వేలూరు, న్యూస్టుడే: పెళ్లి పీటలపై వధువు మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న అన్నను పక్కకు తోసేసి తమ్ముడు తాళి కట్టిన సంఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో జరిగింది. వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు సెల్లరైపట్టికి చెందిన కామరాజ్కు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆరు నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్కు మదురైకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. గురువారం ఉదయం ఇలవంపట్టి వెన్కల్ ప్రాంతంలోని మురుగన్ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. వధూవరులను పెళ్లి పీటలపై కూర్చోపెట్టి పు