Jump to content

నెలకు రూ.8 లక్షలు భరణంగా చెల్లించాలి


BaabuBangaram

Recommended Posts

జయవాడ: సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్‌ తన భార్యకు నెలకు రూ.8లక్షలు భరణంగా చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌లోని వివరాల ప్రకారం..విజయవాడలోని అరండల్‌పేటకు చెందిన శ్రీలక్ష్మి(47)కి నటుడు శేషు అలియస్‌ మూర్తి అలియాస్‌ బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు విజయవాడలో మిఠాయి దుకాణం నిర్వహించేవారు. తండ్రి చనిపోవడంతో శ్రీలక్ష్మి, పృథ్వీరాజ్‌లు కొన్నాళ్లు ఆ దుకాణం నిర్వహించారు. ఆ సమయంలో నటనపై ఆసక్తి ఉన్న పృథ్వీరాజ్‌ తరచూ చెన్నై వెళ్లి వస్తుండేవారు. క్రమేణా సినీరంగంలో రాణించడంతో కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చారు. అక్కడ పృథ్వీరాజ్‌ వ్యసనాలకు బానిసై శ్రీలక్ష్మితో గొడవపడి 2016 ఏప్రిల్‌ 05న ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. దీంతో ఆమె విజయవాడ చేరుకున్నారు. పెద్దమనుషులు దంపతుల మధ్య రాజీకి ప్రయత్నించినా పృథ్వీ పట్టించుకోపోవడంతో 2016 నవంబర్‌ 02 సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఆమె పృథ్వీరాజ్‌పై 498ఎ కేసు పెట్టారు. తన భర్త ఆదాయపరిస్థితి బాగానే ఉన్నందున తన జీవనోపాధికి అతని నుంచి నెలకు రూ.10లక్షలు ఇప్పించాలని శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేశారు. సమన్లను పృథ్వీ అందుకోకపోవడంతో బాధితురాలు హైదరాబాద్‌లో పేపర్‌ ప్రకటన ద్వారా నోటీసు ఇచ్చారు. అనంతరం కేసు వాయిదాకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి బాధితురాలికి నెలకు రూ.8లక్షలు భరణం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

 

eedu gattigane sampadisthunnada endhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...