Jump to content

Anna jump to banglore palace


psycopk

Recommended Posts

 

YS Jagan: మ‌ళ్లీ బెంగ‌ళూరుకే జ‌గ‌న్.. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌పై నో క్లారిటీ! 

14-09-2024 Sat 06:23 | Andhra
AP Ex CM YS Jagan Bengaluru Tour 9th Time
 

 

  • సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌గ‌న్ బెంగ‌ళూరు వెళ్ల‌డం ఇది తొమ్మిదోసారి
  • ఈ నెల 3 నుంచి 25 మ‌ధ్య లండ‌న్ వెళ్ల‌డం కోసం హైద‌రాబాద్ సీబీఐ కోర్టులో అనుమ‌తి
  • జ‌గ‌న్ పాస్‌పోర్టు రెన్యువ‌ల్ విష‌యంలో విజ‌య‌వాడ‌లోని ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు ష‌ర‌తులు
  • వాటిని ర‌ద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన మాజీ సీఎం 
  • ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌టన‌పై సందిగ్ధ‌త‌
వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి బెంగ‌ళూరు వెళ్లారు. శుక్ర‌వారం పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న ఆ త‌ర్వాత నేరుగా బెంగ‌ళూరుకే వెళ్లిపోయారు. కాగా, సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఆయ‌న బెంగ‌ళూరు వెళ్ల‌డం ఇది తొమ్మిదోసారి. 

దీంతో జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. ఈ నెల 3 నుంచి 25 మ‌ధ్య లండ‌న్ వెళ్ల‌డం కోసం ఆయ‌న చేసిన అభ్య‌ర్థ‌న మేర‌కు హైద‌రాబాద్ సీబీఐ కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే, జ‌గ‌న్ పాస్‌పోర్టు రెన్యువ‌ల్ విష‌యంలో విజ‌య‌వాడ‌లోని ప్ర‌జాప్ర‌తినిధుల ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ష‌ర‌తులు విధించ‌డం జ‌రిగింది. 

వాటిని ర‌ద్దు చేయాలంటూ మాజీ సీఎం ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌టన‌ ఉంటుందా? ఉండ‌దా? అనే విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. 

 

 

Link to comment
Share on other sites

 

Somireddy Chandra Mohan Reddy: జగన్ చెప్పిందే కరెక్ట్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

14-09-2024 Sat 15:59 | Andhra
floods are Jagan made mistake says Somireddy
 

 

  • ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్న జగన్
  • కరెక్టే.. అది జగన్ మేడ్ మిస్టేక్ అన్న సోమిరెడ్డి
  • వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి ముద్దులు పెట్టారని విమర్శ
ఏలేరు వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని, మ్యాన్ మేడ్ మిస్టేక్ అని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ... జగన్ చెప్పింది కరెక్ట్ అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏమీ చేయలేదని... కాబట్టి అది జగన్ మేడ్ మిస్టేక్ అని చెప్పారు. 

భారీ వర్షాలతో ఏలేరు పొంగి ప్రవహించిందని... అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో ప్రాణనష్టం సంభవించలేదని సోమిరెడ్డి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తేనే కాకినాడ వరకు నీళ్లు వెళ్లాయని... ఇప్పుడు 42 వేల క్యూసెక్కుల నీరు వచ్చినా ముందు చూపుతో నష్టాన్ని నివారించగలిగామని చెప్పారు.  

జగన్ కు క్యూసెక్కులు, టీఎంసీలు అంటే తెలియదని... ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో అంటే తెలియదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్యాలెస్ లో కూర్చొని జగన్ పాలించారని... ఆయన హయాంలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు నిర్వీర్యం అయిపోయాయని విమర్శించారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి డ్యాన్సులకు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. 

వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ ముద్దులు పెడుతున్నారని విమర్శించారు. కేవలం వైసీపీ అనుచరులు ఉన్న ప్రాంతంలోనే జగన్ పర్యటించారని ఎద్దేవా చేశారు. 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...