Jump to content

అందుబాటు ధరల్లో ఇళ్లు, స్థలాలు...!


JANASENA

Recommended Posts

సామాన్య, మధ్య తరగతికి వూరట 
నల్లధన కట్టడికి మోదీ సాహసోపేత చర్య 
పెద్దనోట్ల నిషేధంతో స్థిరాస్తి, పసిడిపై ప్రభావం 
ఈనాడు వాణిజ్య విభాగం 
8business1a.jpg
రూ.500, రూ.1,000 నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి, పసిడి రంగాలపైనే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఒకేసారి అధికమొత్తం, అనధికార చెల్లింపులు ఈ రంగాల్లోనే సాగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందువల్లే పెద్దనోట్ల రద్దు అనే సాహసోపేత నిర్ణయాన్ని ప్రధాని మోదీ తీసుకున్నారు. దీనివల్ల ధరల కృత్రిమ పెరుగుదల ఆగిపోతుంది. అధిక విలువ కలిగిన ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, వాహన రంగాలపైనా ప్రభావం ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

దేశీయ ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణి గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ.16.50 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉందని సమాచారం. ఇంత నగదు చెలామణిలో ఉన్నా, బ్యాంకులలోకి చేరుతున్న మొత్తం తగ్గిపోయింది. కారణం రూ.50,000 మించి నగదును కరెన్సీ రూపంలో ఖాతాలో వేసుకోవాలన్నా, డిపాజిట్‌ చేయాలన్నా కూడా శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) నమోదు చేయాల్సి వస్తోంది. షేర్లు, మ్యూచువల్‌ఫండ్ల వంటి వాటిల్లో పెట్టుబడులు పెడదామన్నా, ఆదాయపు పన్ను శాఖకు ‘లెక్క’ చెప్పుకోవాల్సి వస్తోంది. అందువల్ల నల్లధనం ఎక్కువగా బ్యాంకులకు బయటే ఉంటోంది. ఇలాంటి నగదుతో బంగారం, స్థిరాస్తి కొనుగోళ్లు అధికంగా సాగుతున్నాయని అంచనా.

స్థిరాస్తి కొనుగోళ్లలో ఖాతాలో చూపే, చూపని మొత్తాలు తప్పనిసరి: స్థిరాస్తి రంగంలో జరిగే లావాదేవీల్లో నల్లధనం తప్పనిసరి. స్థలం, ఫ్లాట్‌, ఇల్లు, పొలం.. ఏది అమ్మినా కూడా, రిజిస్ట్రేషన్‌ ధరకు, వాస్తవ ధరకు తేడా తప్పనిసరిగా ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ విలువను మాత్రం అధికారికంగా, చెక్‌/డీడీ/ఆన్‌లైన్‌ పద్ధతిలో వసూలు చేసుకుని, మిగిలింది నగదు రూపంలో తీసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. పట్టణాలు, నగరాల్లో ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ విలువ కంటే దాదాపు రెట్టింపు ధర పలుకుతోంది. తేడా మొత్తమంతా అనధికారిక చెల్లింపే. ఈ నగదు అంతా నల్లధనమే. కార్పొరేట్‌/అగ్రశ్రేణి స్థిరాస్తి సంస్థలు మినహా చిన్నా, చితకా స్థాయి నుంచి మధ్యస్థాయి భవవ నిర్మాణదారులు జరిపే విక్రయాల్లో అధికశాతం నగదు రూపంలోనే ఉంటాయి. పాత ఆస్తుల విక్రయంలోనూ నగదు లావాదేవీలే అధికం. వీరిపై అధిక ప్రభావం ఉంటుంది. ఇలాంటి లావాదేవీలన్నింటిలో రూ.500, 1,000 నోట్లదే కీలకపాత్ర.

* ఇప్పుడు పెద్ద నోట్లు రద్దవుతున్నందున, ఈ రంగానికి భారీ కుదుపు తప్పకపోవచ్చు. ధరలు దిగి రాక తప్పదు. అందుబాటు ధరల్లో ఫ్లాట్లు, ఇళ్ల నిర్మాణం పెరిగే అవకాశం ఉంది. సామాన్య, మధ్య తరగతికి ఇది ­రట కలిగిస్తుంది. చెక్‌, కార్డు రూపేణ చెల్లింపులు ప్రారంభమైతే, ఈ రంగం గాడిన పడుతుంది.

