గన్నవరం టు వెలగపూడి సచివాలయం..! లైట్‌ మెట్రో కొత్తకారిడార్‌ ప్రతిపాదిస్తున్న సిస్ట్రా సంస్థ తొలి ప్రాధాన్యం దీనికే ఆగస్టు నాటికి డీపీఆర్‌ సిద్ధం ఈనాడు, అమరావతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విజయవాడ మెట్రో ప్రాధాన్యతలు మారుతున్నాయి. కొత్త కారిడార్‌లు చేరుతున్నాయి. మెట్రో పట్టాలు ఎక్కేందుకు చాలా సమయం ఉన్నా.. సవివర నివేదిక తయారీలో మరో కొత్త కారిడార్‌ చేరింది. మెట్రో ప్రాధాన్య కారిడార్‌లోనూ మార్పులు  జరిగాయి. మొదట ప్రతిపాదించి తయారు చేసిన సవివర నివేదిక (డీపీఆర్‌)కు ప్