Jump to content

నేను నిత్య విద్యార్థిని


TampaChinnodu

Recommended Posts

నేను నిత్య విద్యార్థిని 
ప్రయోగాత్మకంగా ‘విద్యావాణి’ ప్రాజెక్టు 
ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 
ఈనాడు - అమరావతి 
24ap-main6a.jpg

‘‘రాష్ట్రంలో నేను మొదటి విద్యార్థి. అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకునేందుకు అందరి కంటే ముందుంటాను. వాటిని ప్రజలకు అమలు చేయడంలోనూ అలాగే ఉంటాను...’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని సీవీఆర్‌ పురపాలక పాఠశాలలో సోమవారం పురపాలక పాఠశాలల తరగతి గదులను డిజిటలీకరణ చేసే ‘విద్యావాణి’ ప్రాజెక్టును ప్రారంభించారు. విజయవాడలోని 14 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా 62 డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ఆన్‌లైన్‌లో 14 పాఠశాలల విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటించారు. ‘‘ఇది నూతన ప్రయోగం. బహుశా ప్రపంచంలోనే మొదటిది కావొచ్చు. ఈ ప్రాజెక్టు ప్రారంభం మొదటి విజయం. రాష్ట్రం నాలెడ్జ్‌హబ్‌గా ఉండాలి. ఇక్కడి నుంచే వినూత్న ఆలోచనలు జరగాలి. తరగతి గదిలో విన్నదాని కంటే, మామూలుగా చదివిన దానికంటే తెరపై చూస్తూ నేర్చుకునేది విద్యార్థులకు 2-3రెట్లు ఉపయోగంగా ఉంటుంది. కంటెంట్‌ను క్లౌడ్‌లో పెట్టేస్తే ఉపాధ్యాయులు చెప్పిన దాంట్లో ఏమైనా అర్థంకాకపోతే ఇంటికి వెళ్లిన తర్వాత అంతర్జాలంలో పాఠాలు చూసి నేర్చుకోవచ్చు. విద్యావంతులైన తల్లిదండ్రులు... తమ పిల్లలకు ఇంటి వద్దనే వాటిని చూస్తూ పాఠాలు చెప్పవచ్చు. విద్యార్థులే సొంతంగా పరీక్షలు రాసుకొని, తమ ప్రతిభను విశ్లేషించుకోవచ్చు. ఏదైనా అంశంపై చర్చలు పెట్టుకోవచ్చు. విద్యావాణి ప్రాజెక్టు ద్వారా తరగతిలో ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చని...’’ సీఎం వెల్లడించారు. రానున్నరోజుల్లో నాలుగువేల పురపాలక పాఠశాలల్లో విద్యావాణి ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఐఐటీ, అఖిల భారతీయ పోటీని తట్టుకునేందుకు కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సులు ప్రవేశపెట్టడంపై పురపాలక శాఖమంత్రి నారాయణను సీఎం అభినందించారు. సాంకేతికతను సక్రమంగా వినియోగించుకోవాలని, దానికి బానిస కాకూడదని చెప్పారు. రాత్రిళ్లు భార్యాభర్తలు చెరో సెల్‌ఫోన్‌ పట్టుకుని ఎవరికి వారు ఉంటుండడంతో విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తరచూ వాడకం వల్ల మానసిక ఒత్తిడి వస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

అందరూ ఎన్టీఆర్‌లా కావాలి 
విజయవాడలోని వన్‌టౌన్‌ పాఠశాల విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇక్కడ దివంగత నేత ఎన్టీఆర్‌ చదివారని, అందరూ ఆయనలా కావాలని సూచించారు. పటమట పాఠశాలకు చెందిన విద్యార్థి వరప్రసాద్‌ మాట్లాడుతూ అర్థం కాని విషయాలను ఈ విధానం ద్వారా ఇతర విద్యార్థులను అడిగి తెలుసుకోవచ్చని చెప్పగా... ప్రపంచంలోని నాలెడ్జ్‌ను వినియోగించుకోవడం ద్వారా స్పష్టత సాధించవచ్చని సీఎం సూచించారు. మొగల్రాజపురం పాఠశాల అభివృద్ధికి యార్లగడ్డ సుబ్బారావు తన అసోసియేషన్‌ ద్వారా చేస్తున్న సేవలకు ఆయన్ని సీఎం అభినందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో త్వరలో క్లౌడ్‌ ఇన్‌ఫర్మేషన్‌ డాటా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికి ఎంత డాటా అవసరమో అంత ఇస్తామని చెప్పారు. సీవీఆర్‌ పాఠశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమాన్ని తెరలపై ప్రదర్శించిన అధికారులు ఆడియో ఏర్పాటు చేయలేదు. కనెక్షన్‌ ఇవ్వాలని సీఎం సూచించారు.

