Jump to content

లైట్‌ మెట్రోపై మరోసారి అధ్యయనం


TampaChinnodu

Recommended Posts

లైట్‌ మెట్రోపై మరోసారి అధ్యయనం 
జర్మనీ, ఫ్రాన్సులకు ఉన్నత స్థాయి బృందం 
మే 14 నుంచి మూడు రోజుల టూర్‌ 
ఈనాడు, అమరావతి 
amr-brk1a.jpg

నవ్యాంధ్ర రాజధానిగా గుర్తింపు పొందిన విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి మరో అడుగు ముందుకు పడింది. విజయవాడ నగరంలో నిర్మాణం చేపట్టే తేలికపాటి మెట్రో ప్రాజెక్టుపై మరోసారి అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి బృందం విదేశాలకు వెళ్లనుంది. విజయవాడ నగరంలో నిర్మించే తేలికపాటి మెట్రోకు జర్మనీకి చెందిన సిస్ట్రా భారత్‌కు చెందిన రైట్స్‌ సంస్థతో కలిసి సవివరణ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో పూర్తి స్థాయి డీపీఆర్‌ అందనుంది. దీనిలో భాగంగా తేలికపాటి మెట్రోపై అధ్యయనం కోసం మరో బృందం జర్మనీ, ఫ్రాన్సు దేశాలకు వెళ్లనుంది.

అధ్యయనం తరువాత.. గతంలో మెట్రోకు ప్రత్యామ్నాయంపై అధ్యయనం కోసం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో చైనా, మలేషియా తదితర ప్రాంతాలను పరిశీలించి వచ్చారు. మెట్రో ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా తేలికపాటి మెట్రో నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఎలివేటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్సులను, మాగ్లేవ్‌ ట్రైన్‌లను పరిశీలించారు. విజయవాడ నగరానికి తేలికపాటి మెట్రో సరిపోతుందని నిర్ణయానికి వచ్చి దీనిపై ప్రాథమికంగా నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. ఈ రంగంలో నిపుణుడుగా ఉన్న జర్మనీకి చెందిన డాట్సన్‌ 15 రోజుల పాటు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత తేలికపాటి మెట్రోకు డీపీఆర్‌ తయారు చేయాలని నిర్ణయించారు.

రుణం ఇచ్చేందుకు సుముఖత.. విజయవాడ నగరంలో నిర్మించే మెట్రో ప్రాజెక్టుకు ఫ్రాన్సు, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ దాదాపు రూ.2,200 కోట్లు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తేలిక పాటి మెట్రోకు మారినా రుణం అందించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం డీపీఆర్‌ తయారీకి వ్యయం కూడా ఆ రుణ సంస్థలే భరిస్తున్నాయి. దాదాపు రూ.6 కోట్లు వెచ్చించి డీపీఆర్‌ అందించనున్నాయి. దీనికోసం పిలిచిన గ్లోబల్‌ బిడ్స్‌ల్లో సిస్ట్రా సంస్థ ఎంపికైంది. ఇటీవల ఆ సంస్థకు చెందిన నిపుణులు విజయవాడ వచ్చి క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. మే నెల చివరి నాటికి డీపీఆర్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి బృందం మరోసారి తేలికపాటి మెట్రో అధ్యయనం కోసం జర్మనీ, ఫ్రాన్సు దేశాలను సందర్శించనుంది. మే నెల 14 నుంచి 16 వరకు రెండు దేశాల్లో పర్యటించనున్నట్లు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి చెప్పారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, ఏపీసీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ జె.నివాస్‌, ఏఎంఆర్‌సీ రోలింగ్‌ స్టాక్‌ నిపుణుడు సూర్జిత్‌సింగ్‌ ఈ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో మూడు నగరాల్లో తేలికపాటి మెట్రో పనితీరును పరిశీలించనున్నారు. జర్మనీలో ఫ్రాంక్‌ఫర్టు, స్టట్‌గార్ట్‌, ఫ్రాన్సులో స్ట్రాస్‌బర్గ్‌ పట్టణాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే అక్కడ అమల్లో ఉన్న లైట్‌మెట్రోపై అధ్యయనం చేయనున్నారు. ఈ పర్యటన కోసం ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...