Jump to content

ఏపీలో ఎంవోయూలు ఫుల్.. ప్రాజెక్టులు నిల్


TampaChinnodu

Recommended Posts

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2016, 17లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో దేశ విదేశాలకు చెందిన వివిధ సంస్థలతో 996 ఒప్పందాలు(ఎంవోయూ) చేసుకుందని, మొత్తం రూ.15,33,219కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 1,629 ప్రాజెక్టులు నెలకొల్పడానికి  ఒప్పందాలు జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వైఎస్‌ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ సమాధానం ఇచ్చారు.

2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో మొత్తం రూ.4,78,788 కోట్ల పెట్టుబడులతో 331 ఎంవోయూలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని, వీటిలో రూ.2,83,943 కోట్ల పెట్టుబడుల అంచనాతో కుదుర్చుకున్న 99 ఎంవోయూలకు సంబంధించి ఆయా సంస్థలు ఇప్పటి వరకు డీపీఆర్‌లు సమర్పించలేదని పేర్కొన్నారు. అలాగే, రూ.31,000కోట్ల పెట్టుబడుల అంచనాలతో కుదుర్చుకున్న 6 ఎంవోయూలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో వాటిని వదులుకోవాల్సి వచ్చిందన్నారు. 2017 భాగస్వామ్య సదస్సులో మొత్తం రూ.10,54,431కోట్ల పెట్టుబడుల అంచనాలతో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం 665 ఎంవోయూలను కుదుర్చుకుందన్నారు. అయితే, వీటిలో 6,33,892కోట్ల పెట్టుబడులతో కుదుర్చుకున్న 335 ఎంవోయూలకు సంబంధించి ఆయా సంస్థలు ఇంకా డీపీఆర్‌లు సమర్పించలేదన్నారు. రూ.1,75,000 కోట్లు రూపాయలు పెట్టుబడులు అంచనాతో కుదుర్చుకున్న 12 ఎంవోయూల విషయంలో ఆయా సంస్థలతో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వాటిని రద్దయినట్లు చెప్పారు.

Link to comment
Share on other sites

MOU la sangathi anthe ga maaan.. ee investment summit lo aina mou lo 1% aina ekkuve.. just edho publicity kosam panikosthai.. ye state lo aina anthe 

Link to comment
Share on other sites

1 minute ago, johnubhai_01 said:

already yagam modalayindi. inka opposition ki band bhaja nee

 

Jagan-temple-31.jpg?itok=bAzyBWn2 jai jalagannaa.... bl@st 

పోలీస్ అధికార్లకు తాసిల్దార్లకు అమ్మాయిలూ తార్చి
జైల్లో వున్న హంతకుల పేర్లు చెప్పి 
దందాలు చేసానని నవ్వుతూ చెబుతున్న భానుని

ఆడికి దోస్తైన మంగలి కృష్ణని 
సాధారణ అనుమానిత హంతకులను 
విచారించినట్టు పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి విచారిస్తే

గనుల దోపిడీకి అడ్డైన వారిని ఎలా అంతం చేసారో 
వీళ్ళు ఎవరి ఆదేశాలతో పనిచేసారు 
ఆళ్ళ అబ్బా తాతల వరకు గుట్టు విప్పరూ

గుట్టలు గుట్టలుగా పాతుకు పోతున్న 
విగ్రహాల పీడా విరగడ అవదూ
ఎన్నో శుభ కార్యాలకు బయలు దేరే 
జనం హంతక నేతల విగ్రహాల ను 
చూస్తూ వెళ్ళే దరిద్రం తప్పదూ

జనాలను ఉద్దరిస్తామని పులికి మళ్లే స్వర్ణ కంకణాలు కట్టుక బయలుదేరిన 
వాళ్లకు బేడీలు పడవూ?

పాలకుల ముసుగులో దోపిడీలు చేసి 
తిన్నది అరక్క ఇంకా కావాలని బరితెగిస్తున్న 
కూనీకోరుల నాయకత్వానికి ఈ రోజు ఓ కులం మతం ఉత్సాహపడితే 
రేపు ఇంకో కులం మతం 
ఏకంగా టెర్రరిస్ట్ లను తెరమీదకు తేదూ

ఏం ఆ కులాలలో మతాలలో 
మంచోళ్ళు గొడ్డుబోయారా?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...