Jump to content

Heavy Rains: ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు... చంద్రబాబ


psycopk

Recommended Posts

 

 

Heavy Rains: ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు... చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ 

08-09-2024 Sun 18:28 | Andhra
AP govt announces holiday in two districts due to heavy rains
 

 

  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
  • అధికారులను అప్రమత్తం చేసిన చంద్రబాబు
భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. 

దాంతో, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు సోమవారం నాడు సెలవు ప్రకటించినట్టు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

అల్లూరి జిల్లా కలెక్టర్ కూడా విద్యాసంస్థలకు సెలవుపై స్పందించారు. జిల్లాకు భారీ వర్షసూచన ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు.

కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఏలేరు ప్రాజెక్టు స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని స్పష్టం చేశారు. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా చూసుకోవాలని సూచించారు. ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 

ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నచ్చచెప్పి పునరావాసా కేంద్రాలకు తరలించాలని చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వరదలు, వర్షాలపై ప్రజలకు అలర్ట్ సందేశాలను ఫోన్ ద్వారా పంపాలని సూచించారు. నాగావళి, వంశధార నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశముందని తెలిపారు. 

ఇక విశాఖలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లు 0891-2590102, 0891-2590100 కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు 

 

 

  • Haha 1
Link to comment
Share on other sites

 

Heavy Rains: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు 

08-09-2024 Sun 15:32 | Andhra
Heavy rain alert for Northern Andhra districts due to depression in Bay Of Bengal
 

 

  • పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం
  • పశ్చిమ వాయవ్య దిశగా పయనం
  • రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
  • గత రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం
  • ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్ లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేసింది.

కాగా, వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని... నేడు అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. విశాఖ, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పుడు భారీ వర్ష సూచనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

 

 

  • Haha 1
Link to comment
Share on other sites

Chandrababu: విశాఖ, అల్లూరి జిల్లాలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది: సీఎం చంద్రబాబు 

08-09-2024 Sun 21:49 | Andhra
Chandrababu says there will be happened landslides in Visakha and Alluri districts
 

 

  • ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
  • కలెక్టర్లను అప్రమత్తం చేశామన్న చంద్రబాబు
  • కొండప్రాంతాల్లో ఉండే వారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏలేరు ప్రాజెక్టు ఇన్ ఫ్లో గమనించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

విశాఖ, అల్లూరి జిల్లాల్లో వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వెల్లడించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. 

విజయవాడలో తాము చేపట్టిన సహాయక చర్యల పట్ల గవర్నర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు. వరదకు కారణాలు, సహాయ చర్యల గురించి గవర్నర్ కు నివేదించామని వెల్లడించారు.  

విజయవాడలో ఇంకా 0.51 టీఎంసీల నీరు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వర్షం లేకుంటే రేపు (సెప్టెంబరు 9) సాయంత్రానికి ఆ నీరు కూడా తగ్గుతుందని వివరించారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

బుడమేరు ఇన్ ఫ్లో, నగరంలో వర్షపాతం చూసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ సామగ్రి బాగు చేయించడం పెద్ద సవాల్ గా మారిందని అన్నారు.
  • Haha 1
Link to comment
Share on other sites

4 hours ago, BattalaSathi said:

endho endaa kaalam selavalu vinetollam..ippudu poragallaki vaana kaalam selavalu kooda..do festival raa pilla bachas...

అటు తిప్పి ఇటు తిప్పి దసరా హాలీడేస్  కోస్తారులే 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...