పసిడిపై ఎలా? 
బంగారంపై కూడా దిగుమతి సుంకం 10 శాతం, వ్యాట్‌ 1 శాతం ఉంటోంది. ఇతర ఖర్చులు కూడా కలిపితే, అంతర్జాతీయ విపణి కంటే దాదాపు 12-13 శాతం వరకు దేశీయంగా ధర అధికంగా ఉంటోంది. దీంతోపాటు రూ.2 లక్షలకు మించి అధికారిక కొనుగోళ్లకు పాన్‌ తప్పనిసరి అయింది. అందువల్లే దొంగచాటుగా దిగుమతి చేసుకునే నల్ల వ్యాపారుల వద్ద లావాదేవీలు పెరుగుతున్నాయని ప్రభుత్వమే ఇటీవల అనుమానం వ్యక్తం చేసింది. దేశంలోకి అధికారికంగా దిగుమతి అవుతున్న బంగారం తగ్గిపోవడానికి ఈ లావాదేవీలే కారణమని సందేహిస్తోంది. దొంగచాటుగా చేరిన బంగారానికి చెల్లింపులు కూడా బ్యాంకుల వంటి అధికారిక ఆర్థిక వ్యవస్థల ద్వారా జరగవు. ఈ మొత్తం కూడా హవాలా రూపంలో జరుగుతాయి. వీటికి కూడా పెద్ద నోట్లే ఆధారం. ఇవి రద్దయినందున, అధికారిక విక్రయాలు పెరిగేందుకు మార్గం సుగమం అవుతుందంటున్నారు. కొంతకాలం పాటు విక్రయాలపై ప్రభావం ఉన్నా, ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందని చెబుతున్నారు.

* రైతు వారీ కొనుగోళ్లు అధికంగా నగదు రూపేణ జరుగుతాయని, చిరు వ్యాపారులు, నగల తయారీదార్లను వీరు ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఈ లావాదేవీలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, వాహనాలు 
ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, వాహనాల కొనుగోళ్లు అధికారికంగానే జరుగుతున్నాయి. వీటికి వారెంటీ, విక్రయానంతర సేవలు అవసరం కనుక ఇలా చేస్తున్నారు. అయితే ఈ కొనుగోళ్లలోనూ నగదు చెలామణి ఎక్కువే. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో రుణంపై తీసుకునే వారు 30 శాతం మంది ఉంటే, మిగిలిన వారు కార్డులు, నగదు రూపేణ తీసుకుంటారు. రూ.లక్ష అంతకుమించి విలువైన గృహోపరణాలను నగదు రూపేణ తీసుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. ఇటువంటి లావాదేవీల్లో నల్లధనం, పెద్దనోట్ల చెలామణి ఎక్కువే. కార్లు, ఆపై వాహనాల్లో అత్యధికం రుణంపైనే ఉంటాయి. ద్విచక్ర వాహనాలలో నగదు చెల్లించి, రుణంపై తీసుకునేవే అధికం. వీటికి కార్డుల రూపంలో చెల్లించే వారు తక్కువ. ఇక వినియోగ వాహన విపణిలో అయితే 95 శాతం నగదు రూపంలో లావాదేవీలే ఉంటాయని చెబుతున్నారు. కార్పొరేట్‌ సంస్థలు నెలకొల్పిన విక్రయసంస్థల్లో మాత్రం అధికారిక ఆర్థిక వ్యవస్థల ద్వారా లావాదేవీలు ఉంటాయని చెబుతున్నారు. రూ.50,000 అంతకుమించి ఖరీదైన సెల్‌ఫోన్లను కూడా రుణం/క్రెడిట్‌కార్డు/సులభ వాయిదాల్లో లేదా నల్లధనంతో కొంటున్నవారున్నారు. వీటన్నిటిపై ప్రభావం తప్పదని అంటున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...