Link to comment
Share on other sites

 ‘‘ఇది నూతన ప్రయోగం. బహుశా ప్రపంచంలోనే మొదటిది కావొచ్చు.

@3$%

Link to comment
Share on other sites

ఐఐటీ, అఖిల భారతీయ పోటీని తట్టుకునేందుకు కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సులు ప్రవేశపెట్టడంపై పురపాలక శాఖమంత్రి నారాయణను సీఎం అభినందించారు

@3$%

Link to comment
Share on other sites

2 minutes ago, idibezwada said:

Nenu neutral anudu..indirect edsudu..common aipoindi dblo..its a modable cover drive..@3$%

 

Link to comment
Share on other sites

3 minutes ago, idibezwada said:

Nenu neutral anudu..indirect edsudu..common aipoindi dblo..its a modable cover drive..@3$%

KTR , KCR ilanti chetta statements ichina fost sestha same.

Link to comment
Share on other sites

7 minutes ago, idibezwada said:

Nenu neutral anudu..indirect edsudu..common aipoindi dblo..its a modable cover drive..@3$%

It is a good step that Govt Schools are getting such facilities. Will Appreciate such initiatives.

But world lo first , best lanti words enduku man fekatam. paruvu pogottukovatam ki kaaka pothe. 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

It is a good step that Govt Schools are getting such facilities. Will Appreciate such initiatives.

But world lo first , best lanti words enduku man fekatam. paruvu pogottukovatam ki kaaka pothe. 

Lol

Link to comment
Share on other sites

19 minutes ago, TampaChinnodu said:

ఐఐటీ, అఖిల భారతీయ పోటీని తట్టుకునేందుకు కెరీర్‌ ఫౌండేషన్‌ కోర్సులు ప్రవేశపెట్టడంపై పురపాలక శాఖమంత్రి నారాయణను సీఎం అభినందించారు

@3$%

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఐఐటీ స్థాయి శిక్షణను అందించాలనే సదుద్దేశంతో గత ఏడాది నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడ్వాన్స్‌డ్‌ ఫౌండేషన్‌ కోర్సు(ఏఎఫ్‌సీ) విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గాడి తప్పింది. 28 ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు పరీక్ష నిర్వహించి మరీ వందల మందిలో అత్యంత ప్రతిభ ఉన్న 30 మందిని ఈ కోర్సు కోసం ఎంపిక చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాలనే నెలకొల్పి.. ఏటా రూ.20 లక్షల వరకూ అదనంగా వెచ్చిస్తున్నారు. ఈ పాఠశాలను మంత్రి నారాయణ కలల సాకార కేంద్రంగా అభివర్ణిస్తున్నప్పుడు ఉపాధ్యాయులనూ అలాంటి వారినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. విద్యార్థులను వడపోసి మరీ ఎంపిక చేస్తూ ఉపాధ్యాయులను మాత్రం అధికారులకు నచ్చినట్లు నియమించుకుంటున్నారు. కేవలం గౌరవ వేతనం అదనంగా వస్తుందని కక్కుర్తి పడుతున్నారే తప్ప విద్యార్థుల శ్రేయస్సు పట్టించుకోవడం లేదు. ఏఎఫ్‌సీ కోసం ఎంపిక చేసే ఉపాధ్యాయులకూ ఓ అర్హత ఉండాలి. వీరికీ ఓ పరీక్షను నిర్వహించి ప్రతిభ చూపిన వారికే అవకాశం కల్పించాలి. కానీ.. ఇవేవీ జరగడం లేదు. అసలే నగరపాలక సంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందంటే.. ఏఎఫ్‌సీ ఇనిస్టిట్యూట్‌ కోసం 17 మందిని కేటాయించారు. పొరుగుసేవల సిబ్బందిని తీసుకోమని ఆదేశాలలో సూచించినా ఆ ప్రయత్నం జరగకపోవడం గమనార్హం. అన్నింటి కంటే దారుణమైన విషయం ఏంటంటే ఉపాధ్యాయుల కంటే ప్రధానోపాధ్యాయుడు ఎక్కడైనా అనుభవం ఎక్కువ ఉన్నవారే ఉంటారు. కానీ.. ప్రభుత్వం ఇంత ప్రతిష్ఠాత్మకంగా పెట్టిన ఏఎఫ్‌సీ ఇనిస్టిట్యూట్‌కు ఉన్న ప్రధానోపాధ్యాయుడు దశాబ్దాల సర్వీసు తక్కువ ఉన్నవారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ కేవలం అనుయాయుల కోసం ఈ అవకాశాన్ని దిగ్విజయంగా వినియోగించుకున్నారనేది ఇక్కడే స్పష్టమవుతోంది. విజయవాడలోని గవర్నర్‌పేటలో ఉన్న సీవీఆర్‌ పాఠశాలలో ఏఎఫ్‌సీ ఇనిస్టిట్యూట్‌ను గత ఏడాది నెలకొల్పారు. దీనికోసం నగరంలోని 28 నగరపాలక సంస్థ హైస్కూళ్ల నుంచి ఆరు నుంచి పదో తరగతి వరకూ చదివే పిల్లల్లో బాగా ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేశారు. 30 మంది చొప్పున 150 మంది 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులను ఎంపిక చేసి ఏఎఫ్‌సీకి తరలించారు. ఈ పాఠశాల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ నడుస్తుంది. ఈ పిల్లలు నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారందరినీ సీవీఆర్‌కు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఆటోలు వంటి రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులకు రూ.5 వేలు, ప్రధానోపాధ్యాయుడు(అడ్మినిస్ట్రేటర్‌)కు రూ.10 వేలు, సమన్వయకర్తలకు రూ.10 వేలు గౌరవ వేతనం ప్రకటించారు. ఎలాగూ గౌరవ వేతనం ఉంది కనుక.. ఓ ప్రకటన ఇస్తే చాలు నిరుద్యోగ యువత కుప్పలుతెప్పలుగా వస్తారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లోనే నాలుగైదు వేల జీతానికి బండెడు చాకిరీ మోస్తూ శ్రమించేవాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటిది.. అదికూడా ఎందుకు బయటకు ఇవ్వడం ఎందుకు అనే ధోరణిలో తమకు అనుకూలంగా ఉండే రెగ్యులర్‌ ఉపాధ్యాయులకే కట్టబెట్టారు.

