Jump to content

తిరుమల లడ్డు లో నెయ్యి కి బదులు జంతువుల fat తో చేసిన ఆయిల్ వాడారు వైసీపీ గవర్నమెంట్ లో


psycopk

Recommended Posts

15 hours ago, psycontr said:

Amul is the ghee supplier for TTD. Ante amul ghee ani cheppi animal kovvu oil supply chesthundhi ani kavi bhavam aa ?

not amul, nandini dairy of karnataka govt, the contract was originally with vijaya diary of AP govt

paffu LK gadi govt lo they cancelled it and gave it to other suppliers 

Link to comment
Share on other sites

3 hours ago, rapchik123 said:

not amul, nandini dairy of karnataka govt, the contract was originally with vijaya diary of AP govt

paffu LK gadi govt lo they cancelled it and gave it to other suppliers 

Not Karnataka, AR foods from Tn anta. 

Link to comment
Share on other sites

Tirumala Laddu: దమ్ముంటే తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలి: వైవీ సుబ్బారెడ్డికి నారా లోకేశ్ సవాల్ 

19-09-2024 Thu 21:34 | Andhra
Nara Lokesh challenges YV Subbareddy on Tirumala Laddu issue
 

 

  • తీవ్ర రూపు దాల్చిన తిరుమల లడ్డూ వ్యవహారం
  • చంద్రబాబు ఆరోపణలను ఖండించిన వైవీ సుబ్బారెడ్డి
  • వైవీ అహంకార ధోరణితో మాట్లాడుతున్నారన్న నారా లోకేశ్
  • రెడ్ బుక్ చూస్తే వైసీపీ నేతలు హడలిపోతున్నారని వెల్లడి
తిరుమల లడ్డూ వ్యవహారం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. గత ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వరస్వామి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించడం, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించడం తెలిసిందే. కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేస్తానని, చంద్రబాబు కూడా వచ్చి ప్రమాణం చేయాలన్నారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

వైవీ సుబ్బారెడ్డికి దమ్ముంటే తిరుపతికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. నేను తిరుపతిలోనే ఉన్నా... వైవీ వస్తారా? అని అడిగారు. నాటి వైసీపీ ప్రభుత్వం సామాన్య భక్తులను స్వామివారికి దూరం చేసిందని విమర్శించారు. ధరలను విపరీతంగా పెంచేసిందని ఆరోపించారు. ధరలు పెంచితే ఏమవుతుందని నాడు వైవీ అహంకార ధోరణితో మాట్లాడారని మండిపడ్డారు. పింక్ డైమండ్ ను కూడా రాజకీయం చేశారని ఆరోపించారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లు ఇవాళ నా రెడ్ బుక్ చూస్తే భయపడుతున్నారు అని వ్యాఖ్యానించారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"అన్న ప్రసాదంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూ సైజుతో పాటు నాణ్యత కూడా తగ్గిపోయింది. నేను చంద్రగిరిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ఏడుకొండల వైపు చూసి జగన్ కు చెప్పాను... మీరు ఆ ఏడుకొండల జోలికి వెళ్లొద్దు... సర్వనాశనం అయిపోతారని చెప్పాను. కానీ వినలేదు. తిరుమలలో కనీవినీ ఎరుగని అవినీతి చేశారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు" అని వివరించారు.
Link to comment
Share on other sites

Tirumala Laddu: మా స్వామి మీకేం పాపం చేశాడ్రా దరిద్రుల్లారా!: ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్ 

19-09-2024 Thu 20:55 | Andhra
Anam Venkataramana Reddy press meet on Tirumala Laddu controversy
 

 

  • తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు
  • చంద్రబాబు సంచలన ఆరోపణలు
  • గుజరాత్ ల్యాబ్ లో స్పష్టమైందన్న ఆనం వెంకటరమణారెడ్డి
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. కొవ్వును కరిగించి తీసిన నూనెను స్వామివారి లడ్డూల్లో వాడతారేంట్రా దరిద్రుల్లారా...  మా స్వామి మీకేం పాపం చేశాడ్రా! అంటూ మండిపడ్డారు.

గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు ల్యాబ్ లో శాంపిల్స్ పరీక్షించగా, సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో గొడ్డు మాంసం కొవ్వు, ఫిష్ ఆయిల్, కుళ్లిన జంతుమాంసం కొవ్వు వాడారని ఆరోపించారు. అవి ఏ జంతువులైనా కావొచ్చని, కుక్కలు, పిల్లుల మాంసం కావొచ్చని వ్యాఖ్యానించారు. 

ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ లో కాదని, గుజరాత్ లోని ల్యాబ్ లో పరీక్షించారని అన్నారు. గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు ల్యాబ్ భారత్ లోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ ల్యాబ్ లలో ఒకటి అని ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు. చెన్నై నుంచి నెల్లూరుకు కుక్కల మాంసం వస్తుంటుందని, ఎన్నోసార్లు కుక్క మాంసం పట్టుబడిందని వెల్లడించారు. ఇప్పుడు కుక్క మాంసం కొవ్వును కూడా వెంకటేశ్వరస్వామి లడ్డూ తయారీలో వాడారని భయం కలుగుతోందని చెప్పారు. 

"ఒరేయ్ సుబ్బూ (సుబ్బారెడ్డి)... ఏందిరా ఇదంతా... తిరుమల వెంకన్నస్వామి లడ్డూలో గొడ్డు మాంసం కొవ్వు కలుపుతారా? కుళ్లిపోయిన జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను స్వామివారి లడ్డూల్లో వాడతారా? ఎంతటి అపచారం! 

జగన్ మోహన్ రెడ్డి, ఆయన బంధువులు దేవుడ్ని నమ్మరు... మేం ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాం. వాళ్లకు వెంకటేశ్వరస్వామిపై నమ్మకం లేదన్న విషయం ఇవాళ రుజువైంది... ఇవాళ ప్రతి హిందువు స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని, దీపం వెలిగించి స్వామివారిని క్షమాపణ కోరండి... తప్పు ఎవరు చేసినా హిందువులమైన మనందరం భరించాలి.. ఈ పాపం మనకు తగలకుండా చూసుకుందాం" అని ఆనం వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...