Jump to content

సైబరాబాద్లో ‘థాయ్ మసాజ్’!


TampaChinnodu

Recommended Posts

సైబరాబాద్‌లో ‘థాయ్‌ మసాజ్‌’!
 
- వ్యవస్థీకృతంగా సాగుతున్న స్పా దందా
ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు  
34 మంది థాయ్‌ మహిళల రెస్క్యూ  
సూత్రధారి సిద్ధార్థ్‌ సహా 19 మంది అరెస్టు  
 
సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌లోని ఐటీ సెక్టార్‌లో హైటెక్‌ వ్యభిచార దందా జోరుగా సాగుతోంది. స్పా, మసాజ్‌ సెంటర్‌ ముసుగులో నిర్వాహకులు వ్యవస్థీకృతంగా ఈ వ్యవహారాలు నడుపుతున్నారు. దీనికోసం థాయ్‌లాండ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతుల్ని అక్రమ రవాణా చేస్తున్నారు. సమాచారం అందు కున్న సైబరాబాద్‌ పోలీసులు ఆదివారం వరుస దాడులు చేశారు. మాదాపూర్, రాయదుర్గం, గచ్చి బౌలి ఠాణాల పరిధిలో ఉన్న 12 స్పా, మసాజ్‌ సెంటర్లపై ఈ దాడులు జరిగినట్లు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. 34 మంది థాయ్, 21 మంది ఈశాన్య రాష్ట్రాలు, ఒక పంజాబ్‌ నగరానికి చెందిన 9 మందితో కలిపి మొత్తం 65 మంది యువతులను రెస్క్యూ చేశామన్నారు.  
 
నిబంధనలకు విరుద్ధంగా...  
ఒక్కో స్పాలో అనేక మందికి సభ్యత్వాలు ఇస్తున్న సిద్ధార్థ్‌.. వారి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నాడు. ఒక్కో సంస్థలో 300 నుంచి 500 మం ది సభ్యులుగా ఉన్నారు. వీరికి గోల్డ్, సిల్వర్, రెగ్యులర్‌ పేర్లతో గుర్తింపు కార్డులూ జారీ చేస్తున్నాడు. స్పా, మసాజ్‌ సెంటర్లలో ఉండే గదుల్లోని ప్రాంతా లు పారదర్శకంగా ఉండాలి. పురుష కస్టమర్లకు మహిళలతో మసాజ్‌లు చేయించాలన్నా.. కొన్ని నిబంధనలు పాటించాలి. అయితే ఈ స్పాల్లో ఇవి పట్టించుకోవట్లేదు. సెంటర్లకు వెనుక వైపు కొన్ని రహస్య గదులూ ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రత్యేక టీమ్‌ల సాయంతో ఏకకాలంలో దాడులు చేయడంతో ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సిద్ధార్థ్‌తో పాటు మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. ఆయా స్పాలను సీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిని బంజారాహిల్స్‌లోని ఓ ఫ్లాట్‌లో పర్యవేక్షణలో ఉంచారు.  
 
థాయ్‌ యువతులకు గాలం...  
ఐటీ జోన్‌లోని మూడు ఠాణాల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 స్పా, మసాజ్‌ సెంటర్లను బంజారాహిల్స్‌కి చెందిన ట్రైపాడ్‌ వెర్నస్‌ అండ్‌ హీలింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ యజమాని దాసరి సిద్ధార్థ్‌ నిర్వహిస్తున్నాడు. ఇతడికి కొన్నాళ్ల క్రితం ముంబైలో థాయ్‌లాండ్‌ మహిళ కకేతో పరిచయమైంది. ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్న సిద్ధార్థ్‌ ఆ దేశం నుంచి యువతుల్ని అక్రమ రవాణా చేయిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న మసాజ్‌ సెంటర్లలో ఉద్యోగాలంటూ థాయ్‌ యువతులకు కకే గాలం వేస్తోంది. ఆపై వ్యాపార, విజిట్‌ వీసాలపై వారిని పంపిస్తోంది.  
 
