Jump to content

cheater


ariel

Recommended Posts

ప్రేమ పెళ్లితో వైద్యుడి నయవంచన 
28-01-2017 02:41:25

636211680862552788.jpg
  • రెండో రోజు నుంచే వేధింపులు 
  • రూ.20 లక్షలు ఇస్తా.. విడాకులు ఇచ్చేయ్యాలంటూ డిమాండ్‌ 
  • బాధితురాలి ఆత్మహత్యాయత్నం.. భర్త కుటుంబంపై కేసు 
గుంటూరు, జనవరి 27: ప్రేమిస్తున్నానని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించి పీజీ మెడికోను పెళ్లి చేసుకున్న ఓ వైద్యుడు ఆమెను వంచించాడు. పెళ్లి అయిన రెండో రోజే వేధింపులు మొదలుపెట్టి చివరకు రూ.20 లక్షలు ఇస్తాం, విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఈ నయవంచనను ఇది తట్టుకోలేక బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన కంఠమనేని భవాని శంకర్‌, వాణి దంపతుల కుమార్తె బేబి లక్ష్మి 2013లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి 2015లో అమలాపురంలోని కిమ్స్‌లో పీజీ చేరింది. అప్పటికే అదే కళాశాలలో ఎండీ మూడో సంవత్సరం చదువుతున్న గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన క్రొత్తపల్లి సాయికృష్ణ ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. సాయికృష్ణ తండ్రి సాంబశివరావు నాగార్జున వర్సిటీలో రెక్టార్‌గా, తల్లి కృష్ణశ్రీ టుబాకో బోర్డులో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారు బేబి లక్ష్మి తల్లిదండ్రులతో మాట్లాడి 2015 నవంబరు 14న వివాహం చేశారు. లక్ష్మి కుటుంబం ఎకరం నిమ్మతోట సహా 10 ఎకరాల పొలం, 100 సవర్ల బంగారం, కారు కట్నంగా ఇచ్చారు. పెళ్లి అయిన రెండో రోజు నుంచే సాయికృష్ణ... లక్ష్మిని అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. మొదటి 6 నెలలు అమలాపురంలో కలిసి ఉన్నారు. ఆ తర్వాత సాయికృష్ణ కోర్సు పూర్తి కావడంతో జీజీహెచ్‌లో వైద్యుడిగా రూరల్‌ సర్వీస్‌ చేస్తూ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ నెల 20న గుంటూరు వచ్చిన లక్ష్మి, ఆమె తల్లిదండ్రులు.. సాయికృష్ణ ఇంటికి వెళ్లి ఆయన తల్లిదండ్రులతో మాట్లాడగా తాము చేసేది ఏమీ లేదని స్పష్టం చేశారు. రూ.20 లక్షలు తీసుకుని విడాకులు ఇవ్వాలని సాయికృష్ణ కోరాడు. దీనిని తట్టుకోలే 21న లక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స చేయించగా ఆమె కోలుకుంది. 23న తిరిగి అమలాపురం వెళ్లిన ఆమె అమలాపురం రూరల్‌ స్టేషన్‌లో భర్త సాయికృష్ణతో పాటు అత్తమామలపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కూడా తాము చెప్పినట్లు కాకుండా వారి ఇష్టం వచ్చినట్లు రాసుకొని తనను సంతకం చేయాలని బెదిరించారని బేబి లక్ష్మీ వాపోయింది. ఇదిలా ఉంటే తన భర్త సాయికృష్ణ అమెరికా లేదంటే లండన్‌ వెళ్లేందుకు సిద్ధం అయ్యాడని, తనలాగా మరో యువతి మోసపోకూడదనే తాను బయటకు రావాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...