Jump to content

Nara Lokesh: ప్రకాశం బ్యారేజిని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలనేదే జగన్ లక్ష్యం: నారా లోకేశ్


psycopk

Recommended Posts

Nara Lokesh: ప్రకాశం బ్యారేజిని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలనేదే జగన్ లక్ష్యం: నారా లోకేశ్ 

10-09-2024 Tue 15:58 | Andhra
Nara Lokesh severe allegations on Jagan
 

 

  • ఇటీవల ప్రకాశం బ్యారేజి గేట్లను ఢీకొట్టిన బోట్లు
  • గతంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి కారణమయ్యారన్న లోకేశ్
  • ఇప్పుడు మరో కుట్ర పన్నారని వెల్లడి
  • ప్లాన్ జగన్ ది... అమలు చేసింది తలశిల, నందిగం అని వివరణ 
ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజిని కూల్చి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపించారు. 

"గత ప్రభుత్వ హయాంలో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ ను కొట్టుకుపోయేలా చేసి ప్రాణ నష్టానికి కారణమయ్యారు. 50 మందిని చంపేసి, ఐదు గ్రామాలను నామరూపాల్లేకుండా చేశారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజిని ఇనుప పడవలతో ఢీకొట్టి కూల్చాలన్ని కుట్ర చేశారు. 

విజయవాడతో పాటు  పదుల సంఖ్యలో లంక గ్రామాలను నామరూపాల్లేకుండా చేయాలన్న సైకో జగన్ కుట్ర బయటపడింది. ప్రజలను జలసమాధి చేయాలన్న కుట్రకు ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే... ఆ ప్రణాళికను అమలు చేసింది తలశిల రఘురాం, నందిగం సురేశ్" అంటూ నారా లోకేశ్ వివరించారు. 

తమ కుట్రలు బయటపడకుండా... వరద ముంపునకు కారణం ప్రభుత్వమే అంటూ సైకో జగన్ ముఠా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 
  • Haha 1
Link to comment
Share on other sites

Anitha: అదే జరిగి ఉంటే లక్షల మంది ప్రాణాలు పోయేవి: అనిత 

10-09-2024 Tue 14:21 | Andhra
Anitha press meet on boats hitting Prakasam Barrage
 

 

  • ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చేటట్టు చేశారన్న అనిత
  • ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమయ్యారని మండిపాటు
  • అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించాలని వ్యాఖ్య
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రాలేదని, కొట్టుకు వచ్చేటట్టు చేశారని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. బ్యారేజీని ఢీకొన్న ఐదు బోట్లు ప్రమాదవశాత్తు రాలేదని... ఇది మేన్ మేడ్ ఇన్సిడెంట్ అని చెప్పారు. తొలుత బోట్లు కొట్టుకొచ్చాయనే అనుకున్నామని... కానీ ఘటనపై విచారణ జరిపించిన తర్వాత షాకింగ్ విషయాలు తెలిశాయని అన్నారు. 

చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కుట్ర చేశారని... ఇందులో భాగంగా విధ్వంసం సృష్టించేందుకు, ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వాళ్లు సిద్ధమయ్యారని... అలాంటి వాళ్లను దేశద్రోహులుగా పరిగణించాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఎవరనుకుంటున్నారనే విషయంపై ప్రజలు కూడా చర్చించుకోవాలని సూచించారు.   

సాధారణంగా బోట్ల వెయిట్ ని, సైజును బట్టి వాటిని కడతారని... పెద్ద బోట్లను ఐరన్ వైర్లతో కడతారని అనిత చెప్పారు. చిన్నచిన్న బోట్లను కూడా ఒకదానికొకటి కట్టరని... ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగిలినవి కూడా కొట్టుకుపోతాయని అన్నారు. అలాంటిది 40 నుంచి 50 టన్నుల బరువుండే మూడు పెద్ద బోట్లను నైలాన్ తాడుతో కట్టారని చెప్పారు. ఉద్ధండరాయునిపాలెం రేవులో ఉండాల్సిన ఈ బోట్లు ఇక్కడకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఈ బోట్లు కౌంటర్ వెయిట్లను తాకడంతో ప్రమాదం తప్పిందని... అదే డ్యామ్ పిల్లర్లను తాకి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని... లక్షలాది మంది ప్రాణాలు పోయేవని అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. ఈ బోట్ల యజమానులు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం అనుచరులని చెప్పారు. బోట్లు ఢీకొన్న ఘటన వెనుక ఇంకా ఏయే కోణాలున్నాయో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
Link to comment
Share on other sites

Varla Ramaiah: ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో నూటికి నూరు శాతం జ‌గ‌న్ పాత్ర ఉంది: వర్ల రామయ్య 