నెలకు రూ.90 లక్షలు
ఇలా ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చే థాయ్‌లాండ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరానికి చెందిన యువతుల్ని సిద్ధార్థ్‌ వివిధ ప్రాంతాల్లో ఉంచుతు న్నాడు. ప్రాథమికంగా విదేశీయుల నుంచి పాస్‌పోర్టులు తీసుకుని తమ ఆధీనంలో ఉంచుకుంటున్నాడు. ఆపై తాను నిర్వహించే స్పా, మసా జ్‌ సెంటర్లకు వీరిని తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇతడికి మాదాపూర్, బంజారాహిల్స్, బెంగళూరుల్లోనూ స్పాలున్నాయి. సిద్ధార్థ్‌కు సర్ఫరోజ్‌ అలీ, వినయ్, అజయ్‌ సహకరిస్తున్నారు. వెంకటరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం ప్రధాన భాగస్వాములు. ఈ దందా లో సిద్ధార్థ్‌ ప్రతి నెలా రూ.90 లక్షల వరకు సం పాదిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సిద్ధార్థ్‌ ముంబై చింబూరులోనూ ఇలాంటి దందానే నిర్వహించాడు. అక్కడి పోలీసులు గత ఏడాది ఇతడితో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో సిటీకి చెందిన తోట విజయ్‌కుమార్‌ వాంటెడ్‌గా ఉన్నాడు.  
 
దాడులు చేసింది ఈ సెంటర్లపైనే...  
గచ్చిబౌలిలోని సప్తా, తంత్ర, వీ, మందర, మోహ్, ఔరా స్పాలు. మాదాపూర్‌లోని ఔరా, సప్తా, తంత్ర, బ్లిజ్, మోహ్, న్యూ రివైవ్‌ స్పాలు.  
 
ఈ కోణాల్లో దర్యాప్తు
ఆన్‌లైన్‌ బుకింగ్స్, నగదు లావాదేవీలు, నిందితుల బ్యాంక్‌ ఖాతాల వివరాలు. 

స్వాధీనం చేసుకుంది
ల్యాప్‌టాప్‌/కంప్యూటర్లు 10, రూ.3.38 లక్షల నగదు, 28 సెల్‌ఫోన్లు, 11 స్వైపింగ్‌ మిషన్లు, బిల్‌ బుక్స్‌ 27, డీవీఆర్‌లు 10తో పాటు భారీగా కండోమ్స్‌.  
 
Link to comment
Share on other sites

ఈ దందా లో సిద్ధార్థ్‌ ప్రతి నెలా రూ.90 లక్షల వరకు సం పాదిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

bl@st

Link to comment
Share on other sites

థాయ్‌.. జాయ్‌ 
హైదరాబాద్‌లో మసాజ్‌ ముసుగులో వ్యభిచారం 
స్పాలలో అసాంఘిక కార్యకలాపాల గుట్టురట్టు 
12 చోట్ల దాడులు, 65 మంది మహిళల గుర్తింపు 
34 మంది థాయ్‌లాండ్‌ యువతులు 
ఉద్యోగాల ఆశ చూపి రప్పించినట్టు దర్యాప్తులో వెల్లడి 
శాశ్వత సభ్యత్వానికి రూ.లక్ష 
300-500 మంది వరకు సభ్యులు 
19 మంది నిర్వాహకుల అరెస్టు 
ఈనాడు - హైదరాబాద్‌ 
20hyd-main1a.jpg

