Jump to content

సాహోరే బార్బర్.... మూడున్నర కోట్ల కారు కొనుగోలు


trent

Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=376736

సాహోరే బార్బర్.... మూడున్నర కోట్ల కారు కొనుగోలు...!
02-03-2017 13:48:13

636240592947023673.jpg
బెంగళూరు: మినీ సిలికాన్ వ్యాలీ బెంగళూరులోని ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్... రోల్స్ రాయిస్‌, 11 మెర్సిడెస్, 10 బీఎండబ్ల్యూ , మూడు ఆడి, రెండు జాగ్వార్ ఇలా పలు లగ్జరీ కార్లు కొలువుదీరి ఉంటాయిక్కడ.. ఇటీవలే కొత్తగా జర్మనీ నుంచి రూ. 3.2 కోట్ల కారు ప్రత్యేకంగా వచ్చి చేరింది. ఇలాంటి కారు మల్టీ మిలియనీర్ విజయ్‌మాల్యా, మరో బడా బిల్డర్ దగ్గర తప్ప నగరంలో మరెవ్వరికీ లేదు... ఇంతకీ దీని ఓనర్ ఎవరో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు... ఆయనే ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ రమేశ్ బాబు. అవును.. మీరు చదువుతున్నది నిజమే.. ఒక్కో హెయిర్ కటింగ్‌కు కేవలం రూ.75 తీసుకునే ఆయన... లగ్జరీ కార్లు కొనుగోలు చేసి అద్దెకిస్తూ ఉంటారు.
 
 
రమేశ్ బాబు కార్లలాగానే ఆయన ప్రస్థానం కూడా శిఖరమెత్తు స్ఫూర్తిని పంచుతుంది. రమేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దినదిన ప్రవర్థమానమై ఎంతెత్తు ఎదిగినా... గత 30 యేళ్ల నుంచి ఇప్పటి వరకు చేతి వృత్తిని వదులుకోలేదు. బౌరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆనుకుని ఉన్న ఆయన సెలూన్‌లో ఇప్పటికీ రోజుకు 5 గంటల పాటు పనిచేస్తారు. రెగ్యులర్‌గా తన వద్దకు వచ్చే కస్టమర్లకు ఆయనే స్వయంగా హైయిర్ స్టైల్స్ చేస్తారు. వృత్తి రీత్యా బార్బర్ అయిన ఆయన ఎప్పుడూ తన మూలాలు మర్చిపోనని చెబుతారు. కానీ ఇతరుల మాదిరిగా కాకుండా ఆయన పనికి వెళ్లేటప్పుడు సైతం.. తెల్లటి రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారులో వెళుతూ కనిపించడం విశేషం.
 
 
 
సెలూన్ నుంచి వచ్చే ఆదాయం తక్కువే అయినా.. లగ్జరీ కార్లను అద్దెకిస్తూ వ్యాపారాన్ని నిర్మించారు. ధనవంతులైన వినియోగదారులు చాలా మంది ఆయన నెట్‌వర్క్‌లో ఉన్నారు. 45 ఏళ్ల రమేశ్ బాబు.. తన కష్టార్జితమైన సొంతడబ్బుతో పాటు మరికొంత బ్యాంకు లోను సహాయంతో ఇటీవలే ఖరీదైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును కొనుగోలు చేశారు. విజయ్ మాల్యాకి ఇలాంటిదే బంగారు వర్ణం కారు ఉన్నప్పటికీ... ఆయన లండన్ వెళ్లిపోయిన తర్వాత మళ్లీ అది బెంగళూరు రోడ్లపై కనిపించలేదు.
 
 
కాగా రమేశ్ బాబు మాట్లాడుతూ.. ‘‘దేవుడు నాతో ఉన్నాడు. నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడి పనిచేశాను. మార్కెట్లో ఎన్ని రకాల లగ్జరీ కార్లు ఉన్నాయో.. అవన్నీ నా దగ్గరుండాలన్నదే నా కల’’ అని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల వయసులో 1979లో తండ్రిని కోల్పోయిన రమేశ్ బాబుది నిరుపేద కుటుంబం. ఎస్ఎస్ఎల్సీ పూర్తయిన తర్వాత... ఆయన చదువు మానేసి తన తండ్రిలాగానే ఫుల్‌టైం బార్బర్‌గా పని ప్రారంభించారు. 1994లో ఓ మారుతీ ఓమ్నీ కొని అద్దెకివ్వడం ప్రారంభించారు. అది మొదలు క్రమంగా వ్యాపారం నిర్మించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన దగ్గర 150 లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పనికి వేసుకుని వెళ్తారు. మంచి క్లయింట్స్ వస్తే మరికొన్నింటిని అద్దెకిస్తారు. 2011లో రోల్స్ రాయిస్ కారు కొనడంతో రమేశ్ బాబు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...