10-09-2024 Tue 14:56 | Andhra
TDP Varla Ramaiah Sensational Comments on Ex CM YS Jagan
 

 

  • మీడియా స‌మావేశంలో టీడీపీ నేత వర్ల రామయ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
  • 20 ల‌క్ష‌ల ఎక‌రాలకు సాగు నీటిని అందించే ప్రాజెక్టును కూల్చాల‌ని చూశారంటూ వ్యాఖ్య‌
  • ప్ర‌స్తుతం పోలీసులు అదుపులో ఉన్న‌వారు పాత్ర‌ధారులు మాత్రేమేన‌న్న టీడీపీ నేత‌
  • అసలు సూత్ర‌దారుల‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించేవ‌రకు ప‌క‌డ్బందీగా ద‌ర్యాప్తు చేయాల‌ని సూచ‌న‌
  • ఈ ఘ‌ట‌న ద్వారా మాజీ సీఎం జ‌గ‌న్ క్రిమిన‌ల్ మెంటాలిటీ మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని విమ‌ర్శ‌
ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. 

బ్యారేజీ గేట్లను ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రిని, సూరాయపాలెం వాసి కోమటి రామ్మోహన్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం వారిని విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రుప‌రిచారు. న్యాయ‌స్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.  

ఇదే విష‌యమై తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నిందితుల తాలూకు రిమాండ్ రిపోర్టును ఆయ‌న చ‌దివి వినిపించారు. ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ఠపాలు చేయ‌డానికే ఈ కుట్ర చేసిన‌ట్లు నిందితులు అంగీక‌రించార‌ని ఆయ‌న తెలిపారు. మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత స‌జ్ట‌ల రామ‌కృష్ణారెడ్డికి తెలియ‌కుండా ఇది జ‌రిగే ప్ర‌సక్తే లేద‌ని వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. 

దాదాపు 20ల‌క్ష‌ల ఎక‌రాల సాగుకు నీటిని అందించే జాతీయ ఆస్తి అయిన ప్ర‌కాశం బ్యారేజీని ధ్వంసం చేయ‌డానికి కుట్ర చేయ‌డం సిగ్గుచేటు అని అన్నారు. ఇంత పెద్ద కుట్ర వెనుక ఉన్న‌ బ‌ల‌మైన శ‌క్తిని బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని డీజీపీ తిరుమ‌ల‌రావును ఆయ‌న కోరారు. ఎట్టిప‌రిస్థితుల్లో ఈ విష‌యాన్ని ఈజీగా తీసుకోవ‌డానికి వీల్లేద‌ని చెప్పారు. పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసి, స‌మ‌యానికి నిందితులను అరెస్టు చేశార‌ని అన్నారు. 

అయితే, అరెస్టైన వారు కేవ‌లం పాత్ర‌ధారులు మాత్ర‌మేన‌ని అస‌లు సూత్ర‌ధారులు వేరే ఉన్నార‌ని వ‌ర్ల రామ‌య్య తెలిపారు. వారిని బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని పోలీసులకు సూచించారు. 

ఇలాంటి కుట్ర‌పూరిత చ‌ర్య‌తో చ‌ట్ట‌బ‌ద్ధంగా, ప్ర‌జ‌ల స‌మ్మ‌తితో ఎంపికైన ప్ర‌భుత్వంపై మీరు యుద్దం ప్ర‌క‌టించిన‌ట్లేనని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. దీన్ని దేశ ద్రోహం నేరంతో స‌మానంగా భావించి, అధికారులు సీరియ‌స్‌గా ద‌ర్యాప్తు చేయాల‌ని తెలిపారు.   

అలాగే ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం జ‌గ‌న్‌పై కూడా వ‌ర్ల రామ‌య్య తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి మెంటాలిటీ క్రిమిన‌ల్ మెంటాలిటీ అని విమర్శించారు. ఎన్నిక‌ల్లో గెల‌వడానికి బాబాయ్‌ని గొడ్డ‌లితో న‌రికించాడ‌ని, ఆ త‌ర్వాత కేసు ద‌ర్యాప్తును త‌ప్పుదోవ ప‌ట్టించాడంటూ జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. ఏకంగా సీబీఐ అధికారులపై కేసులు న‌మోదు చేయించే స్థాయికి వెళ్లిన వ్య‌క్తి అని అన్నారు. 

ఇక, గ‌త ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి త‌న‌పై గుల‌క‌రాయితో దాడి చేయించుకున్నాడ‌ని ఆరోపించారు. ఏదో ఒక‌టి చేసి అధికారంలో ఉండాల‌ని చూశాడంటూ జ‌గ‌న్‌పై దుమ్మెత్తిపోశారు. తాను 50 ఏళ్ల నుంచి ప్ర‌భుత్వ పాల‌న విధానాన్ని ప‌రిశీలిస్తున్నాన‌ని, కానీ జ‌గ‌న్ లాంటి నేత‌ను ఎక్క‌డ చూడ‌లేద‌న్నారు. 

ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఐడీ, సీబీఐ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, ఇత‌ర కీల‌క‌ రికార్డుల‌ను జ‌గ‌న్ ద‌గ్ధం చేయించాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇలా విలువైన రికార్డుల‌ను త‌గ‌ల‌బెట్ట‌డం తాను ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు. ఎంతో క్రిమిన‌ల్ నాలెడ్జ్ ఉన్న జ‌గ‌న్... ప్ర‌కాశం బ్యారేజీ కూల్చివేత‌కు కుట్ర ప‌న్న‌లేదంటే ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని వ‌ర్ల రామ‌య్య పేర్కొన్నారు. 

ఈ కుట్ర‌లో నూటికి నూరు శాతం జ‌గ‌న్ పాత్ర ఉంద‌ని ఆరోపించారు. మీ వ‌ల్ల ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఇప్పుడు పేరు మార్చుకుని పద్మ‌నాభ రెడ్డిగా మారార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక‌ప్పుడు ఎంతో పేరు ప్ర‌ఖ్యాతలు ఉన్న ముద్ర‌గ‌డ‌ ఇవాళ ఓ మూల‌కు ముసుగు వేసుకుని కూర్చున్నాడని, ఇదంతా జ‌గ‌న్‌ క్రిమిన‌ల్ ఇన్‌స్టిట్యూట్‌లో భాగం అని విమ‌ర్శించారు. 

ప్ర‌తి అధికారి, అధికార‌ యంత్రాంగం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసే ప్ర‌తి అడుగును జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల‌ని వ‌ర్ల రామ‌య్య కోరారు. ఇవాళ ప్ర‌కాశం బ్యారేజీకి ఎస‌రు పెట్టిన వ్య‌క్తి రేపు మ‌రో విధంగా ఏదైనా చేయొచ్చ‌ని, అంద‌రూ త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.
Link to comment
Share on other sites

Chandrababu: జగన్ విజయవాడకు వచ్చి బురదలో తిరిగితే పాపాలు కొంతైనా పోయేవి: చంద్రబాబు 

09-09-2024 Mon 18:24 | Andhra
Chandrababu fires at ys jagan for blaming government over floods
 

 

  • ప్రజల కష్టాలను, ఇబ్బందులను తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న చంద్రబాబు
  • తనతో పాటు మంత్రులు, అధికారులు బురదలో తిరుగుతున్నారని వ్యాఖ్య
  • బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారన్న చంద్రబాబు
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విజయవాడ వచ్చి బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవని, కానీ బెంగళూరులో కూర్చోని తమపై బురద జల్లుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారీ వరదల నేపథ్యంలో ప్రజల కష్టాలను, ఇబ్బందులను తీర్చడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. తనతో పాటు మంత్రులు, అధికారులు కూడా వరదల్లో, బురదలో తిరుగుతున్నారన్నారు.

వరదలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు పడుతున్న బాధలు చెప్పలేనివని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరుకు గండ్లు పడితే గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. పైగా బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. ఇది పెద్ద సవాల్ అని, దీనిని అధిగమించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారికి ఆదాయం వచ్చే మార్గాలను చూపిస్తామన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి వెళ్లిందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు చెప్పారు. లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ గద్దె దిగిపోయారని, ఇప్పుడు కనీసం ఇక్కడకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నా ఆయన పాపాలు కొంత పోయేవన్నారు. 

ఆ చిన్నారులకు చంద్రబాబు ప్రశంస

పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం, పడమర విప్పర్రు గ్రామంలో శ్రీవిద్యానికేతన్ స్కూల్‌కు చెందిన చిన్నారులు వరద బాధితుల కోసం తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

"చిన్నారులు అసాధారణ కరుణను ప్రదర్శించారు. మొత్తం రూ.31 వేలను సేకరించి అందించడం నిజంగా చాలా గ్రేట్. విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం పట్ల స్కూలు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. అవసరం ఉన్న వారి పట్ల శ్రద్ధ వహించడం, సాయం చేయడాన్ని వారికి బోధించడం చాలా గొప్ప విషయం. ఈ విలువలను విద్యార్థులు పాటించేలా చూసిన పాఠశాల యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి. దయగల, బాధ్యతగల పౌరుల నేతృత్వంలో మంచి భవిష్యత్తుకు ఇలాంటి సంఘటనలు వాగ్దానం చేస్తాయి" అని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

1 minute ago, vetrivel said:

Lol shameless pacha paytms

 

shameless psycho yellow dumb leaders

Plan fail aaindi feel avutunava… sigu seram leni paytm dogs

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...