Jump to content

Wakf bhoomulu golmaal - andhrolla kutra


beerbob

Recommended Posts

వక్ఫ్‌ ఆస్తులు స్వాహా..!

 

- కరీంనగర్‌ ఎమ్మెల్యే, అనుయాయుల ఆక్రమణలో భూములు
- అప్పగించాలంటూ జిల్లా కలెక్టర్‌కు సీఈఓ లేఖ
- మంత్రికి విన్నవించినా...ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా చర్యలు మాత్రం శూన్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌ 
'ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం...వక్ఫ్‌ ఆస్తులను పరిరక్షిస్తాం... ఆక్రమణలో ఉన్నవాటిని అప్పగి స్తాం' మైనార్టీలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ పదే పదే చెబుతున్న మాటలివి. అధినేత హామీలు ఇలా ఉంటే... క్షేత్రస్థాయిలో మాత్రం వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే, అనుయాయులే 56 ఎకరాలకుపైగా భూములను కబ్జా చేసేశారు. సుమారు పదేండ్లుగా వాటిని అనుభవిస్తున్నారు. స్వయాన ఎమ్మెల్యే, ఆయన అనుయాయులే వాటిని కాజేశారని, వెంటనే స్వాధీనం చేసే విషయమై జోక్యం చేసుకోవాలంటూ మైనార్టీ కమిషన్‌ చైర్మెన్‌ రసూల్‌ఖాన్‌ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా... గతంలోనే మైనార్టీ శాఖ సీఈఓ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినా...పలువురు ముస్లిం మత పెద్దలు కేటీఆర్‌ను కలిసి విన్నవించినా...వక్ఫ్‌ ఆధీనంలోకి ఆ భూములు రాలేదంటే ఆ ఎమ్మెల్యే పరపతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతున్నది.
మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతోపాటు వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ, 12 శాతం రిజర్వేషన్‌ గూర్చి పదేపదే చెబుతూ ముఖ్యమంత్రి వారిపట్ల తమకున్న ప్రేమను చాటే ప్రయత్నం చేస్తుండగా.. స్థానిక నేతలు మాత్రం వక్ఫ్‌ఆస్తులను దర్జాగా కాజేస్తున్నారు. తమ పేర అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేసుకొని అనుభవించేందుకు సిద్ధపడ్డారు. ఈనెల 15న కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ రసూల్‌ఖాన్‌ ఈ ఆక్రమిత భూముల విషయాన్ని ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సహా ఆయన అనుయాయులు వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన 56 ఎకరాలకుపైగా ఆస్తులను ఆక్రమించినట్టు ఆరోపించారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కసరత్తు ఇదివరకే ప్రారంభమైంది. అందులో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీతోపాటు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈఓ మహ్మద్‌ అసదుల్లా కూడా తమ వంతు ప్రయత్నాలు కొనసాగించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈఓ మహ్మద్‌ అసదుల్లా ఈనెల నాలుగో తేదీన అప్పటి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌కు డిఓ.ఎల్‌ఆర్‌.నెంబర్‌ ఎమ్‌1/76/పిఆర్‌జిటి/కెఎమ్‌ఎన్‌ఆర్‌ అనే సంఖ్యతో లేఖ పంపారు. ఆ లేఖలో...కరీంనగర్‌ మండలంలోని ఖాజీపూర్‌ గ్రామంలో 126 సర్వేనెంబరులోగల వక్ఫ్‌ భూమిలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ 15 ఎకరాలను, రాచకొండ గట్టయ్య పేర మరో 15 ఎకరాలను ఎమ్మెల్యే అనుయాయులు మరికొంత మంది ఆక్రమించుకున్నారని, అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుయాయులు 122, 129, 154, 171 సర్వేనెంబర్లలో భూములను ఆక్రమించినట్టు తెలిపారు. 2016 మార్చి 22న ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఇచ్చిన లేఖ గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. ఆ మేరకు అప్పుడే ఏప్రిల్‌ 25న కరీంనగర్‌ ఆర్డీఓకు రాసిన లేఖ విషయాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాత్రం తన పేర ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) ఆర్డీఓ నుంచి తీసుకున్నారు. దాని ప్రకారం 2002లోనే ఆయన పేర రిజిస్ట్రేషన్‌ అయినట్టు తెలుస్తోంది. 11 జనవరి 1990న వెలువరించిన ఆంధ్రప్రదేశ్‌ గెజిట్‌ నెంబర్‌ 21 ప్రకారం వాటిని వక్ఫ్‌ ఆస్తులుగా ఆనాడే పేర్కొన్నారు. సర్వే కమిషనర్‌ నివేదిక, ఆర్డీఓ ప్రొసీడింగ్‌ ప్రకారం.. బేరింగ్‌ నెంబర్‌ బి/3072/2011 తేదీ 20 ఫిబ్రవరి 2012 కూడా ఏపీ గెజిట్‌ను సమర్థిస్తున్నది. వీటి ఆధారంగా పలువురు ముస్లిములు వక్ఫ్‌ ఆక్రమిత భూములను తిరిగి అప్పగించాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి మొరపెట్టుకున్నారు. పైన పేర్కొన్న సర్వేనెంబర్‌ గల భూములు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు చెందినవేనంటూ ఖాజీపూర్‌లోని ఆ భూముల్లో ఓ ఫ్లెక్సీబోర్డు ఏర్పాటు చేశారు. మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ రసూల్‌ఖాన్‌ ఈనెల 15న కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలతో ఆ బోర్డు మాయం అయినట్టు సమాచారం.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...