Jump to content

seema farmers


Ram87

Recommended Posts

4 minutes ago, Ram87 said:

brahmi20.gif?1369595063 mallanasagar gurincha?

రైతులకు వాటాతో గిఫ్ట్‌సిటీలు636112276214647501.jpg
  • మూడు వేల ఎకరాలకు ఒక టౌన్ చొప్పున నిర్మాణం
  • నగరాలు, పట్టణాల చుట్టుపక్కల భూముల సేకరణ
  • రైతు భూమి విలువకు సమానంగా లే అవుట్లలో వాటా 
  • ఉప్పల్ భగాయత్ బాధితులకు తగు న్యాయం చేస్తాం
  • అర్బన్ సీలింగ్ భూమికి 60 శాతం పరిహారం
  •  నగరాలు, పట్టణాల చుట్టుపక్కల భూముల సేకరణ
  • రైతుల భూమి విలువకు సమానంగా లే అవుట్లలో వాటాలు
  • ఉప్పల్‌ భూ బాధితులకు తగినన్యాయం: సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రైతులను భాగస్వాములను చేస్తూ గిఫ్ట్‌సిటీలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. దేశంలోని చాలా నగరాలు అబివృద్ధి చెందుతున్న క్రమంలో నగరం, పట్టణాల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను తీసుకుని నివాస సముదాయాల కోసం అభివృద్ధి చేస్తున్నారని, దేశ వ్యాప్తంగా ఈ విధానం సత్ఫలితాలనిచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానాన్ని రైతులకు మరింత ఉపయోగపడేలా తయారు చేస్తామని సీఎం చెప్పారు. నగరం చట్టుపక్కల ప్రాంతాల్లో 3వేల ఎకరాలకు ఒక టౌన చొప్పన నిర్మిస్తామని, ఇందుకోసం రైతుల నుంచి భూమి సేకరిస్తామని తెలిపారు. సేకరించిన భూమికి వెలకట్టి దానికి సమానంగా ఆయా లే అవుట్లలో రైతులకు వాటా కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన విధానాన్ని తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగావత ప్రాంతంలో హెచఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన నివాస గృహాల లే అవుట్‌కు సంబంధించిన వివాద బాధితులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాలను వెల్లడించారు. కాగా మంత్రి కేటీఆర్‌, ఎంపీ మల్లారెడ్డి తదితరులతో కలిసి వచ్చిన బాధితులు.. సీఎం వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ఉప్పల్‌ ప్రాంతంలో దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం స్థానిక రైతుల నుంచి 754 ఎకరాల భూమిని సేకరించింది. ఎకరా భూమి కోల్పోయిన రైతుకు దానికి బదులుగా అభివృద్ది చేసిన లే అవుట్‌లో 1000 గజాల స్థలం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని ప్రకారమే రైతులకు నివాస స్థలం కేటాయించారు. అయితే ఆ భూమిలో 54 ఎకరాలు అర్బన ల్యాండ్‌ సీలింగ్‌ పరిధిలోనిదని తర్వాత తేలింది. దాంతో సదరు భూమి అమ్మిన రైతులకు వెయ్యి గజాలు ఇవ్వడం కుదరదని అప్పటి ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాగా అది అర్బన ల్యాండ్‌ సీలింగ్‌ భూమి అని తమకు తెలియదని బాధితులు మొర పెట్టుకోవడంతో.. స్పందించిన ముఖ్యమంత్రి అర్బన ల్యాండ్‌ సీలింగ్‌ భూమిని ప్రభుత్వానికి అప్పగించిన రైతులకు కూడా 60 శాతం పరిహారం (ఎకరాకు 600 గజాల చొప్పున) ఇవ్వాలని నిర్ణయించారు. దసరాలోపు పూర్తి కావాలని మంత్రి కేటీఆర్‌ను, ఎంపీ మల్లారెడ్డిని ఆదేశించారు.
Link to comment
Share on other sites

1 minute ago, DiscoKing said:
రైతులకు వాటాతో గిఫ్ట్‌సిటీలు636112276214647501.jpg
  • మూడు వేల ఎకరాలకు ఒక టౌన్ చొప్పున నిర్మాణం
  • నగరాలు, పట్టణాల చుట్టుపక్కల భూముల సేకరణ
  • రైతు భూమి విలువకు సమానంగా లే అవుట్లలో వాటా 
  • ఉప్పల్ భగాయత్ బాధితులకు తగు న్యాయం చేస్తాం
  • అర్బన్ సీలింగ్ భూమికి 60 శాతం పరిహారం
  •  నగరాలు, పట్టణాల చుట్టుపక్కల భూముల సేకరణ
  • రైతుల భూమి విలువకు సమానంగా లే అవుట్లలో వాటాలు
  • ఉప్పల్‌ భూ బాధితులకు తగినన్యాయం: సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రైతులను భాగస్వాములను చేస్తూ గిఫ్ట్‌సిటీలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. దేశంలోని చాలా నగరాలు అబివృద్ధి చెందుతున్న క్రమంలో నగరం, పట్టణాల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను తీసుకుని నివాస సముదాయాల కోసం అభివృద్ధి చేస్తున్నారని, దేశ వ్యాప్తంగా ఈ విధానం సత్ఫలితాలనిచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానాన్ని రైతులకు మరింత ఉపయోగపడేలా తయారు చేస్తామని సీఎం చెప్పారు. నగరం చట్టుపక్కల ప్రాంతాల్లో 3వేల ఎకరాలకు ఒక టౌన చొప్పన నిర్మిస్తామని, ఇందుకోసం రైతుల నుంచి భూమి సేకరిస్తామని తెలిపారు. సేకరించిన భూమికి వెలకట్టి దానికి సమానంగా ఆయా లే అవుట్లలో రైతులకు వాటా కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన విధానాన్ని తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగావత ప్రాంతంలో హెచఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన నివాస గృహాల లే అవుట్‌కు సంబంధించిన వివాద బాధితులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాలను వెల్లడించారు. కాగా మంత్రి కేటీఆర్‌, ఎంపీ మల్లారెడ్డి తదితరులతో కలిసి వచ్చిన బాధితులు.. సీఎం వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ఉప్పల్‌ ప్రాంతంలో దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం స్థానిక రైతుల నుంచి 754 ఎకరాల భూమిని సేకరించింది. ఎకరా భూమి కోల్పోయిన రైతుకు దానికి బదులుగా అభివృద్ది చేసిన లే అవుట్‌లో 1000 గజాల స్థలం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని ప్రకారమే రైతులకు నివాస స్థలం కేటాయించారు. అయితే ఆ భూమిలో 54 ఎకరాలు అర్బన ల్యాండ్‌ సీలింగ్‌ పరిధిలోనిదని తర్వాత తేలింది. దాంతో సదరు భూమి అమ్మిన రైతులకు వెయ్యి గజాలు ఇవ్వడం కుదరదని అప్పటి ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాగా అది అర్బన ల్యాండ్‌ సీలింగ్‌ భూమి అని తమకు తెలియదని బాధితులు మొర పెట్టుకోవడంతో.. స్పందించిన ముఖ్యమంత్రి అర్బన ల్యాండ్‌ సీలింగ్‌ భూమిని ప్రభుత్వానికి అప్పగించిన రైతులకు కూడా 60 శాతం పరిహారం (ఎకరాకు 600 గజాల చొప్పున) ఇవ్వాలని నిర్ణయించారు. దసరాలోపు పూర్తి కావాలని మంత్రి కేటీఆర్‌ను, ఎంపీ మల్లారెడ్డిని ఆదేశించారు.

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...