Jump to content

జగన్ డిప్లొమేటిక్ పాస్ పోర్ట్ రద్దు


psycopk

Recommended Posts

 

Jagan: జగన్ కు పాస్ పోర్ట్ కష్టాలు... లండన్ పర్యటన వాయిదా 

06-09-2024 Fri 14:55 | Andhra
Passport troubles to Jagan
 

 

  • జగన్ డిప్లొమేటిక్ పాస్ పోర్ట్ రద్దు
  • కోర్టు నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలన్న పాస్ పోర్ట్ కార్యాలయం
  • ఎన్ఓసీ ఇప్పించాలని హైకోర్టును కోరిన జగన్ న్యాయవాది
వైసీపీ అధినేత జగన్ కు పాస్ పోర్ట్ కష్టాలు వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో ఆయన డిప్లొమేటిక్ పాస్ పోర్ట్ రద్దయింది. దీంతో ఆయన జనరల్ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

ఈ క్రమంలో జగన్ కు ఐదేళ్ల జనరల్ పాస్ పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే, విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం పాస్ పోర్ట్ కాలపరిమితిని ఏడాదికి పరిమితం చేసింది. మరోవైపు ఎన్ఓసీ తెచ్చుకోవాలంటూ జగన్ కు పాస్ పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

వాదనల సందర్భంగా జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... లండన్ పర్యటనకు జగన్ కు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. మరోవైపు పాస్ పోర్ట్ కార్యాలయం న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జగన్ పై ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని తెలిపారు. కోర్టు నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని జగన్ కు పాస్ పోర్టు కార్యాలయం లేఖ కూడా రాసిందని చెప్పారు. 

దీంతో, పాస్ పోర్టు కోసం జగన్ కు ఎన్ఓసీని ఇప్పించాలని కోర్టును జగన్ తరపు న్యాయవాది కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పాస్ పోర్టు ఇబ్బందుల నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన వాయిదా పడింది. 

 

 

Link to comment
Share on other sites

YV Subba Reddy: వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి... జగన్, బాలినేని మధ్య విభేదాలు లేవు: వైవీ సుబ్బారెడ్డి 

06-09-2024 Fri 15:27 | Andhra
No differences between Jagan and Balineni says YV Subba Reddy
 

 

  • వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న వైవీ సుబ్బారెడ్డి
  • నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి అరెస్టులను ఖండించిన వైవీ
  • కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శ
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని సుబ్బారెడ్డి ఖండించారు. అక్రమ అరెస్ట్ లపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

సీఎం చంద్రబాబు ఇంటిపైకి వరదనీరు రాకుండా నీటిని మళ్లించడం వల్లే బుడమేరుకు వరద వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనివల్ల విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. వరద నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలను అరెస్టులు చేయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తోందని దుయ్యబట్టారు.

వైసీపీ అధినేత జగన్ కు, మాజీ మంత్రి బాలినేనికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీకి బాలినేని గుడ్ బై చెపుతున్నారనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. ప్రజా సమస్యల గురించి చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్ మెంట్ అడిగారేమోనని చెప్పారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తామని తెలిపారు.
Link to comment
Share on other sites

Vijayawada Floods: జగనన్న తీసుకొచ్చినవే ఈ రోజు విజయవాడ ప్రజలను వరద కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయి: రోజా 

06-09-2024 Fri 15:16 | Andhra
Roja shares videos of ration vehicles lined up in Vijayawada
 

 

  • విజయవాడలో ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ
  • ప్రారంభించిన మంత్రులు
  • కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న రేషన్ వాహనాలు
  • ఇవన్నీ జగనన్న తీసుకొచ్చినవే అంటూ రోజా ట్వీట్
విజయవాడలో ఇవాళ మంత్రులు ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో జగన్ తీసుకువచ్చిన రేషన్ వాహనాలు ఈ కార్యక్రమలో పాలుపంచుకుంటున్నాయి. దీనిపై వైసీపీ నేత రోజా స్పందించారు. 

జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు... జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ...జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు... జగనన్న నియమించిన వాలంటీర్ వ్యవస్థ... జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్... జగనన్న హయాంలో కొనుగోలు చేసిన 108, 104 వాహనాలు... జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు... జగనన్న తీసుకొచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు... ఈరోజు విజయవాడ ప్రజలను వరద కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాయి అంటూ ట్వీట్ చేశారు. 

ఈ మేరకు విజయవాడ రోడ్లపై బారులు తీరిన రేషన్ వాహనాల వీడియోలను రోజా పంచుకున్నారు.
Link to comment
Share on other sites

 

Vijayawada Floods: విజయవాడలో నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు 

06-09-2024 Fri 14:05 | Andhra
AP Ministers has began supply of essentials in Vijayawada
 

 

  • వరద బీభత్సం నుంచి తేరుకుంటున్న విజయవాడ నగరం
  • నిత్యావసర సరుకుల పంపిణీ షురూ చేసిన మంత్రులు అచ్చెన్న, నాదెండ్ల, కందుల 
  • ప్రతి ఇంటికీ సరుకులు 100 శాతం పంపిణీ అయ్యేలా ఆదేశాలు
భారీ వరదతో విలవిల్లాడిన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ విజయవాడలో నిత్యావసర వస్తువుల పంపిణీ వాహనాలను ప్రారంభించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ షురూ చేశారు. 

ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100 శాతం జరిగేలా మంత్రులు ఆదేశించారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ పంపిణీ చేస్తున్నారు. 

 

 

Link to comment
Share on other sites

15 minutes ago, psycopk said:

 

Jagan: జగన్ కు పాస్ పోర్ట్ కష్టాలు... లండన్ పర్యటన వాయిదా 

 

Veediki passport kastalu vastee yevariki kavali .... who cares really... afterall these politicians are also homo sapiens like us...nothing special about them... veeree job cheyyadam chetakaaani vallu andaru ela politics ki vastaaru emo... like lokesh, jagan , pawan kalyan...

ayina anni telisee scams chesi addamga pattubadi , shameless gaa looted money తో pedda pedda palaces loo vuntu malli vella kastalaki manam yedavallaa comedy gaa...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...