Jump to content

Satya Kumar: పాఠాలు కూడా మీరే చెబుతారా ప్రొఫెసర్ జగన్?: మంత్రి సత్యకుమార్


psycopk

Recommended Posts

Satya Kumar: పాఠాలు కూడా మీరే చెబుతారా ప్రొఫెసర్ జగన్?: మంత్రి సత్యకుమార్

15-09-2024 Sun 16:09 | Andhra
Minister Satya Kumar fires on former chief minister YS Jagan
 

 

  • నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలల పరిస్థితిపై మంత్రి సత్యకుమార్ స్పందన
  • నాలుగేళ్లయినా ఒక్క కాలేజీ నిర్మాణం పూర్తి చేయలేకపోయారని విమర్శలు
  • పులివెందుల కాలేజీలో బోధనా సిబ్బంది కొరత ఉందని వెల్లడి
  • పాఠాలు ఎవరు చెప్పాలని నిలదీసిన వైనం
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ వంటి అసమర్థ వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో! అంటూ విమర్శనాత్మకంగా స్పందించారు. 

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించారని, నాలుగేళ్లయినా ఒక్క కాలేజీ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని వెల్లడించారు. సగానికి పైగా కాలేజీల నిర్మాణం పునాదుల దశల్లోనే ఉందని మంత్రి సత్యకుమార్ వివరించారు. 

నిర్మాణం పూర్తికాకుండానే గతేడాది రాజమండ్రిలో మెడికల్ కాలేజీ ప్రారంభించారని, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతి గదులు లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. జగన్ సారూ... విద్యార్థులను ఎక్కడ చదివించాలి... చెట్ల కింద చదివించాలా? అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.  

పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. పులివెందుల కాలేజీలో 48 శాతం బోధనా సిబ్బంది లేరన్న విషయం జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. 

తరగది గదులు లేవంటే ఎలాగోలా సర్దుకుపోతాం... మరి బోధనా సిబ్బంది లేకపోతే పాఠాలు ఎవరు చెబుతారు? అని నిలదీశారు. పాఠాలు కూడా మీరే చెబుతారా ప్రొఫెసర్ జగన్? అంటూ ఎద్దేవా చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకోవాలనుకున్నారు? అని మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు... అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా? అని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని జగన్ ఇప్పటికైనా మారాలి అని హితవు పలికారు.
Link to comment
Share on other sites

Jagan: రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం దేనికి నిదర్శనం చంద్రబాబు గారూ?: జగన్ 

15-09-2024 Sun 19:23 | Andhra
Jagan take a dig at CM Chandrababu over MBBS seats
 

 

  • చంద్రబాబుపై జగన్ ఫైర్
  • కొత్త ఎంబీబీఎస్ సీట్లను వద్దంటూ చంద్రబాబు లేఖ రాశారన్న జగన్
  • ఆ లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ ఆరోపణలు
రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, వద్దంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం దారుణమని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. పొరుగు రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తుంటే... మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు గారూ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. 

నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళితే ఈ సంవత్సరంలోనే పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, పాడేరు, ఆదోని మెడికల్ కాలేజీల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవని జగన్ వెల్లడించారు. కానీ, ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు కేటాయిస్తే, వద్దంటూ ప్రభుత్వం లేఖ రాయడం ఏంటి? వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసే కుంభకోణాలకు ఆలోచన చేయడం ఏంటి? అని నిలదీశారు. 

అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారని, సీట్ల సంగతి దేవుడెరుగు... ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారని జగన్ ఆరోపించారు. పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆసుపత్రులకు, సీహెచ్‌సీలకు, పీహెచ్‌సీలకు, విలేజ్‌ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుందని తెలిపారు. 

సూపర్‌ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లాస్థాయిలో, అక్కడే లభిస్తాయని... అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలకు కూడా అని జగన్ స్పష్టం చేశారు.

చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలని, తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. 

"మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి... పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురండి... మీకు చేతనైనంత ఖర్చు చేస్తూ వెళ్లండి... మీకు చేతకాకపోతే మేం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా పూర్తి చేస్తాం. అంతేకానీ, ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మాటున కుంభకోణాలు చేయడం మానుకో చంద్రబాబూ! లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది" అని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...