Jump to content

విభజన తర్వాత.. తెలంగాణలో ప్రగతి పరుగు..


Undilaemanchikalam

Recommended Posts

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ కుందేలులా వేగంగా పరుగులు తీస్తోంటే.. ఆంధ్రప్రదేశ్‌ తాబేలులా మందగమనంతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది.

ఏపీలో మందగమనం
ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి విశ్లేషణ
ఆర్థిక సంస్కరణలను దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు వెల్లడి

విభజన తర్వాత.. తెలంగాణలో ప్రగతి పరుగు

ఈనాడు, దిల్లీ: ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ కుందేలులా వేగంగా పరుగులు తీస్తోంటే.. ఆంధ్రప్రదేశ్‌ తాబేలులా మందగమనంతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హయాంలో 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు తెలిపింది. ‘రిలేటివ్‌ ఎకనామిక్‌ పెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌: 1960-61 టు 2023-24’ పేరుతో కౌన్సిల్‌ సభ్యులు సంజీవ్‌సన్యాల్, ఆకాంక్ష అరోడాలు రూపొందించిన వర్కింగ్‌ పేపర్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదికలోని వివరాలివీ..

స్థూల ఉత్పత్తిలో ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9%

  • జాతీయ స్థూల ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటా 1960-61లో 7.7% ఉండగా, 2023-24 నాటికి 9.7 శాతానికి చేరింది. 2010-11లో   ఆంధ్రప్రదేశ్‌ వాటా 4.6%, తెలంగాణ వాటా 3.8% ఉండగా, 2023-24 నాటికి ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9 శాతానికి చేరాయి. 
  • రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిలో భిన్నమైన మార్పు కనిపించింది. జాతీయసగటుతో పోలిస్తే 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం 193.6% అధికంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం 131.6% అధికంగా ఉంది. 
  • 1990-91లో దక్షిణాది రాష్ట్రాలన్నింటి తలసరి ఆదాయం జాతీయ సగటు (100%) కంటే తక్కువగా ఉండేది. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్దకాలంలోనే ఇక్కడి ప్రతి రాష్ట్రం తలసరి ఆదాయం 100%

దాటిపోయింది. ఆ తర్వాత నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో సగటు వ్యక్తి తలసరి ఆదాయం జాతీయసగటు కంటే 93.6% అధికంగా ఉంది. కర్ణాటక తలసరి ఆదాయం 81% అధికంగా ఉంది. అధిక తలసరి ఆదాయం ఉన్న పెద్ద రాష్ట్రాల్లో దిల్లీ తర్వాతి స్థానాలను తెలంగాణ, కర్ణాటక ఆక్రమించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిసి దేశ జీడీపీలో 30% మొత్తాన్ని సాధిస్తున్నాయి. 

ఈ నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ (జాతీయ సగటుతో పోలిస్తే 193.6%), కర్ణాటక (181%), తమిళనాడు (171%), కేరళ (152.5%), ఆంధ్రప్రదేశ్‌ (131.6%) వరుస స్థానాలను ఆక్రమించాయి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత కర్ణాటక, తెలంగాణలు ఆర్థిక శక్తి కేంద్రాలు (ఎకనమిక్‌ పవర్‌హౌస్‌)గా మారాయి.

Link to comment
Share on other sites

23 minutes ago, Undilaemanchikalam said:

 

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ కుందేలులా వేగంగా పరుగులు తీస్తోంటే.. ఆంధ్రప్రదేశ్‌ తాబేలులా మందగమనంతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది.

ఏపీలో మందగమనం
ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి విశ్లేషణ
ఆర్థిక సంస్కరణలను దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు వెల్లడి

విభజన తర్వాత.. తెలంగాణలో ప్రగతి పరుగు

ఈనాడు, దిల్లీ: ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ కుందేలులా వేగంగా పరుగులు తీస్తోంటే.. ఆంధ్రప్రదేశ్‌ తాబేలులా మందగమనంతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హయాంలో 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు తెలిపింది. ‘రిలేటివ్‌ ఎకనామిక్‌ పెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌: 1960-61 టు 2023-24’ పేరుతో కౌన్సిల్‌ సభ్యులు సంజీవ్‌సన్యాల్, ఆకాంక్ష అరోడాలు రూపొందించిన వర్కింగ్‌ పేపర్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదికలోని వివరాలివీ..

స్థూల ఉత్పత్తిలో ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9%

  • జాతీయ స్థూల ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటా 1960-61లో 7.7% ఉండగా, 2023-24 నాటికి 9.7 శాతానికి చేరింది. 2010-11లో   ఆంధ్రప్రదేశ్‌ వాటా 4.6%, తెలంగాణ వాటా 3.8% ఉండగా, 2023-24 నాటికి ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9 శాతానికి చేరాయి. 
  • రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిలో భిన్నమైన మార్పు కనిపించింది. జాతీయసగటుతో పోలిస్తే 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం 193.6% అధికంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం 131.6% అధికంగా ఉంది. 
  • 1990-91లో దక్షిణాది రాష్ట్రాలన్నింటి తలసరి ఆదాయం జాతీయ సగటు (100%) కంటే తక్కువగా ఉండేది. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్దకాలంలోనే ఇక్కడి ప్రతి రాష్ట్రం తలసరి ఆదాయం 100%

దాటిపోయింది. ఆ తర్వాత నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో సగటు వ్యక్తి తలసరి ఆదాయం జాతీయసగటు కంటే 93.6% అధికంగా ఉంది. కర్ణాటక తలసరి ఆదాయం 81% అధికంగా ఉంది. అధిక తలసరి ఆదాయం ఉన్న పెద్ద రాష్ట్రాల్లో దిల్లీ తర్వాతి స్థానాలను తెలంగాణ, కర్ణాటక ఆక్రమించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిసి దేశ జీడీపీలో 30% మొత్తాన్ని సాధిస్తున్నాయి. 

ఈ నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ (జాతీయ సగటుతో పోలిస్తే 193.6%), కర్ణాటక (181%), తమిళనాడు (171%), కేరళ (152.5%), ఆంధ్రప్రదేశ్‌ (131.6%) వరుస స్థానాలను ఆక్రమించాయి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత కర్ణాటక, తెలంగాణలు ఆర్థిక శక్తి కేంద్రాలు (ఎకనమిక్‌ పవర్‌హౌస్‌)గా మారాయి.

TRS rule antaru ra babu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...