Jump to content

Nimmala Rama Naidu: శభాష్ రామానాయుడూ.... అభినందించిన నారా లోకేశ్


psycopk

Recommended Posts

Nimmala Rama Naidu: శభాష్ రామానాయుడూ.... అభినందించిన నారా లోకేశ్ 

07-09-2024 Sat 16:19 | Andhra
Nara Lokesh appreciates fellow minister Nimmala Ramanaidu
 

 

  • బుడమేరుకు మూడు గండ్లు
  • విజయవాడపై వరద పంజా
  • యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చివేత
  • 64 గంటల పాటు నిద్ర కూడా లేకుండా శ్రమించిన మంత్రి నిమ్మల
  • పనులు జరిగిన తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన నారా లోకేశ్
బుడమేరుకు పడిన మూడు గండ్లు ఎంత పనిచేశాయో అందరికీ తెలిసిందే. విజయవాడ నగర చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పంజా విసిరింది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే బెజవాడకు వరద తగ్గుతుందన్న నేపథ్యంలో, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్పించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. 

ఇవాళ బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్... సహచర మంత్రి నిమ్మల పడిన కష్టాన్ని గుర్తించి శభాష్ అని వీపు తట్టి మరీ అభినందించారు. నిమ్మల పనితీరును మెచ్చుకున్నారు. 

దాదాపు 64 గంటల పాటు నిద్ర లేకుండా, బుడమేరు కట్టపైనే మకాం వేసి అధికారులు, సిబ్బందితో గండ్లు పూడ్చివేతను పర్యవేక్షించిన విధానం నిమ్మల నిబద్ధత, బాధ్యతలకు అద్దంపడుతోంది. ఓ రాత్రి ఈదురుగాలులతో వర్షం పడుతుండగా, నిమ్మల గొడుగు వేసుకున్నప్పటికీ తడుస్తూనే పనులు చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ విధంగా మంత్రి నిమ్మల మూడు గండ్లను విజయవంతంగా పూడ్పించిన తీరు పట్ల నారా లోకేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, బుడమేరు గండ్లు పడిన సైట్ కు వచ్చిన లోకేశ్ కు నిమ్మల పనులు జరిగిన తీరును వివరించారు.
Link to comment
Share on other sites

Budameru: హమ్మయ్య.. బుడమేరు గండ్లు పూడ్చివేశారు 

07-09-2024 Sat 13:09 | Andhra
Army team plug third breach point at Budameru in Vijayawada
 

 

  • శుక్రవారం నుంచి నిరంతరాయంగా శ్రమించిన అధికారులు
  • మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో సాగిన పనులు
  • ఏజెన్సీలకు ఆర్మీ తోడవడంతో పూర్తయిన గండ్ల పూడ్చివేత
విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు గండ్లను అధికారులు పూడ్చివేశారు. భారీ వర్షాలకు ప్రవాహం పెరిగి బుడమేరు వాగుకు మూడు గండ్లు పడగా.. విజయవాడను వరద ముంచెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన జలవనరుల శాఖ అధికారులు బుడమేరు గండ్లను పూడ్చివేసేందుకు నిరంతరాయంగా శ్రమించారు. ఏజెన్సీల సాయంతో రెండు గండ్లను పూడ్చివేసిన అధికారులు.. మూడో గండిని పూడ్చేందుకు ఆర్మీ సాయం తీసుకున్నారు. ఉద్ధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు.

మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో శుక్రవారం నుంచి గండ్ల పూడ్చివేత పనులు నిరంతరాయంగా సాగాయి. మరో మంత్రి లోకేశ్ కూడా పనులను స్వయంగా పర్యవేక్షించారు. శనివారం మధ్యాహ్నానికి మూడో గండిని కూడా పూడ్చేయడంతో దిగువ ప్రాంతాలకు వరద నిలిచిపోయింది. కాగా, బుడమేరు డైవర్షన్ ఛానల్ కు ఒక్కసారిగా 60 వేల క్యూసెక్కుల వరద రావడం వల్లే గండ్లు పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ గండ్లను పూడ్చివేసేందుకు ఏజెన్సీలతో పాటు చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు కృషి చేశారని అధికారులు వివరించారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...