డ్రగ్స్‌ కలకలం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న హైదరాబాద్‌కు మరో కుదుపు.. స్పాల పేరుతో.. మర్దన మాటున సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు బహిర్గతమయ్యాయి. పలు స్పాలలో థాయ్‌ మసాజ్‌ ముసుగులో వ్యభిచారం జరుగుతోందంటూ సైబరాబాద్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్యకు అందిన ఫిర్యాదుల మేరకు మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం ఠాణాల పరిధిలో సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి శనివారం రాత్రి 12 స్పాలలో దాడులు నిర్వహించారు. థాయ్‌లాండ్‌తో పాటు పంజాబ్‌, హైదరాబాద్‌, ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతుల్ని ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. విదేశీ యువతుల్ని పర్యాటక వీసాపై తీసుకొచ్చి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. ఆయా స్పాలలో పారదర్శకంగా కనిపించేలా గ్లాస్‌, సీసీ టీవీలు, వినియోగదారుల రిజిస్టర్లు లేకపోవడంతోపాటు మసాజ్‌ టేబుల్స్‌కు బదులుగా పడకలను ఏర్పాటుచేయడాన్ని దాడుల సందర్భంగా గుర్తించారు. భవిష్యత్తులో తిరిగి వ్యభిచారం కొనసాగించకుండా ఉండేందుకు ఆయా స్పాలను సీజ్‌ చేయించాలని నిర్ణయించారు. మొత్తం 65 మంది యువతుల్ని రెస్క్యూ హోంకు తరలించిన పోలీసులు 19 మంది నిర్వాహకుల్ని అరెస్టు చేశారు. బాధితురాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డిపోట్‌ చేయాలని నిర్ణయించారు. ఆయా స్పాల నుంచి రూ.3.38 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు, స్వైపింగ్‌ యంత్రాలు, వినియోగించిన కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ముంబయిలో మసాజ్‌.. ఇక్కడ ఏర్పాటు: ఈ వ్యభిచార ముఠాకు నగరానికే చెందిన దాసరి సిద్ధార్థ్‌ నాయకుడని పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్‌ నందగిరి హల్స్‌లోని ఆదిత్య మౌంట్‌ క్యాసిల్‌లో ఉంటున్న సిద్ధార్థ్‌..2013 నుంచి ఈ దందా సాగిస్తున్నట్లు తేల్చారు. నగరంలో పేరుగాంచిన ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసిన ఇతను..ఐర్లాండ్‌లో ఎంటెక్‌ చదివాడు. ముంబయిలో మసాజ్‌ కోసం స్పాకు వెళ్లిన అనుభవంతో..వాటిని ఇక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. స్పాలలో వ్యభిచారం చేయిస్తే భారీగా లాభాలొస్తాయని భావించి..తొలుత ముంబయి, తమిళనాడు చెంబూరులలో స్పాలను లీజుకు తీసుకున్నాడు. అక్కడ నష్టం రావడంతోపాటు..గత ఏడాది చెంబూరు పోలీసులు ఈ అక్రమ వ్యాపారాన్ని గుర్తించి సిద్ధార్థ్‌ను అరెస్ట్‌ చేశారు.

థాయ్‌ మహిళ పరిచయంతో కొత్త పుంతలు: ఈ క్రమంలో ముంబయిలో థాయ్‌లాండ్‌కు చెందిన మహిళ ‘కాకే’తో పరిచయమైంది. థాయ్‌ మహిళలతో మసాజ్‌ చేయిస్తే వినియోగదారులను సులభంగా ఆకర్షించవచ్చన్న ఆమె ఆలోచనను అమలు చేయాలన్న నిర్ణయానికొచ్చాడు. ఈ ముసుగులో వ్యభిచార దందా నడిపేందుకు సిద్ధమయ్యాడు. అనుకున్న ప్రకారం కాకే ఉద్యోగాలు ఆశచూపి థాయ్‌లాండ్‌ నుంచి యువతుల్ని ఇక్కడికి పంపడంతో.. ఈసారి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మూడు, జూబ్లీహిల్స్‌లో నాలుగు, బెంగళూరులో ఒకటి చొప్పున స్పాలను ప్రారంభించాడు. ‘థాయ్‌ యువతులకు బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో వసతి కల్పించడంతోపాటు..నెలకు రూ.25వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నట్టు, వారి వీసాలను లాక్కోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు ఈ అక్రమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్టు’ పోలీసులు గుర్తించారు. తన అక్రమ వ్యాపారానికి సహకరించేందుకు సర్ఫరాజ్‌ అలీ, వినయ్‌, అజయ్‌లతో సిద్ధార్థ్‌ ముఠా ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ‘ఈ దందాలో ఇతడు నెలకు సుమారు రూ.90 లక్షలు ఆర్జిస్తున్నాడని పోలీసులు తెలపడం’ అతని వ్యాపారం మూడు స్పాలు..ఆరు వ్యభిచారాలు అన్నట్టు సాగుతోందనేందుకు నిదర్శనం.

