Jump to content

YS Jagan: నేడు తాడేపల్లికి జగన్ .. రేపు గుంటూరు పర్యటన ..ఎందుకంటే..? 


psycopk

Recommended Posts

 

YS Jagan: నేడు తాడేపల్లికి జగన్ .. రేపు గుంటూరు పర్యటన ..ఎందుకంటే..? 

10-09-2024 Tue 09:04 | Andhra
jagans arrival at tadepalli today
 

 

  • ఈ రోజు సాయంత్రం 5.40 గంటలకు బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న వైఎస్ జగన్
  • గన్నవరం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.25 గంటలకు తాడేపల్లి నివాసానికి జగన్
  • రేపు (బుధవారం) గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించనున్న జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు బెంగళూరు నుండి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు. 

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు యలహంక నివాసం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ జగన్ .. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 3.25 గంటలకు చేరుకుంటారు. 4.05 గంటలకు విమానంలో బయలుదేరి 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.25 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు. 

రేపు (బుధవారం) గుంటూరు వెళ్లి జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శిస్తారు. నందిగం సురేశ్‌ను ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

 

 

Link to comment
Share on other sites

YSRCP: ఆ బోట్లు టీడీపీ వాళ్లవే: వైసీపీ 

10-09-2024 Tue 10:02 | Andhra
YCP Counter Tweet On TDP
 

 

  • నిందితుల్లో ఒకరైన కోమటి రామ్మోహన్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధిపతి కోమటి జయరాంకు బంధువు అని పేర్కొన్న వైసీపీ 
  • మరో నిందితుడు ఉషాద్రి టీడీపీ వ్యక్తే, లోకేశ్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉన్నాయన్న వైసీపీ
  • మీ డ్రామా మొత్తం రివర్స్ అయిందంటూ వైసీపీ కౌంటర్ ట్వీట్  
ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనే ఉద్దేశంతో వైసీపీ వారే కుట్ర పూరితంగా కృష్ణానదిలోకి ఐదు బోట్లు వదిలారని సీఎం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ స్పందిస్తూ ఆ బోట్లు టీడీపీ వారివేనని పేర్కొంది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు టీడీపీ నేతలకు సంబంధించిన వారేనని పేర్కొంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

నిందితుల్లో ఒకరైన కోమటి రామ్మోహన్ .. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధిపతి కోమటి జయరామ్‌కు బంధువు అని వైసీపీ పేర్కొంది. ఇక రెండో నిందితుడు ఉషాద్రి కూడా టీడీపీకి చెందిన వ్యక్తేనని, అతను నారా లోకేశ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయని చెప్పింది. ఆ బోట్లు నడిపింది కూడా అతనేనని చెప్పింది. కోమటి రామ్మోహన్ మైలవరం టీడీపీ టికెట్ ఆశించిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుకి అత్యంత సమీప బంధువు అనే విషయం బయటపడే సరికి మీ డ్రామా మొత్తం రివర్స్ అయిపోయిందని విమర్శించింది.

చంద్రబాబు, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావుతో కోమటి రామ్మోహన్ కి ఎంత సాన్నిహిత్యం ఉందో ఈ ఫోటోలను చూస్తేనే అర్ధం అవుతుందని వైసీపీ పేర్కొంది. అడ్డంగా దొరికిపోయాక ఇంకెందుకు ఈ బుకాయింపులు? అని ప్రశ్నించింది. నిన్న టీడీపీ చేసిన ట్వీట్‌కు రిప్లైగా వైసీపీ కౌంటర్ ఇస్తూ టీడీపీ నేతలతో నిందితుడు ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...