Jump to content

రెండు నిమిషాల్లో జాతకం గుట్టురట్టు


BaabuBangaram

Recommended Posts

భివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక ఆటోమేటేడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ (ఏఎఫ్‌పీఐఎస్‌) సాంకేతిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పరిధిలోని వేలిముద్రల విభాగం సమకూర్చుకుంది. ఇటీవల వరకూ వినియోగించిన ఫింగర్‌ ప్రింట్‌ ఆటోమేటిక్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ (ఎఫ్‌ఏసీటీఎస్‌) సాంకేతిక విధానం స్థానంలో ఇప్పుడు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ సాంకేతికత దేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసు విభాగాల వద్ద మాత్రమే అందుబాటులో ఉంది. ఈ తాజా విధానంలో నిమిషాల సమయంలో వేలిముద్రలను సరిపోల్చి ఫలితం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఏపీ వేలిముద్రల విభాగం ఈ విధానాన్ని గత రెండు నెలలుగా వినియోగిస్తోంది. ఈ కాలవ్యవధిలో కొన్నేళ్లుగా పరిష్కారం కానీ 1130 కేసులకు సంబంధించిన వేలిముద్రలు ఏ నిందితులవో గుర్తించగలిగారు. తద్వారా ఆ కేసులను ఛేదించగలిగారు. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూ. 10 కోట్లు వెచ్చించి సమకూర్చారు.

10ap-main2b.jpg

అయిదేళ్ల కిందట హత్య కేసు... 
ఇప్పుడు ఛేదించారు 
విజయవాడ అయ్యప్పనగర్‌ పండరీపురంలో అయిదేళ్ల కిందట వేమూరి చంద్రమ్మ (75) అనే వృద్ధురాలు హత్యకు గురయ్యారు. ఆమెను ఎవరో గొంతు నులిమి చంపేశారని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి సేకరించిన వేలిముద్రలను సమాచార నిక్షిప్త నిధిలో ఉన్న నేరగాళ్ల వేలిముద్రలతో సరిపోల్చేందుకు అప్పట్లో అందుబాటులో ఉన్న ఫింగర్‌ ప్రింట్‌ ఆటోమేటిక్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సాంకేతిక విధానంలో ప్రయత్నిస్తే ఫలితం రాలేదు. దీంతో కేసును ఛేదించలేకపోయారు. మూడు నెలల కిందట కొత్తగా సమకూర్చుకున్న ఆటోమేటేడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సాంకేతిక విధానంలో అప్పట్లో సేకరించిన వేలిముద్రలను సరిపోల్చగా...అవి ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన మొవ్వ వెంకటేశ్వరరావు (38)గా తేలాయి. అది కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే. ఆ సమాచారంతో వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించి హత్యకు పాల్పడిన ఘటనలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని అతనితో పాటు షేక్‌ మస్తాన్‌వలీ, సయ్యద్‌ గౌస్‌ను మొన్న సెప్టెంబరు నెలలో అరెస్టు చేశారు.

10ap-main2c.jpg

అస్పష్టత వేలిముద్రలున్నా.. 
నిందితుడ్ని గుర్తించారు 
విశాఖపట్నం పాండురంగాపురంలోని వర్షా అపార్ట్‌మెంట్స్‌లోని నాలుగో అంతస్తులోని ఓ ఫ్లాటులో మూడు నెలల కిందట ఓ భారీ చోరీ జరిగింది. రూ.50 లక్షల విలువైన సొత్తు దోచుకెళ్లారు. వేలిముద్రల విభాగం అధికారులు ఘటనా స్థలంలో పరిశీలిస్తే ఎలాంటి వేలిముద్రలు లభించలేదు. నిందితులు పక్కా ప్రణాళికతో చేతులకు గ్లౌజు తొడుక్కొని నేరానికి పాల్పడటంతో వాటి ఆధారాలు లభించలేదు. లోతుగా పరిశీలిస్తే అపార్ట్‌మెంటు గోడకు ఆనుకుని నిలువుగా వేసిన

డ్రైనేజీ పీవీసీ పైపును పట్టుకుని పైకి ఎక్కి నిందితులు ఫ్లాటులోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఆ పైపును పరిశీలిస్తే అస్పష్టతతో ఉన్న వేలిముద్రలు లభించాయి. వాటిని తమ వద్దనున్న సమాచార నిక్షిప్త నిధితో ఫింగర్‌ ప్రింట్‌ ఆటోమేటిక్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ సాంకేతిక విధానంలో సరిపోలిస్తే అవి పోకతోట గంగాధరరావు అనే పాత నిందితుడే ఆ పనిచేసినట్లు తేలింది. దీంతో పోలీసులు గంటల వ్యవధిలోనే కేసు ఛేదించగలిగారు.

10ap-main2d.jpg

10ap-main2e.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...