Jump to content

iit jee results, no girls in top 30


kakatiya

Recommended Posts

27hyd-main2a.jpg

 దిల్లీ: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. తొలి 10 ర్యాంకుల్లో ఇద్దరు, టాప్‌-20లో ఐదుగురు, మొదటి 100 ర్యాంకుల్లో దాదాపు 30 మంది నిలిచారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన కల్పిత్‌ వీర్వల్‌ తొలిసారి జేఈఈ మెయిన్‌లో వంద శాతం(360కి 360) మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన మోహన్‌ అభ్యాస్‌ 360కి 345 మార్కులు సాధించి 6వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతే మార్కులు సాధించిన వరుణ్‌ తేజ్‌ చౌదరికి 9వ ర్యాంకు దక్కింది. ఇంకా 11, 13 ర్యాంకులు కూడా తెలుగు విద్యార్థులకే దక్కాయి. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి, ఐఐటీల్లో చేరేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ ర్యాంకులను సీబీఎస్‌ఈ గురువారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ నెల 2న రాత పరీక్ష, 8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో జరిపారు. మొత్తం దాదాపు 12 లక్షల మంది హాజరవగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది పరీక్ష రాశారు. బొల్లా వెంకట పవన్‌ 337 మార్కులతో 11వ ర్యాంకు, 335 మార్కులతో అబ్దుల్‌ మోహిజ్‌ 13వ ర్యాంకు పొందారు. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన భూక్యా రాహుల్‌ ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంకు(270 మార్కులు) సాధించాడు.

శిక్షణకు హైదరాబాద్‌ వెళ్లమన్నారు: కల్పిత్‌ 
శిక్షణ కోసం కోట లేదా హైదరాబాద్‌ వెళ్లమని చాలా మంది చెప్పారు. కానీ, చదువును భారంగా కాకుండా ఆస్వాదిస్తూ నేర్చుకోవాలనుకున్నా. అందుకే ఉదయ్‌పుర్‌లోని శిక్షణ కేంద్రంలోనే చేరా. వందశాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థిగా నిలవడం నాకెంతో సంతోషంగా ఉంది.

భారీగా తగ్గిన కటాఫ్‌ మార్కులు 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ 81 మార్కులు మాత్రమే. కటాఫ్‌ మార్కులు 95-105 మధ్య ఉంటాయన్న నిపుణుల అంచనాలు తప్పాయి. గతేడాది కటాఫ్‌ మార్కులు 100. కటాఫ్‌మార్కులు కంటే పైన మార్కులు సాధించిన వారికే (2.20 లక్షల మందికి) అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశంఇస్తారు. జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ర్యాంకులొచ్చిన వారికి ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో సీట్లు దక్కుతాయి.

నేటి నుంచి ‘అడ్వాన్స్‌డ్‌’ రిజిస్ట్రేషన్‌ 
మే 21న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మే 2 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఐఐటీ మద్రాస్‌ తెలిపింది. ఆలస్య రుసుముతో మే 4 సాయంత్రం 5 గంటల వరకు చేసుకోవచ్చు.

‘వెయిటేజీ’ తొలగింపు ప్రభావం నామమాత్రమే! 
ఇంటర్‌ మార్కుల వెయిటేజీతో తెలుగు విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో భారీగా లబ్ధి పొందుతున్నారంటూ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ తొలగించినా టాప్‌ ర్యాంకులు తగ్గకపోవడమే దీనికి నిదర్శనమంటున్నారు. గతేడాది రెండు రాష్ట్రాల నుంచి 1,32,648 మంది జేఈఈ మెయిన్‌కు హాజరవగా వారిలో 28,951 మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఎంపికయ్యారు. 2015లో 18,500 మంది అర్హత సాధించారు. ఈసారి ఆ సంఖ్య 30 వేలకుపైగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొనే విద్యార్థులు స్వల్పంగా నష్టపోయి ఉండొచ్చని శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ సుష్మ అభిప్రాయపడ్డారు. వెయిటేజీ తొలగింపు వల్ల ప్రభావం ఏమీ లేదని ఐఐటీ శిక్షణ నిపుణుడు ఎం.ఉమాశంకర్‌ అన్నారు.

21 మంది గురుకుల విద్యార్థులకు.. 
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ విద్యార్థులు 21 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించారని ఆ సంస్థ కార్యదర్శి బి.శేషుకుమారి ఓ ప్రకటనలో తెలిపారు.

ఒక్క అమ్మాయీ లేదు.. 
జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మొదటి 100 ర్యాంకుల్లో 30 సాధించినా.. వీరిలో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడం గమనార్హం. గతేడాది 94వ ర్యాంకు దక్కింది. ఈ సారి ఓ విద్యార్థిని మాత్రం 102వ ర్యాంకు సాధించినట్లు శిక్షణ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థినులు ఇంటర్‌లో బైపీసీ గ్రూపు తీసుకొని మెడికల్‌ వైపు వెళ్లడమే దీనికి కారణమని ఓ కళాశాల నిర్వాహకురాలు తెలిపారు.

Link to comment
Share on other sites

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ICANWIN

    8

  • kakatiya

    7

  • icecreamZ

    7

  • innovative

    3

Popular Days

Top Posters In This Topic

ఒక్క అమ్మాయీ లేదు.. 
జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మొదటి 100 ర్యాంకుల్లో 30 సాధించినా.. వీరిలో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడం గమనార్హం. గతేడాది 94వ ర్యాంకు దక్కింది. ఈ సారి ఓ విద్యార్థిని మాత్రం 102వ ర్యాంకు సాధించినట్లు శిక్షణ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థినులు ఇంటర్‌లో బైపీసీ గ్రూపు తీసుకొని మెడికల్‌ వైపు వెళ్లడమే దీనికి కారణమని ఓ కళాశాల నిర్వాహకురాలు తెలిపారు.

Link to comment
Share on other sites

ఒక్క అమ్మాయీ లేదు.. 
జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మొదటి 100 ర్యాంకుల్లో 30 సాధించినా.. వీరిలో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడం గమనార్హం. గతేడాది 94వ ర్యాంకు దక్కింది. ఈ సారి ఓ విద్యార్థిని మాత్రం 102వ ర్యాంకు సాధించినట్లు శిక్షణ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థినులు ఇంటర్‌లో బైపీసీ గ్రూపు తీసుకొని మెడికల్‌ వైపు వెళ్లడమే దీనికి కారణమని ఓ కళాశాల నిర్వాహకురాలు తెలిపారు.

Link to comment
Share on other sites

14 minutes ago, MRI said:

anyayam.. magavalla ahankaram idi.. ada jaathi takkuvem kadu.. reservation penchali.. #womenempowerment

inka ammailaku reservation penchithe boys ki seats em migalavu .. 

Link to comment
Share on other sites

2 hours ago, tennisluvr said:

Nee CI date eppudu bro? 

no date given.. anyways manam tondarlo ship kaamu anta kada.. na ssbi kooda jaragatam ledhu.. it is frozen..

Link to comment
Share on other sites

Ilantivi share cheyyakandi bro. Ippatike women empowerment gang antha prathi dani patriarchy, sexism, male dominance ani saava dobbutunnaru. Already admissions seats lo reservations unnayi. Ippudu results lo kuuda reservations kaavali antaru. Like top 10 lo 33% ammayilu undali score unna lekunna ani

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...