Jump to content

Kadabari Jethwani: నటి జత్వానీపై ఫిర్యాదుకు ముందే విమాన టికెట్లు బుకింగ్.. బయటపడిన పోలీసుల కుట్ర కోణ


psycopk

Recommended Posts

11 hours ago, Android_Halwa said:

Nuv well educated anta kada, yellow lies la research chesinav anta kada…

Case endo kastha chepochu kada kaka..

KMPD ra PP

 

KUTHA  MOOSKONI PAKKA KI DHENGEI RA PILLA ** 

Link to comment
Share on other sites

AP DGP: హీరోయిన్ జెత్వానీ కేసులో లోతైన విచారణ జరగాల్సి ఉంది: ఏపీ డీజీపీ 

18-09-2024 Wed 16:00 | Andhra
AP DGP on actress Jetwani case
 

 

  • జెత్వానీ కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందన్న డీజీపీ
  • ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య
  • ధైర్యంగా పని చేసేలా పోలీసులను సంసిద్ధం చేస్తున్నామన్న డీజీపీ
ముంబయి హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

మరోవైపు ఈ అంశంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ... జెత్వానీ కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందని... ఈ కేసులో ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. 

ప్రజలకు మెరుగైన సేవలు అందిచడమే తమ లక్ష్యమని అన్నారు. లైంగిక దాడులను నివారించడం కోసం ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నామని చెప్పారు. ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పోలీసులు ధైర్యంగా పని చేసేలా వారిని సంసిద్ధం చేస్తున్నామని డీజీపీ చెప్పారు. పోలీసుల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. పోలీస్ క్యాంటీన్ల వర్కింగ్ కేపిటల్ కింద రూ. 4.7 కోట్లు ఇచ్చామని చెప్పారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం విజయవాడ, విశాఖలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని... అన్ని జిల్లా కేంద్రాల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడానికి యాంటీ నార్కోటిక్స్ విభాగానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. విధి నిర్వహణలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. చిన్నపిల్లలు, బాలికలపై జరగుతున్న లైంగిక దాడులను అందరూ కలిసి అరికట్టాల్సిన అవసరం ఉందని డీజీపీ తెలిపారు.
Link to comment
Share on other sites

Budda Venkanna: సీఎం కార్యాలయంలో కుట్ర.. హీరోయిన్ ను ముగ్గురు ఐపీఎస్ లు చిత్రహింసలు పెట్టారు: బుద్దా వెంకన్న 

18-09-2024 Wed 12:47 | Andhra
Those IPS officers tortured Heroine says Budda Venkanna
 

 

  • జగన్ ఆదేశాలను పీఎస్సార్ ఆంజనేయులు అమలు చేశారన్న బుద్దా
  • పీఎస్సార్ ను అరెస్ట్ చేసి, విచారించాలని డిమాండ్
  • తప్పు చేసిన ఐపీఎస్ లను శిక్షించాలని వ్యాఖ్య
ముంబై హీరోయిన్ జత్వానీని ముగ్గురు ఐపీఎస్ అధికారులు చిత్రహింసలు పెట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంవో కార్యాలయంలో కుట్ర జరిగిందని చెప్పారు. జగన్ ఆదేశాలను పీఎస్సార్ ఆంజనేయులు అమలు చేశారని... ఆంజనేయులు ఆదేశాలతో కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ ఆ హీరోయిన్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. గున్నీ ఇచ్చిన స్టేట్మెంట్ తో ఈ విషయం బయటపడిందని చెప్పారు. 

పీఎస్సార్ ఆంజనేయులు గతంలో కూడా ఎంతో మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని బుద్దా ఆరోపించారు. గున్నీ స్టేట్మెంట్ ఆధారంగా ఆంజనేయులుని అరెస్ట్ చేసి విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. దీని వెనుకున్న జగన్ పాత్ర కూడా వెలుగు చూస్తుందని అన్నారు. ముగ్గురు ఐపీఎస్ లు ఒక ఆడపిల్లను హింసించడం దారుణమని మండిపడ్డారు. తప్పు చేసిన అధికారులను కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు. 

గతంలో జగన్ చెప్పినట్టు పోలీసు అధికారుల సంఘం మాట్లాడిందని... ఇప్పుడు కూడా ఈ ముగ్గురు పోలీసుల నిర్వాకంపై స్పందించాలని బుద్దా డిమాండ్ చేశారు. వీళ్లను వదిలేస్తే మళ్లీ ఇలాగే చేస్తారని... వీళ్లను వదిలి పెట్టకూడదని అన్నారు. కక్షపూరిత రాజకీయాలు వద్దని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమకు చెప్పారని... అందుకే తాము సైలెంట్ గా ఉన్నామని చెప్పారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...