ఉపాధ్యాయుల విషయంలోనే వివక్షే..: గత ఏడాది డీవైఈవో ఆధ్వర్యంలో హడావిడిగా ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి.. అడ్వాన్స్‌డ్‌ ఫౌండేషన్‌ కోర్సు ప్రవేశపెడుతున్నామని, దీనికోసం ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు రావాలంటూ సూచించారు. సీవీఆర్‌ పాఠశాలలో ఈ ఇనిస్టిట్యూట్‌ ఉంటుందని, ఇది ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పెడుతోందని, బాధ్యతగా చేయాలంటూ చెప్పుకొచ్చారు. గౌరవవేతనం ఇస్తారనే అసలు విషయం మాత్రం చెప్పలేదనేది ఉపాధ్యాయులందరి ఫిర్యాదు. దీంతో తమకు అనుకూలంగా ఉండేవారి జాబితాను సిద్ధం చేసి పైకి పంపించేశారు. సాధారణ పాఠశాలలో అయితే వారానికి కనీసం 28-32 తరగతులు చెప్పాల్సి ఉంటుంది. పనిగంటలూ ఎక్కువే. అదే ఏఎఫ్‌సీకి వెళితే తక్కువ పనిగంటలు, తక్కువ తరగతులతో పాటు.. హాయిగా నెలకు అదనంగా గౌరవ వేతనం అందుకునే వీలుంది. ఈ విషయాలేవీ తమకు ముందుగా చెప్పకుండా దాచిపెట్టారని కొందరు ఉపాధ్యాయుల వాదన.

ఏఎఫ్‌సీ పేరుతో.. ఏటా ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.60 వేలు, ప్రధానోపాధ్యాయుడికి రూ.1.20లక్షలు, కోఆర్డినేటర్లకు రూ.1.20లక్షలు ఇచ్చి.. విద్యార్థులకు రవాణా వసతిని ఏర్పాటు చేసి సీవీఆర్‌కు తీసుకొచ్చి, అద్భుతమైన స్టడీ మెటీరియల్‌ను ముద్రించి ఇచ్చి.. శిక్షణ ఇస్తే ఫలితాలు ఏమైనా మారాయా.. అంటే అస్సలు లేదు. ఈ ఏడాది పదో తరగతిలో నగరపాలక సంస్థ పరిధిలో కేవలం నాలుగు 10/10 గ్రేడ్లు మాత్రమే వచ్చాయి. దీనిలో మూడు ఇక్కడ రాగా, ఒకటి బయట నుంచి వచ్చింది. ఈ మూడింటిలోనూ పటమట జీడీఈటీ పాఠశాలకు చెందిన వారే ఇద్దరున్నారు. ఏడాదంతా ప్రత్యేక శిక్షణ ఇచ్చినా వీళ్లేం సాధించారంటే సమాధానం లేదు. ఈ విద్యార్థులంతా అత్యంత ప్రతిభావంతులు కావడంతో అందరికీ 10/10 రావాల్సి ఉంది. పోనీ.. ఉపాధ్యాయ బృందాన్ని ఈఏడాదైనా మర్చారా అంటే అదీ లేదు. మొక్కుబడిగా కేవలం ఒకరిద్దరిని మాత్రమే మార్చారు. ఈసారి మాత్రం తప్పనిసరిగా అందరికీ 10/10 రావాల్సిందే, గౌరవ వేతనం తీసేస్తామని చెబితో ఇప్పుడున్న వారిలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండరని తోటి ఉపాధ్యాయులే అంటున్నారు.

