Jump to content

‘స్మార్ట్’ అమరావతికి జపాన్ చేయూత


Swas

Recommended Posts

‘స్మార్ట్‌’ అమరావతికి జపాన్ చేయూత 
 
636230678713793392.jpg
  • 5 కీలకాంశాలపై ప్రతిపాదనలు
  • రాష్ట్ర అధికారులతో ప్రఖ్యాత కంపెనీల చర్చలు
  • టెక్నికల్‌ ప్రజంటేషన్లతో ప్రాజెక్టులపై వివరణ
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): అమరావతి నగరంలో ప్రపంచస్థాయి మౌలిక వసతులను సమకూర్చేందుకు దోహదపడే పలు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను జపాన్ దేశానికి చెందిన వివిధ సుప్రసిద్ధ కంపెనీలు సమర్పించాయి. అమరావతి అభివృద్ధి నిమిత్తం 2015 అక్టోబరు 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జపాన్ ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎంఐటీఈ) మధ్య ఎంవోయూ కుదిరింది. అందులో భాగంగా జపానకు చెందిన పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన ప్రతినిధులు తాము రూపొందించిన వివిధ ప్రతిపాదనలను ఏపీసీఆర్‌డీఏ, ఏడీసీ, పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. విజయవాడలో శుక్ర, శనివారాల్లో జరిగిన సమావేశాల్లో వారు అమరావతిని స్మార్ట్‌, సస్టెయినబుల్‌ సిటీగా రూపొందించేందుకు తోడ్పడనున్న 5 అంశాలపై అత్యుత్తమ జపనీస్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన టెక్నికల్‌ ప్రజంటేషన్లు ఇచ్చారు. ఆ అంశాలివీ..
 

 

డేటా సెంటర్‌-క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: అత్యధునాతన, తక్కువ శక్తితో పని చేసే మాడ్యులార్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా అమరావతితోపాటు రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలను అందించడం దీని లక్ష్యం. ఇవి మాడ్యులార్‌ కావడంతో వివిధ సిటిజన అప్లికేషన్సకు అవసరమైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను అందుబాటులోకి తెస్తాయి. పైగా వీటి ఏర్పాటుకు తక్కువ సమయం పడుతుంది.

 
వాతావరణ రాడార్‌ వ్యవస్థ: జపాన్‌కు చెందిన ప్రఖ్యాత తోషిబా సంస్థ ప్రతిపాదించిన అత్యధునాతన, సమీకృత వాతావరణ రాడార్‌ వ్యవస్థ అమరావతికి ప్రకృతి వైపరీత్యాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. నది, కాలువలు, మురుగునీరు, రవాణా తదితర వ్యవస్థలన్నింటితో అనుసంధానమై ఉండే ఈ వ్యవస్థ ప్రకృతి విపత్తులను తగినంత ముందుగానే పసిగట్టి, హెచ్చరిస్తుంది. ఇప్పటికే జపానలో ఎంతో విజయవంతమైన ఈ వ్యవస్థ ద్వారా ప్రాణనష్టాలను పూర్తిగా నిరోధించవచ్చు.
 
నీటి సరఫరా వ్యవస్థ: అమరావతిలోని ప్రతి నివాసగృహమూ నాణ్యమైన, పరిశుద్ధమైన నీటిని పొందేందుకు ఉపకరించే వాటర్‌ ట్రీట్‌మెంట్‌ వ్యవస్థ గురించి కోబెల్కో సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృత వినియోగంలో ఉన్న ఈ వ్యవస్థ అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో నడుస్తుంది. అమరావతి ప్రాంతంలో లభ్యమయ్యే నీటి స్వభావానికి అనుగుణంగా ఇందులో అవసరమైన మార్పులు చేశారు.
 
మురుగునీటి శుద్ధి: అమరావతి పూర్తి పర్యావరణహితంగా ఆవిర్భవించేందుకు దోహదపడే సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ గురించి ప్రతినిధులు వివరించారు. అధునాతన పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విధానానికి ఇంధనం ఖర్చు తక్కువ. ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో ఇది అమలులో ఉంది.
 
ట్రాఫిక్‌ నియంత్రణ: తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్న విజయవాడ నగరంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు నిప్పన సిగ్నల్‌ కంపెనీ అత్యధునాతన ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను రూపొందించి, ప్రదర్శించింది. సెన్సర్ల సహాయంతో పని చేసే ఈ వ్యవస్థ... నగరంలోని వివిధ సిగ్నలింగ్‌ పాయింట్ల వద్ద ఉండే ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆయా సిగ్నళ్లు ఎంతసేపు వెలగాలనే విషయాన్ని నిర్ధారించడం ద్వారా ట్రాఫిక్‌ జామ్‌లను నివారిస్తాయి. ఈ సమావేశాల్లో ఏపీసీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ వి.రామమనోహరరావు, విజయవాడ డీసీపీ (ట్రాఫిక్‌) రాణా, ఏడీసీ ఉన్నతాధికారులతోపాటు జపానకు చెందిన హరుహికో అందోహ్‌, ఇచిరో అబె, యుకి త్సునాషిమా, తకమస హిరోసె, యుట కోబయషి తదితరులు పాల్గొన్నారు
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...