Jump to content

Floods -వరదల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం AP- రూ.6,800 కోట్లు, TG-5438crs


psycopk

Recommended Posts

Floods -వరదల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.6,800 కోట్లు: ఏపీ ప్రభుత్వం 

07-09-2024 Sat 18:13 | Andhra
AP Govt made initial report of flood damage
 

 

  • ఏపీలో వరద విలయం
  • భారీ వర్షాలు, వరదలతో విజయవాడ అతలాకుతలం
  • నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించిన ఏపీ సర్కారు
ఏపీలో భారీ వర్షాలు, వరదలు ఎంతటి విలయం సృష్టించాయో తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం ఇప్పటికీ వరద బీభత్సం నుంచి పూర్తిగా తేరుకోలేదు. 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32 మంది మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లు కోల్పోయారు. 1.69 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు... 18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఈ ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.6,800 కోట్లు అని పేర్కొంది. 

ఇందులో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.2,164.5 కోట్లు, జలవనరుల శాఖకు సంబంధించి రూ.1,568.6 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ.2 కోట్లు నష్టం జరిగినట్టు ప్రభుత్వం వివరించింది. 

కేంద్రానికి పంపేందుకు ఈ మేరకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  
  • Confused 1
Link to comment
Share on other sites

33 minutes ago, Android_Halwa said:

6800 crs…does that include karakatta kirayi kompa damages ?

Yes ofcourse, antha kasta padi save chesinappudu front lawn damages anna include seyyara vayya.

Link to comment
Share on other sites

56 minutes ago, akkum_bakkum said:

Yes ofcourse, antha kasta padi save chesinappudu front lawn damages anna include seyyara vayya.

Vishayam telisinda ? Maa sendranna is back to Hyderabad…

Visionary epudu emi chestado, ekadiki veltado, enduku veltado evariki teliyadu…

  • Sad 1
Link to comment
Share on other sites

 

Veedu flood management vishyam loo TDP govt ni titti titti pedutunnadu...

But he gave credit to both govts for completing retaining wall.

Link to comment
Share on other sites

Flood Damage: తెలంగాణలో వరద నష్టం ఎంతంటే...! 

08-09-2024 Sun 14:53 | Telangana
Telangana govt estimates flood damage in its initial report
 

 

  • తెలంగాణలో పలు జిల్లాలను అతలాకుతలం చేసిన వరదలు
  • రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదిక 
  • తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలన్న రేవంత్ సర్కారు
ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో, కేంద్ర సాయం పొందేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించింది. రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు రేవంత్ సర్కారు తన నివేదికలో వెల్లడించింది. 

ప్రధానంగా... రోడ్లు భవనాల శాఖ పరిధిలో రూ.2,362 కోట్లు, విద్యుత్ శాఖ పరిధిలో రూ.175 కోట్లు, పంటలు రూ.415 కోట్లు, నీటిపారుదల శాఖ పరిధిలో 629 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్థి, తాగునీటి శాఖ పరిధిలో రూ.170 కోట్లు, మున్సిపల్ శాఖ పరిధిలో రూ.1,150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. 

వారం రోజులుగా అతలాకుతలం చేసిన వరదల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటుండగా, వాస్తవంగా జరిగిన నష్టం ప్రభుత్వం పేర్కొన్న దాని కంటే ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాతే వరద నష్టంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. 

ఇటీవలి వరదల్లో ఖమ్మం, మహబూబాబాద్, మరి కొన్ని జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇళ్లు కోల్పోయి, పంటలు నష్టపోయి, పశువులు, ఇతర జీవనాధారాలు కోల్పోయిన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
Link to comment
Share on other sites

  • psycopk changed the title to Floods -వరదల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం AP- రూ.6,800 కోట్లు, TG-5438crs

Flood Damage: వరద నష్టంపై ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం 

08-09-2024 Sun 16:50 | Andhra
AP Govt releases statement on flood damage
 

 

  • ఏపీలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు, వరదలు
  • 45 మంది చనిపోయారని వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
  • అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడి
  • మొత్తం 6.44 లక్షల మందిపై వరద ప్రభావం పడినట్టు వివరణ
ఏపీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రకటన చేసింది. వరదల కారణంగా 45 మంది చనిపోయారని ఆ ప్రకటనలో వెల్లడించింది. 

ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మరణించినట్టు వివరించింది. 

ఇక, రాష్ట్రవ్యాప్తంగా 6.44 లక్షల మందిపై వరద ప్రభావం పడినట్టు వెల్లడించింది. 246 పునరావాస శిబిరాల్లో 49 వేల మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. 

వరదల కారణంగా 3,913 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, 20 జిల్లాల్లో 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం పేర్కొంది. 12 జిల్లాల్లో 19 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు వెల్లడించింది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...