Link to comment
Share on other sites

3 minutes ago, TampaChinnodu said:

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఐఐటీ స్థాయి శిక్షణను అందించాలనే సదుద్దేశంతో గత ఏడాది నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడ్వాన్స్‌డ్‌ ఫౌండేషన్‌ కోర్సు(ఏఎఫ్‌సీ) విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గాడి తప్పింది. 28 ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు పరీక్ష నిర్వహించి మరీ వందల మందిలో అత్యంత ప్రతిభ ఉన్న 30 మందిని ఈ కోర్సు కోసం ఎంపిక చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాలనే నెలకొల్పి.. ఏటా రూ.20 లక్షల వరకూ అదనంగా వెచ్చిస్తున్నారు. ఈ పాఠశాలను మంత్రి నారాయణ కలల సాకార కేంద్రంగా అభివర్ణిస్తున్నప్పుడు ఉపాధ్యాయులనూ అలాంటి వారినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. విద్యార్థులను వడపోసి మరీ ఎంపిక చేస్తూ ఉపాధ్యాయులను మాత్రం అధికారులకు నచ్చినట్లు నియమించుకుంటున్నారు. కేవలం గౌరవ వేతనం అదనంగా వస్తుందని కక్కుర్తి పడుతున్నారే తప్ప విద్యార్థుల శ్రేయస్సు పట్టించుకోవడం లేదు. ఏఎఫ్‌సీ కోసం ఎంపిక చేసే ఉపాధ్యాయులకూ ఓ అర్హత ఉండాలి. వీరికీ ఓ పరీక్షను నిర్వహించి ప్రతిభ చూపిన వారికే అవకాశం కల్పించాలి. కానీ.. ఇవేవీ జరగడం లేదు. అసలే నగరపాలక సంస్థ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందంటే.. ఏఎఫ్‌సీ ఇనిస్టిట్యూట్‌ కోసం 17 మందిని కేటాయించారు. పొరుగుసేవల సిబ్బందిని తీసుకోమని ఆదేశాలలో సూచించినా ఆ ప్రయత్నం జరగకపోవడం గమనార్హం. అన్నింటి కంటే దారుణమైన విషయం ఏంటంటే ఉపాధ్యాయుల కంటే ప్రధానోపాధ్యాయుడు ఎక్కడైనా అనుభవం ఎక్కువ ఉన్నవారే ఉంటారు. కానీ.. ప్రభుత్వం ఇంత ప్రతిష్ఠాత్మకంగా పెట్టిన ఏఎఫ్‌సీ ఇనిస్టిట్యూట్‌కు ఉన్న ప్రధానోపాధ్యాయుడు దశాబ్దాల సర్వీసు తక్కువ ఉన్నవారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ కేవలం అనుయాయుల కోసం ఈ అవకాశాన్ని దిగ్విజయంగా వినియోగించుకున్నారనేది ఇక్కడే స్పష్టమవుతోంది. విజయవాడలోని గవర్నర్‌పేటలో ఉన్న సీవీఆర్‌ పాఠశాలలో ఏఎఫ్‌సీ ఇనిస్టిట్యూట్‌ను గత ఏడాది నెలకొల్పారు. దీనికోసం నగరంలోని 28 నగరపాలక సంస్థ హైస్కూళ్ల నుంచి ఆరు నుంచి పదో తరగతి వరకూ చదివే పిల్లల్లో బాగా ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేశారు. 30 మంది చొప్పున 150 మంది 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులను ఎంపిక చేసి ఏఎఫ్‌సీకి తరలించారు. ఈ పాఠశాల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ నడుస్తుంది. ఈ పిల్లలు నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారందరినీ సీవీఆర్‌కు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఆటోలు వంటి రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులకు రూ.5 వేలు, ప్రధానోపాధ్యాయుడు(అడ్మినిస్ట్రేటర్‌)కు రూ.10 వేలు, సమన్వయకర్తలకు రూ.10 వేలు గౌరవ వేతనం ప్రకటించారు. ఎలాగూ గౌరవ వేతనం ఉంది కనుక.. ఓ ప్రకటన ఇస్తే చాలు నిరుద్యోగ యువత కుప్పలుతెప్పలుగా వస్తారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లోనే నాలుగైదు వేల జీతానికి బండెడు చాకిరీ మోస్తూ శ్రమించేవాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటిది.. అదికూడా ఎందుకు బయటకు ఇవ్వడం ఎందుకు అనే ధోరణిలో తమకు అనుకూలంగా ఉండే రెగ్యులర్‌ ఉపాధ్యాయులకే కట్టబెట్టారు.

