Jump to content

తేలికపాటి మెట్రోకు నివేదిక! నేడు విజయవాడకు ప్రతినిధుల రాక


Paidithalli

Recommended Posts

amr-top2a.jpg

విజయవాడలో నిర్మించనున్న మెట్రో ప్రాజెక్టుపై మరో అడుగు ముందుకుపడింది. తేలికపాటి మెట్రో సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారు చేసేందుకు రంగం సిద్ధమైంది. మరో నాలుగు నెలల్లో డీపీఆర్‌ అందనుంది. అనంతరం మెట్రో నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తేలికపాటి మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌ తయారు చేసేందుకు ఫ్రాన్సుకు చెందిన సిస్ట్రా సంస్థ ప్రతినిధులు బుధవారం విజయవాడకు రానున్నారు. దశలవారీగా సిస్ట్రా సంస్థ తమ ఉద్యోగులను విజయవాడకు తరలించనుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నగరానికి తేలికపాటి మెట్రో డీపీఆర్‌ తయారు చేసేందుకు ఫ్రాన్సుకు చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్‌ సంస్థతో కలిసి ఒప్పందం దక్కించుకుంది. దీనికి నాలుగు నెలల కిందటే టెండర్లను పిలిచినా ఒప్పందం చేసుకోవడంలో జాప్యం జరిగింది. ఇటీవల ఒప్పందం చేసుకోవడంతో డీపీఆర్‌ తయారీకి రంగం సిద్ధం చేసుకున్నారు. భారత్‌, ఫ్రాన్సు, జర్మనీలో ఆ సంస్థల ఉద్యోగులు సంయుక్తంగా కలిసి రూపొందిస్తారని మెట్రో అధికారులు చెబుతున్నారు. సిస్ట్రా సంస్థ రాకతో మళ్లీ మెట్రో ప్రాజెక్టులో కదలిక వచ్చినట్లయిందంటున్నారు. విశాఖ మెట్రోకు అయిదు సంస్థలు టెండర్లను దాఖలు చేశాయి. త్వరలో దీనికి సంస్థను ఎంపిక చేసి ఒప్పందం చేసుకోనున్నారు. విశాఖ మెట్రో కంటే ముందే ప్రారంభం కావాల్సిన విజయవాడ మెట్రో పలు మలుపులు తిరుగుతోంది.

నివేదిక తర్వాతే నిర్ణయం..! 
విజయవాడ జనాభా తక్కువగా ఉండటం, రవాణా రద్దీ లేకపోవడం ప్రధాన ఆటంకంగా చెబుతున్నారు. అమరావతి నగరానికి మెట్రో ప్రాజెక్టు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఉంది. భవిష్యత్తులో రాజధాని నగరంగా పెరిగి ప్రపంచంలోనే మేటిగా రూపుదిద్దాలనే సంకల్పం తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరానికి లైట్‌ మెట్రో డీపీఆర్‌ తయారు చేసిన తర్వాత పీపీపీ పద్ధతిలో సంస్థలు ముందుకు వస్తే నిర్మాణం చేపట్టే అవకాశం ఉందంటున్నారు. కొంత ప్రభుత్వం నిధులు భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అసలు మెట్రో కథ కంచికి చేరి.. తేలికపాటి మెట్రో తెరమీదకు వచ్చిన తర్వాతే నగరప్రజల్లో దీనిపై అనుమానాలు పెరిగాయి. కేంద్ర బడ్జెట్‌లో విజయవాడ మెట్రో ఊసే లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడినట్లయింది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న లైట్‌ మెట్రోలో బందరు కారిడార్‌ పెనమలూరు వరకు ఉంటుంది. ఏలూరు రోడ్డులో కారిడార్‌ నిడమానూరుకు బదులుగా గన్నవరం వరకు పొడగించనున్నారు. మరో కారిడార్‌ పీఎన్‌బీ నుంచి జక్కంపూడి వరకు వెళ్లనుంది.  నాలుగో కారిడార్‌ కృష్ణా కాలువ జంక్షన్‌ వరకు గుంటూరు జిల్లాలో నిర్మాణం చేయనున్నారు. దాదాపు నాలుగు కారిడార్లు 42 కిలోమీటర్లు వరకు ఉంటుంది.

సిస్ట్రా-రైట్స్‌ సంస్థకు డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతలను జర్మనీలో కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ అప్పగించదని మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. దశలవారీగా సంస్థ ప్రతినిధులు విజయవాడకు రానున్నారని, ఫ్రాన్సు, జర్మనీలోనూ ఆ సంస్థ ఉద్యోగులు ఉంటారని తెలిపారు. నాలుగు నెలల్లో నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...