Jump to content

రాజధాని మాది అనే భావన కలిగించాలి


TampaChinnodu

Recommended Posts

రాజధాని మాది అనే భావన కలిగించాలి 
అసమానతలు వల్ల వర్గ, కుల పోరాటాలు రావచ్చు 
‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణలో పవన్‌కల్యాణ్‌ 
5politics2a.jpg

ఈనాడు, అమరావతి:  ‘‘తెలంగాణలో లాగా వలే ఇక్కడా అసమానతలు ఏర్పడితే ప్రజలు ఎవరిని నిందించాలి? ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలి? అప్పుడు వర్గ, కుల పోరాటాలు జరగొచ్చు’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. ఆ పరిస్థితి మళ్లీ కళింగ ఆంధ్ర ఉద్యమం, రాయలసీమ ఉద్యమాలకు దారి తీస్తుందని, రాజధాని మాది అనే భావన కలిగించేలా ఉండాలే తప్ప ఒక పార్టీకి చెందిన రాజధానిగా చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ముందు చూపు లేకుండా కేవలం పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాదృక్పథం లేకుండా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నారు. ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని విజయవాడలో గురువారం రాత్రి జనసేన అధినేత  ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘చంద్రబాబు నిర్మించిన సైబరాబాద్‌లో ఐటీ హబ్‌ వస్తుందని ప్రభుత్వానికే తెలుసు. దీంతో తమ చుట్టూ ఉన్న కొద్దిమంది ప్రయివేటు వ్యక్తులను అక్కడ భూములు కొనుక్కొండని చెబితే అది అవినీతి కాక మరేమిటి? అక్కడ అదే జరిగింది’’ అని పవన్‌ అన్నారు. సంపద సృష్టిని తాను వ్యతిరేకించడం లేదని, పాలకులు బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయాలని కోరారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ అమరావతి ఎప్పటికి అభివృద్ధి చెందుతుంది? కనీసం దైవాన్ష్‌ వచ్చే సమయానికైనా అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు.

స్థిరాస్తి ఆసక్తులతోనే ఈ ప్రాంతం ఎంపిక 
రాజధాని నిర్మాణం మాత్రమే ప్రధానమైన అంశం కాదని, విజయవంతమైన రాజ్యాన్ని నిర్మించి నిర్వహించడమే ముఖ్యమని తాను ఒక పుస్తకంలో చదివానంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్నే మరిచిపోయిందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి, ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తక రచయిత ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. సాధ్యాసాధ్యాల నివేదిక, ఎలాంటి అధ్యయనం లేకుండా ఏర్పాటు చేసిన రాజధాని అమరావతి అని చెప్పారు. అమరావతిలో డ్రైనేజీల నిర్మాణానికే రూ.6000 కోట్లు వెచ్చిస్తున్నారని, అదే మెట్ట ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపడితే ఆ సొమ్ముతో పరిపాలనా నగర నిర్మాణంపూర్తైపోయేదని ప్రభుత్వంలో ఓ ముఖ్యుడు తనతో పేర్కొన్నారన్నారు. డబ్బులు ఖర్చుపెడుతున్న తీరు తలుచుకుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు.

పవన్‌ మాట సర్రున వెళ్తోంది: ఉండవల్లి 
ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌ అవిశ్వాసం పెట్టమన్నందువల్లే ఇన్ని రోజులుగా పార్లమెంటు స్తంభించిపోయిందని, ఆయన ఏం మాట్లాడినా సర్రున వెళ్తోంది’’ అని పేర్కొన్నారు. సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. ప్రొఫెసర్‌ రామచంద్రయ్య అధ్యక్షత వహించారు. 

Link to comment
Share on other sites

Quote

‘‘చంద్రబాబు నిర్మించిన సైబరాబాద్‌లో ఐటీ హబ్‌ వస్తుందని ప్రభుత్వానికే తెలుసు. దీంతో తమ చుట్టూ ఉన్న కొద్దిమంది ప్రయివేటు వ్యక్తులను అక్కడ భూములు కొనుక్కొండని చెబితే అది అవినీతి కాక మరేమిటి? అక్కడ అదే జరిగింది’’ అని పవన్‌ అన్నారు.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...