ఉపాధ్యాయుల విషయంలోనే వివక్షే..: గత ఏడాది డీవైఈవో ఆధ్వర్యంలో హడావిడిగా ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి.. అడ్వాన్స్‌డ్‌ ఫౌండేషన్‌ కోర్సు ప్రవేశపెడుతున్నామని, దీనికోసం ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు రావాలంటూ సూచించారు. సీవీఆర్‌ పాఠశాలలో ఈ ఇనిస్టిట్యూట్‌ ఉంటుందని, ఇది ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పెడుతోందని, బాధ్యతగా చేయాలంటూ చెప్పుకొచ్చారు. గౌరవవేతనం ఇస్తారనే అసలు విషయం మాత్రం చెప్పలేదనేది ఉపాధ్యాయులందరి ఫిర్యాదు. దీంతో తమకు అనుకూలంగా ఉండేవారి జాబితాను సిద్ధం చేసి పైకి పంపించేశారు. సాధారణ పాఠశాలలో అయితే వారానికి కనీసం 28-32 తరగతులు చెప్పాల్సి ఉంటుంది. పనిగంటలూ ఎక్కువే. అదే ఏఎఫ్‌సీకి వెళితే తక్కువ పనిగంటలు, తక్కువ తరగతులతో పాటు.. హాయిగా నెలకు అదనంగా గౌరవ వేతనం అందుకునే వీలుంది. ఈ విషయాలేవీ తమకు ముందుగా చెప్పకుండా దాచిపెట్టారని కొందరు ఉపాధ్యాయుల వాదన.

ఏఎఫ్‌సీ పేరుతో.. ఏటా ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.60 వేలు, ప్రధానోపాధ్యాయుడికి రూ.1.20లక్షలు, కోఆర్డినేటర్లకు రూ.1.20లక్షలు ఇచ్చి.. విద్యార్థులకు రవాణా వసతిని ఏర్పాటు చేసి సీవీఆర్‌కు తీసుకొచ్చి, అద్భుతమైన స్టడీ మెటీరియల్‌ను ముద్రించి ఇచ్చి.. శిక్షణ ఇస్తే ఫలితాలు ఏమైనా మారాయా.. అంటే అస్సలు లేదు. ఈ ఏడాది పదో తరగతిలో నగరపాలక సంస్థ పరిధిలో కేవలం నాలుగు 10/10 గ్రేడ్లు మాత్రమే వచ్చాయి. దీనిలో మూడు ఇక్కడ రాగా, ఒకటి బయట నుంచి వచ్చింది. ఈ మూడింటిలోనూ పటమట జీడీఈటీ పాఠశాలకు చెందిన వారే ఇద్దరున్నారు. ఏడాదంతా ప్రత్యేక శిక్షణ ఇచ్చినా వీళ్లేం సాధించారంటే సమాధానం లేదు. ఈ విద్యార్థులంతా అత్యంత ప్రతిభావంతులు కావడంతో అందరికీ 10/10 రావాల్సి ఉంది. పోనీ.. ఉపాధ్యాయ బృందాన్ని ఈఏడాదైనా మర్చారా అంటే అదీ లేదు. మొక్కుబడిగా కేవలం ఒకరిద్దరిని మాత్రమే మార్చారు. ఈసారి మాత్రం తప్పనిసరిగా అందరికీ 10/10 రావాల్సిందే, గౌరవ వేతనం తీసేస్తామని చెబితో ఇప్పుడున్న వారిలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండరని తోటి ఉపాధ్యాయులే అంటున్నారు.

Which news is true?

oo pakka world no.1, first of its kind antunnadu Sandra babu..

ee news emo AFC lost the track ani undhi...

Link to comment
Share on other sites

Just now, reality said:

Which news is true?

oo pakka world no.1, first of its kind antunnadu Sandra babu..

ee news emo AFC lost the track ani undhi...

Rendu news from eenadu paper.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...