Jump to content

Justice City in Amaravati in 3,300 acres


Swas

Recommended Posts

అమరావతినిర్మాణం తనకు వచ్చిన మంచిఅవకాశమని సీఎం పేర్కొన్నారు. అందులో నిర్మించనున్న తొమ్మిది నగరాల్లో జస్టిస్‌ సిటీకి 3,300 ఎకరాలు కేటాయించినట్టు చెప్పారు. ‘సింగపూర్‌, లండన్‌ తరహాలో జస్టిస్‌ సిటీ అభివృద్ధికి మీ సహకారం అవసరం’ అని జడ్జీలను కోరారు. దేశంలో బలీయమైన, స్వతంత్రమైన న్యాయవ్యవస్థ ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అశాసీ్త్రయంగా జరిగిందన్న సీఎం, దాని కారణంగా తలెత్తిన నష్టాలను రాష్ట్రం భరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా అభివృద్ధి చేశా. ఇప్పుడు అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా అభివృద్ధి చేస్తా. అమరావతి ప్రపంచంలోనే ఐదు మేటి నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.

 

నవ్య’ దిశలుగా అభివృద్ధి 
25-02-2017 01:04:19

636235814608494109.jpg
  • కేంద్రీకరణ కాదు విస్తరించాలి.. సవాళ్లలోంచే ఎదుగుతున్న ఏపీ
  • వివాద పరిష్కారాల నిడివి తగ్గితే రాషా్ట్రనికి అపారంగా పెట్టుబడులు
  • న్యాయసదస్సులో జస్టిస్‌ రమణ.. కమర్షియల్‌ కోర్టులకు సీఎం ఓకే
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): నూతన రాష్ట్రంలో అభివృద్ధిని విస్తరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. హైకోర్టు, పరిశ్రమలు సహా ప్రతిదీ హైదరాబాద్‌లో ఉండటంతో ఈ ప్రాంతంలో లాయర్లకు అవకాశాలు పరిమితమయ్యాయని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన ప్రజల జీవితాల్లో ఒక టర్నింగ్‌ పాయింట్‌ అని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జస్టిస్‌ రమణ ప్రశంసించారు. ‘మేధో సంపత్తి, వాణిజ్య-నూతన చట్టాలు’ అనే అంశంపై శుక్రవారం విజయవాడలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ న్యాయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘పరిమిత ప్రభుత్వం- అపరిమిత పాలన’ను తాను విశ్వసిస్తానని, కొత్త రాష్ట్రంలో ఈ దిశగా మంచి ఫలితాలను రాబట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జ్యుడీషియల్‌ అకాడమీని, స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరినట్టు చెప్పారు. వ్యాపార సంస్థల వాణిజ్య ప్రయోజనాలను కాపాడటానికి సమర్థవంతమైన న్యాయ ప్రక్రియ అవసరమన్న జస్టిస్‌ రమణ, ఇందుకోసం కమర్షియల్‌ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు.
 
‘‘నేను జపాన్‌ పర్యటనకు వెళ్ళినప్పుడు ఓ అంశాన్ని గమనించాను. ఆ దేశ కంపెనీలు ఇండియాలో... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. అయితే ఒక వివాద పరిష్కారానికి ఇండియాలో ఎంత కాలం పడుతుందనే ప్రశ్న ఎక్కువగా వినవచ్చింది’ అని ఆయన వివరించారు. గతంలో పెట్టుబడులు భౌతికంగా భూమి, మెషీన్ల రూపంలో కనిపించేదని, ఇప్పుడవి ఐడియాలు, ఇతరత్రా కనిపించని రూపాల్లో ఉంటున్నాయని పేర్కొన్నారు. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నంత వేగంగానే, సైబర్‌ నేరాలూ పెరుగుతున్నాయని, ఈ విషయంలో విశాఖపట్నం దేశంలోనే రెండో స్థానంలో ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు 2013లో 149 నమోదు కాగా 2016లో 400 కేసులు నమోదయ్యాయని జస్టిస్‌ రమణ వివరించారు
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...