Jump to content

16 ఫ్యాక్చర్లు 8 సర్జరీలు సివిల్స్లో ర్యాంకు ఎముకలు విరిగినా.. తల్లిదండ్రులు కాదన్నా..


JANASENA

Recommended Posts

దిల్లీ: పట్టుదల ఉంటే అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయ్యొచ్చు అని నిరూపించిందామె. పేద కుటుంబంలో పుట్టి.. మురికి వాడల్లో పెరిగినా.. చదువుకోవాలన్న లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. చిన్నప్పటి నుంచి ఎముకల సంబంధిత వ్యాధి బాధిస్తున్నా.. తల్లిదండ్రులు కాదు పొమ్మన్నా.. కష్టపడి, కాదు కాదు ఇష్టపడి చదువుకుంది. ఆమె తపన ముందు కష్టాలన్నీ చిన్నబోయాయి. అలా.. యూపీఎస్‌సీలో దేశవ్యాప్తంగా 420వ ర్యాంకును సాధించింది. ఆమే రాజస్థాన్‌కు చెందిన ఉమల్‌ ఖేర్‌.

ఉమల్‌ రాజస్థాన్‌లోని నిరుపేద కుటుంబంలో పుట్టింది. చిన్నతనంలోనే ఎముకలకు సంబంధించిన వ్యాధికి గురైంది. ఆమె ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఉమల్‌ కుటుంబం దిల్లీకి మకాం మార్చారు. మురికివాడల్లో ఉంటూ.. వీధుల్లో బట్టలు అమ్ముకుంటూ ఆమె కుటుంబం జీవనం సాగించేది. అయితే ఉమల్‌కు ఉన్నత చదువులు చదవాలని కోరిక. అంగవైకల్యం తనను బాధిస్తున్నా.. చదువుకుంటానని చెప్పింది. అలా స్కాలర్‌షిప్‌లు, ఛారిటీల సాయంతో దిల్లీలో ఎనిమిదో తరగతి పూర్తి చేసింది.

అప్పుడే అనుకోని కష్టం ఎదురైంది. సెకండరీ స్కూల్‌లో చేరుతానని ఉమల్‌ చెబితే.. ఆమె తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఇక చదివేది లేదని తేల్చిచెప్పారు. ఎదురు తిరిగితే తిట్టారు, కొట్టారు. ఆడపిల్లకు చదువెందుకని ఈసడించారు. చదువుకోవాలనేదే తన నిర్ణయమైతే తమతో బంధాన్ని తెంచుకోవాలని చెప్పారు. ఆ సమయంలో ఉమల్‌ తీసుకున్న కఠినమైన నిర్ణయమే.. ఇప్పుడామెకు అరుదైన అరుదైన విజయాన్ని అందించింది.

నిండా పదిహేనేళ్లు కూడా లేని వయసులో ఇంటి నుంచి బయటకొచ్చింది ఉమల్‌. మురికివాడల్లోని ఓ గుడిసెను అద్దెకు తీసుకుని మళ్లీ చదువుకోవడం మొదలుపెట్టింది. అయితే ఒంటరిగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. ముఖ్యంగా డబ్బు కావాలి. అందుకోసం ట్యూషన్లు చెప్పేది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూనే చదువును సాగించింది. అలా 12వ తరగతిలో 91శాతం మార్కులు సాధించింది.

ఆ తర్వాత దిల్లీ యూనివర్శిటీలో సీటు సాధించింది. కళాశాలలో జరిగే కార్యక్రమాలు, ట్యూషన్ల ద్వారా డబ్బు సంపాదిస్తూ డిగ్రీ పూర్తిచేసింది. ఈ సమయంలోనే ఉమల్‌ తల్లిదండ్రులు దిల్లీ వదిలి స్వరాష్ట్రానికి వెళ్లిపోయారు. అప్పుడే అనుకోని ఘటన. 2012లో ఉమల్‌ ప్రమాదానికి గురైంది. ఏడాది కాలం పాటు చక్రాల కుర్చీకే పరిమితమైంది. మరోవైపు ఎముకల వ్యాధి కారణంగా 16 ఫ్యాక్చర్లు 8 సర్జరీలు అయ్యాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోనూ ఆమె దిల్లీలోని జేఎన్‌యూ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించింది.

స్కాలర్‌షిప్‌ సాయంతో చదువుకుని ఇటీవల నిర్వహించిన యూపీఎస్‌సీ పరీక్ష రాసింది. తొలి ప్రయత్నంలోనే 420వ ర్యాంకు సాధించి శభాష్‌ అనిపించుకుంది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఆమెకు తన తల్లిదండ్రుల మీద ఎలాంటి కోపం లేదనే చెబుతోంది ఉమల్‌. ‘వారున్న కుటుంబ పరిస్థితులు అలాంటివి. నేను వారికి ఇంకా ఫోన్‌ చేయలేదు. ఎందుకంటే వారికి కనీసం సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష అంటే ఏంటో కూడా తెలియదు. త్వరలోనే వాళ్లని కలుస్తాను’ అని చెబుతోంది. వికలాంగుల కోటాలో తనకు తప్పకుండా ఐఏఎస్‌ ఉద్యోగం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి ఉమల్‌ నిజంగా ఆదర్శమేగా..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...