Jump to content

Nara Lokesh: ప్యాలస్ లో రిలాక్స్ అవుతూ ప్రభుత్వంపై విమర్శలా? మాజీ సీఎం జగన్ పై మండిపడ్డ మంత్రి లోకేశ


psycopk

Recommended Posts

Nara Lokesh: ప్యాలస్ లో రిలాక్స్ అవుతూ ప్రభుత్వంపై విమర్శలా? మాజీ సీఎం జగన్ పై మండిపడ్డ మంత్రి లోకేశ్ 

08-09-2024 Sun 14:06 | Andhra
AP Minister Nara Lokesh Fires On Former CM Jagan
 

 

  • బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్
  • సొంత డబ్బుతో మీరు కనీసం పులిహోర ప్యాకెట్ అందించారా?
  • 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు సాయం చేస్తున్నారని వెల్లడి
  • అలాంటి నాయకుడిపై విమర్శలు ఎలా చేస్తున్నారని నిలదీత
వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులను ఆదుకోవడానికి ఓవైపు 74 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు కష్టపడుతుండగా.. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి మాత్రం తన ప్యాలస్ లో సేదతీరుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. సహాయక కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నాయకుడిపై విమర్శలు ఎలా చేయగలుగుతున్నారని నిలదీశారు. బురద రాజకీయానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని లోకేశ్ విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష హోదా అందుకునే హుందాతనం మీకుందా జగన్ అని సూటిగా ప్రశ్నించారు. పాస్ పోర్ట్ సమస్య లేకుంటే జగన్ ఎప్పుడో లండన్ ఎగిరిపోయే వారని అన్నారు. విపత్తులతో ఇబ్బందిపడుతున్న జనాలకు ఏనాడైనా సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ పంచిన చరిత్ర ఉందా అని జగన్ ను లోకేశ్ నిలదీశారు. జగన్ సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందేనన్నారు. అప్పట్లో బుడమేరు ఆధునికీకరణకు చంద్రబాబు రూ.464 కోట్లు కేటాయించారని, పనులు కూడా ప్రారంభించారని లోకేశ్ గుర్తుచేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఆ పనులను నిలిపివేశారని, ప్రస్తుత వరదలకు కారణమయ్యారని మండిపడ్డారు. ఆధునికీకరణ, మరమ్మతు పనులను జగన్ ఆపేయగా.. ఆయన పార్టీ నేతలు దాదాపు 600 ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పారు. బుడమేరుకు 2022 లోనే గండి పడినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వహణ గాలికి వదిలేశారని ఆరోపించారు.

విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారని చెప్పారు. బుడమేరు పొంగడానికి కారణం జగనేనని, ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని ఆరోపించారు. జగన్ పాలనా వైఫల్యాలు నేడు జనాలను కష్టాల్లోకి నెట్టాయని వివరించారు. సమస్యలన్నీ అధిగమిస్తామని, వరద బాధితులు అందరికీ సాయం అందించే వరకూ టీడీపీ ప్రభుత్వ యంత్రాంగం విశ్రమించబోదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Vangalapudi Anitha: జగన్ సొంత డబ్బుతో ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు: హోంమంత్రి అనిత 

08-09-2024 Sun 15:15 | Andhra
Home minister Anitha slams Jagan over Vijayawada flood
 

 

  • విజయవాడలో వరద పరిస్థితులపై హోంమంత్రి అనిత ప్రెస్ మీట్
  • చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లకుండా శ్రమిస్తున్నారని వెల్లడి
  • నిమ్మల బుడమేరు కట్టపైనే మూడ్రోజులు ఉన్నారని వివరణ
  • జగన్ బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు చెబుతున్నారని విమర్శలు
విజయవాడలో వరద పరిస్థితులు, సహాయక చర్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు వినాయకచవితి పండుగ కూడా జరుపుకోకుండా క్షేత్రస్థాయిలో ఉంటూ శ్రమిస్తున్నారని అనిత పేర్కొన్నారు. వరద వచ్చినప్పటి నుంచి ఆయన విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటూ, ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శిస్తూ, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 

నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మూడ్రోజుల పాటు బుడమేరు వద్దే మకాం వేసి, నిద్ర కూడా లేకుండా, గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇంతగా పాటుపడుతుంటే, జగన్ తన పేటీఎం బ్యాచ్ ను దించి విషప్రచారం చేయిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 

జగన్ తన సొంతడబ్బుతో కనీసం ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదని, బెంగళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నారని విమర్శించారు. 

ఇక, విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు నిలిచే ఉందని వెల్లడించారు. వరద ముంపు బాధితులకు ఆహారం, నీరు సరఫరా చేస్తున్నామని... ఉదయం వేళల్లో టిఫిన్లు, మంచినీరు, పాల ప్యాకెట్లు అందించామని అనిత వివరించారు. 

నగరంలోని ముంపు కాలనీల్లో 170 వాటర్ ట్యాంకులు తిరుగుతున్నాయని, వాటర్ ట్యాంకులు రోజూ వందల ట్రిప్పులు తిరుగుతున్నాయని తెలిపారు. అగ్నిమాపక దళం సాయంతో ఇప్పటివరకు 27 వేలకు పైగా ఇళ్లలో బురదను తొలగించినట్టు అనిత పేర్కొన్నారు. 

డ్రోన్లతో ఆహారం సరఫరాతో పాటు, క్లోరినేషన్ ప్రక్రియ కూడా చేపట్టామని వెల్లడించారు. కేవలం డ్రోన్ల సాయంతోనే లక్షకు పైగా ఆహార ప్యాకెట్లను బాధితుల వద్ద చేర్చామని స్పష్టం చేశారు.

వినాయకచవితి మండపాలకు ఎలాంటి చలానాలు విధించలేదని వెల్లడించారు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవో తీసుకువచ్చింది జగన్ ప్రభుత్వమేనని అనిత ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలియగానే, ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేశారని వెల్లడించారు. 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...