గోల్డ్‌.. సిల్వర్‌.. రెగ్యులర్‌: వినియోగదారుల్ని ఆకర్షించేందుకు సిద్ధార్థ్‌ ముఠా తన స్పాలలో పలు పథకాల్ని ప్రవేశపెట్టింది. ఇతడి స్పాలలో సభ్యులుగా ఉన్న 300-500 మంది వినియోగదారుల కోసం గోల్డ్‌, సిల్వర్‌, రెగ్యులర్‌ పేరిట కార్డులను జారీ చేశారు. రూ.లక్ష చెల్లిస్తే శాశ్వత సభ్యత్వం ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయి.

రహస్యంగా దాడులు...పక్కాగా సాక్ష్యాల సేకరణ 
స్పాలలో దాడుల సందర్భంగా పోలీస్‌ బృందాలు పక్కాగా సాక్ష్యాలను సేకరించాయి. సాధారణంగా స్పాలలో నిబంధనల ప్రకారం అందించే సేవలకు గాను గరిష్ఠంగా రూ.6 వేల వరకే ప్యాకేజీ ఉండగా..చాలా మంది నుంచి రూ.9 వేలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఆ లావాదేవీలను, వినియోగించిన పలు కండోమ్‌లు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలను ఆధారాలుగా సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ గుర్తించిన పలు అంశాలను వీడియోలో నిక్షిప్తం చేశారు. మరోవైపు స్థానిక పోలీసులకు చివరి వరకు ఈ దాడుల గురించి తెలియనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. జోన్‌ ఎస్‌వోటీ పోలీసులకూ సమాచారం లేకుండానే జోన్‌లోని ఇతర బృందాల్ని రంగంలోకి దించారు.

దాడులు నిర్వహించిన స్పాలు ఇవే.. 
* గచ్చిబౌలి ఠాణా: సప్త(సూరజ్‌ టవర్స్‌), తంత్ర(గచ్చిబౌలి ఫ్లైఓవర్‌), అవురా(కొత్తగూడ రోడ్‌), మోహ్‌(హిమగిరి హాస్పిటల్‌ ఎదుట), మంధర(కేఎస్‌ బేకర్స్‌ పక్కన), వి(ఐసీఐసీఐ బ్యాంకుపైన)

* మాదాపూర్‌ ఠాణా: సప్త(హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పైన), అవురా(సైబర్‌ టవర్స్‌ రోడ్‌), తంత్ర(డిమార్ట్‌ ఎదురు), బ్లిజ్‌(లక్మే సెలూన్‌ పక్కన), మోహ్‌(ఇమేజ్‌ గార్డెన్స్‌ పక్కన), న్యూ రివైవ్‌(డిమార్ట్‌ పక్కన)

Link to comment
Share on other sites

4 minutes ago, Batman_fan said:

em ardam ayindi

entakaina tegiste dabbulu sampadinchadam kukkani kotinanta easy ani

last year vere state lo arrest kooda ayyadu anta, ina kooda intha range lo business nadipaadu. India lo law vundi waste man. even now after this he will come out and continue business. 

Link to comment
Share on other sites

29 minutes ago, TampaChinnodu said:

ఈ దందా లో సిద్ధార్థ్‌ ప్రతి నెలా రూ.90 లక్షల వరకు సం పాదిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

bl@st

E month maamuullu andhaledemo :o

Link to comment
Share on other sites

6 minutes ago, perugu_vada said:

E month maamuullu andhaledemo :o

raid sesindi different zone cops anta. good plan.

మరోవైపు స్థానిక పోలీసులకు చివరి వరకు ఈ దాడుల గురించి తెలియనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. జోన్‌ ఎస్‌వోటీ పోలీసులకూ సమాచారం లేకుండానే జోన్‌లోని ఇతర బృందాల్ని రంగంలోకి దించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...