Jump to content

బందరులో పూలింగ్-రైతుల్ని పాలేర్లుగా మార్చుతారా-Kommineni Srinivasarao


mudragadav2

Recommended Posts

article20160726_15.jpg

ఎపి ప్రభుత్వం మరో సాహసానికి ఒడిగట్టిందా?మచిలీపట్నం చుట్టుపక్కల ఇరవైమూడు గ్రామాలలో సుమారు ముప్పైమూడువేల ఎకరాల భూమినికి సేకరించడానికి సిద్దమైన తీరు ఒక రకంగా సాహసమే అని చెప్పాలి. ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా, ఏ మాత్రం చలించకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందన్న భావన వ్యక్తం అవుతోంది. పరిశ్రమలు, ఓడరేవు అవసరాలకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పారు, ఎలా మాట మార్చుతున్నారన్నది పక్కన పెడితే , అసలు ఇంత పెద్ద ఎత్తున భూమి ఎందుకు అవసరం అన్నది నిర్దిష్టంగా చెప్పగలగాలి.పోర్టు ఆదారిత పరిశ్రమలు ఎన్ని వస్తాయి?వాటికి ఎంత భూమి అవసరం?లేచిందే లేడికి పరుగు అన్నట్లు, తోచిందే తడవుగా చంద్రబాబు ప్రభుత్వం భూముల స్వాధీనానికి బయల్దేరుతోంది.మచిలీపట్నంలో భూముల సేకరణ కూడా సమీకరణ పద్దతి అంటే లాండ్ పూలింగ్ అనే విధానంలో సమీకరిస్తారు. రాజదాని అమరావతి ప్రాంతంలో భూముల సమకరణ సమయంలో ఏమి చెప్పారంటే అక్కడ తాము రాజదాని ప్రకటించగానే రైతుల భూములకు విలువలు పెరిగిపోయాయని, కోట్ల దర పలుకుతోందని, అది ఇంకా పెరుగుతుందని నమ్మబలికారు.ఎక్కువ మంది వివిధ కారణాలతో నమ్మి ఉండవచ్చు.ముప్పై మూడు వేల ఎకరాలు ఆ పద్దతిలో సమీకరించామని ఘనంగా చెప్పుకున్నారు. కొందరు పెట్టుబడి దారులు రైతుల వద్ద ఏభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా కొని ప్రభుత్వానికి సమీకరణ పద్దతిలో భూములు ఇచ్చారు.ప్రభుత్వం అబివృద్ది చేసిన భూమి ఇస్తే ఆ నష్టం అంతా కవర్ అయి, లాభాలు వస్తాయని ఆశించారు.అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. పైగా ప్రభుత్వమే చెబుతోంది.ముందుగా 1691 ఎకరాలు అభివృద్ది చేయడానికి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుందని,అంటే ఆ లెక్కన మిగిలిన భూమి అబివృద్దికి ఎంత సమయం పడుతుందో ఎవరికి వారు లెక్కలు వేసుకోవల్సిందే.ఆ భూమి చాలదని మరో 2500 ఎకరాల భూమిని లాండ్ పూలింగ్ కింద ఇవ్వని రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.అది ఎటువైపు వెళుతుందో చూడాలి. ఈ తరుణంలో బందరు వద్ద లాండ్ పూలింగ్ అనగానే, ఓడరేవుతో పారిశ్రామికవాడ అనగానే రేట్లు పెరిగాయా?లేకుంటే రైతులు ఎందుకు తమ భూమిని ఎకరా ఇచ్చి పన్నెండు వందల గజాలు,1450 గజాలు తీసుకోవలసిన అవసరం ఏమిటి?ఎకరా పది లక్షల ధర ఉంటే ఆ విలువ ఈ 1450 గజాలలోనే రావాలి కదా! రాజధాని లో కొన్నట్లు పెట్టుబడిదారులు ఇక్కడ కూడా రైతుల భూములు కొని ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు వస్తారా?పూలింగ్ కింద ఇవ్వకపోతే 2013 భూ సేకరణ చట్టం కింద నాలుగు రెట్ల పరిహారం ఇచ్చి ప్రబుత్వం కొనుగోలు చేస్తుందా?వీటన్నిటికి సమాదానం లేదు. ఎందుకంటే ప్రభుత్వం అలా చేయలేదు.అప్పనంగా పూలింగ్ పేరుతో భూములు కొట్టేసి తనలా ప్రపంచంలోనే ఎవరూ ఇలా భూములు తీసుకోలేదని చెప్పుకోవాలన్నది చంద్రబాబు తాపత్రయం ఆ క్రమంలో ఆయన తాను ప్రమాదంలో పడడం సంగతేమో కాని రైతులను అపాయంలోకి నెడుతున్నారు.వారిని మానసికంగా వేదిస్తున్నారు.ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితాలలో మంటలు రేపుతున్నారు.టిడిపి నేతలు ఈ విషయంలో కూడా అసత్యాలు చెప్పడానికి పోటీపడుతున్నారు. మంత్రి ఉమ అయితే బందరు పోర్టుతోనే రాష్ట్ర అబివృద్ది అని నమ్మ బలకుతున్నారు. ఎమ్.పి నారాయణ పోర్టు వచ్చినా పరిశ్రమలు రాకపోతే నష్టం అని చెబుతున్నారు.ఇలా తలో మాట చెబుతూ రైతులను గందరగోళంలోకి నెడుతున్నారు.పోర్టుకు అవసరమైన బూములు ఇవ్వడానికి రైతులు సిద్దమే.కాని ఇలా పిడుగుమాదిరి తమ మీద ప్రభుత్వం ఇన్ని వేల ఎకరాలు లాక్కుంటాం అంటూ వచ్చి పడుతుందని ఊహించలేకపోయారు.ఇక్కడ ప్రభుత్వానికి ఒకటే మాట చెప్పాలి. నిజంగానే బూములు అవసరం అనుకుంటే బూ సేకరణ చట్టం కింద నాలుగు రెట్ల పరిహారం ఇచ్చి తీసుకోవాలి.లేదంటే రైతులను వారి భూములలో వారినే పాలేర్లుగా మార్చినట్లు అవుతుంది తస్మాత్ జాగ్రత్త!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...