
 

 

  • రాత్రంతా అధికారుల‌తో క‌లిసి బోటులో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎం ప‌ర్య‌ట‌న‌
  • వ‌ర‌ద బాధితుల‌తో మాట్లాడుతూ, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్న చంద్ర‌బాబు
  • అర్ధరాత్రి 1.10 గంట‌ల‌కు కృష్ణ‌లంక‌లో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి
  • త్వ‌ర‌లోనే సాధార‌ణ ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని బాధితుల‌కు ధైర్యం చెప్పిన సీఎం
భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో సహాయ‌క చ‌ర్యల‌పై సీఎం చంద్ర‌బాబు దృష్టి సారించారు. రాత్రంతా విజ‌య‌వాడ‌లోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల‌తో క‌లిసి బోటులో తిరుగుతూ బాధితుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

ప్ర‌ధానంగా బుడ‌మేరు వ‌ర‌ద‌తో అస్త‌వ్య‌స్త‌మైన సింగ్ న‌గ‌ర్ ప్రాంతంలో సీఎం చంద్ర‌బాబు ఆదివారం అర్ధ‌రాత్రి రెండోసారి ప‌ర్య‌టించ‌డం గ‌మ‌నార్హం. అర్ధరాత్రి 1.10 గంట‌ల‌కు కృష్ణ‌లంక‌లోని 16వ డివిజ‌న్ పోలీసు కాల‌నీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రక్ష‌ణ గోడ వ‌ద్ద వ‌ర‌ద నీటిని ప‌రిశీలించారు. 

త్వ‌ర‌లోనే సాధార‌ణ ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని వ‌ర‌ద బాధితుల‌కు ధైర్యం చెప్పారు. అలాగే సింగ్ న‌గ‌ర్‌, కృష్ణలంక‌, ఫెర్రీ, ఇబ్ర‌హీంప‌ట్నం, జూపూడి, మూల‌పాడు ప్రాంతాల్లో వ‌ర‌ద ఉద్ధృతిని ప‌రిశీలించారు. అక్క‌డి బాధితుల‌ స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. దీంతో సీఎం చంద్ర‌బాబుపై పార్టీ శ్రేణులు, అభిమానుల‌తో పాటు ప‌లువురు సామాన్య ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

చంద్ర‌బాబుతో పాటు ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు నారాయ‌ణ‌, కొల్లు ర‌వీంద్ర‌, అనిత‌, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గ‌ద్దే రామ్మోహ‌న్‌, కృష్ణ‌ప్ర‌సాద్‌, క‌లెక్ట‌ర్ సృజ‌న‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు ఉన్నారు.
Link to comment
Share on other sites

Chandrababu: ఎంత మందిని రక్షించామన్నదే మన లక్ష్యం.. వృద్ధులు, రోగులను హోటళ్లలో ఉంచండి: చంద్రబాబు 

02-09-2024 Mon 10:44 | Andhra
Our aim is to save as many people as possible says Chandrababu
 

 

  • విజయవాడ కలెక్టరేట్ లో అత్యున్నత సమీక్ష నిర్వహించిన చంద్రబాబు
  • బోట్లు సైతం కొట్టుకుపోయేంత సమస్యలు ఉన్నాయన్న సీఎం
  • వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశం
కుండపోత వర్షాలతో ఏపీలో జలవిలయం కనిపిస్తోంది. విజయవాడ నగరం మొత్తం జలమయమయింది. భారీ వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రౌండ్ లో ఉంటూ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి కూడా ఆయన వరద ముంపు ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. నిత్యావసరాలను దగ్గరుండి అందించారు. 

ఈ ఉదయం విజయవాడ కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో చంద్రబాబు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఒక్కరాత్రి ధైర్యంగా ఉండాలని, తాము అన్ని విధాలుగా మీకు తోడుగా ఉన్నామని ప్రజలకు హామీ ఇచ్చామని చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా అధికార యంత్రాంగం పని చేయాలని అన్నారు. ఎంత మందిని రక్షించామనేదే మన ముందున్న లక్ష్యమని చెప్పారు. 

బోట్లు సైతం కొట్టుకుపోయేంత సమస్యలు మన ముందున్నాయని చంద్రబాబు అన్నారు. బోట్ల నుంచి వచ్చిన వారిని వెంటనే తరలించేందుకు బస్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా అవసరమైతే వారిని హోటళ్లలో ఉంచాలని సూచించారు. వరద బాధితుల కోసం కల్యాణమంటపాలు, ఇతర కేంద్రాలను సిద్ధం చేయాలని చెప్పారు. మొత్తం 47 సురక్షిత కేంద్రాలను గుర్తించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...