Jump to content

ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద.. శాంతించిన బుడమేరు.. ఊపిరి పీల్చుకుంటున్న విజయవాడ ప్రజలు


psycopk

Recommended Posts

Vijayawada Floods: ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద.. శాంతించిన బుడమేరు.. ఊపిరి పీల్చుకుంటున్న విజయవాడ ప్రజలు 

03-09-2024 Tue 11:10 | Andhra
Flood level reduced at Vijayawada Prakasam Barriage
 

 

  • ప్రకాశం బ్యారేజీ వద్ద 9.5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం
  • విజయవాడలో తగ్గుముఖం పట్టిన వరద
  • ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసిన ప్రభుత్వం
భారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. నిన్న విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా... ప్రస్తుతం 9.5 క్యూసెక్కులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికి నది నీటి మట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినా ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడిందని చెప్పారు. 

మరోవైపు బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకు బుడమేరు మహోగ్రరూపం దాల్చించి. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వదర నీరు వచ్చింది. దీని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దాదాపు 2.59 లక్షల మంది నీటిలోనే ఉండిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది.
Link to comment
Share on other sites

Chandrababu: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు: చంద్రబాబు 

03-09-2024 Tue 12:49 | Andhra
AP Cm chandrababu Review meeting with officials
 

 

  • వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష
  • బాధితులు అందరికీ ఆహారం అందించాలని సూచన
  • టెలికాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన ఏపీ సీఎం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతీ ఒక్కరికీ ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు మంగళవారం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీ వివరాలపై అధికారులను ఆరా తీశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాఫ్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా ఉంటే కలిగే బాధను అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట డ్రోన్లు, హెలికాఫ్టర్లు ఉపయోగించాలని సూచించారు. వందకు వంద శాతం ఆహార పంపిణీ జరగాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Link to comment
Share on other sites

Chandrababu: వరద ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించనున్న చంద్రబాబు 

03-09-2024 Tue 12:05 | Andhra
Chandrababu aerial view today in Vijayawada
 

 

  • వరదలతో చిరుగుటాకులా వణికిన విజయవాడ
  • యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టిన ప్రభుత్వం
  • పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం
జల విలయంలో విజయవాడ నగరం చిగురుటాకులా వణికింది. నగర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికారు. ఎన్నడూ లేనంతగా వచ్చిన వరదలతో నగరంలోని సింగ్ నగర్, నున్న, పాయకాపురం, భవానీపురం, న్యూ రాజేశ్వరిపేట, నందమూరి నగర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ ను చేపట్టింది. సీఎం చంద్రబాబు విజయవాడలోనే మకాం వేసి... రాత్రింబవళ్లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా బాధిత ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ధైర్యం చెపుతున్నారు. మరోవైపు వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఈరోజు ఏరియల్స్ వ్యూ చేయనున్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...