Jump to content

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సోషల్‌ మీడియా రంగంలో అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఇస్తోందన్నారు


snoww

Recommended Posts

సోషల్‌ మీడియా సమ్మిట్‌ అవార్డ్స్‌–2018 ఆరంభం

ప్రత్యేక ఆకర్షణగా ‘మిత్ర’ రోబో, వీవీఎస్‌ లక్ష్మణ్‌

నేడు ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

హాజరుకానున్న సినీ ప్రముఖులు కరీనా కపూర్, సమంత, దేవీశ్రీప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా సమ్మిట్‌ అవార్డ్స్‌–2018 కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలు శుక్రవారం విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మెన్‌ గద్దె అనూరాధ, పర్యాటక శాఖ సీఈఓ హిమాన్షు శుక్లాలు పాల్గొన్నారు.
social-media2.jpg
మంత్రముగ్ధులను చేసిన ‘మిత్ర’
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ‘మిత్ర’ రోబోను ఆవిష్కరించారు. ఈ రోబోను 2017 హైదరాబాద్‌లో జరిగిన జీఈఎస్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌లు తొలిసారిగా ఆవిష్కరించారు. ఐదడుగులున్న ఈ రోబో తన మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పర్యాటక శాక సీఈఓ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సోషల్‌ మీడియా రంగంలో అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఇస్తోందన్నారు. సోషల్‌ మీడియా ద్వారా పర్యటక రంగ అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌తో సెల్ఫీలు దిగడానికి యువత ఎగబడ్డారు.తరలిరానున్న సినీ తారలు..
kusbu.jpg
శనివారం సోషల్‌ మీడియా రెండో రోజు కార్యక్రమంలో భాగంగా సోషల్‌ మీడియాలో చురుకుగా పాల్గొంటున్న సినీ ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌ నటీ కరీనా కపూర్, టాలీవుడ్‌ నటీ సమంతా అక్కినేని, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌లకు అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా సోషల్‌ మీడియాలో రాణిస్తున్న మరో 40 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది.

Link to comment
Share on other sites

మళ్లీ అమరావతికి వస్తా 
 కరీనా కపూర్‌ 
సమంత, దేవిశ్రీ ప్రసాద్‌లకు సోషల్‌ మీడియా పురస్కారాలు 
11tollywood9a.jpg

‘‘విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. సొంత ప్రాంతానికి వచ్చిన భావన కలుగుతోంది. త్వరలో అమరావతిలో జరగబోతున్న స్పీడ్‌బోట్‌ రేసింగ్‌ పోటీలకు నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాన’’న్నారు బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ సారథ్యంలో విజయవాడలో శనివారం రాత్రి సోషల్‌ మీడియా సమ్మిట్‌ అండ్‌ అవార్డ్స్‌ అమరావతి - 2018 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కరీనా కపూర్‌తో పాటు తెలుగు కథానాయిక సమంత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. మంత్రి భూమా అఖిలప్రియ చేతుల మీదుగా కరీనా ‘సోషల్‌ మీడియా స్టైల్‌ ఐకాన్‌’ పురస్కారం అందుకుంది. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ ‘‘తల్లయ్యాక కూడా ఫిట్‌గా ఉన్నందుకు ఆనందంగా ఉంది. వృత్తిపరంగా అది నాకు అవసరం. ఫిట్‌నెస్‌ విషయంలో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు గర్వంగా ఉంద’’ని చెప్పింది. వేదికపై కరీనాతో సరదాగా ‘ఉప్పుకర్పూరంబు..’ పద్యాన్ని పలికించగా దాని అర్థమేంటని అడిగి తెలుసుకుంది. సమంతకు ‘సోషల్‌ మీడియా మోస్ట్‌ లైక్డ్‌ సౌతిండియన్‌ స్టార్‌’ పురస్కారాన్ని మంత్రి దేవినేని ఉమ అందజేశారు. దీనిపై సమంత ఆనందం వ్యక్తం చేసింది. ‘‘అమరావతికి రావాలన్నది నా చిరకాల కోరిక. ఈ కార్యక్రమం ద్వారా  నా కల తీరినందుకు సంతోషంగా ఉంది. ఎన్నో రోజులుగా అమరావతి గురించి స్ఫూర్తిదాయక విషయాలు వింటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. ప్రస్తుతం సోషల్‌ మీడియా శక్తిమంతమైన మాధ్యమంగా ఎదిగింది. అందులో నన్ను అనుసరిస్తున్నవారికి, అభిమానిస్తున్నవారికి ధన్యవాదాల’’ని చెప్పింది. సోషల్‌ మీడియాలో చాలా మంది ఇష్ట పడిన పోస్టు ఏదన్న ప్రశ్నకు ‘నాగచైతన్యతో పెళ్లి విషయం’ అని జవాబిచ్చింది సమంత. చైతన్య వంట చేస్తున్న ఫొటోలను పోస్ట్‌ చేసినప్పుడు, అవెందుకు చేశావని చైతన్య అడిగాడని నవ్వుతూ చెప్పింది సమంత. విజయవాడ నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ చేతుల మీదుగా దేవిశ్రీ ప్రసాద్‌ ‘మోస్ట్‌ లైక్డ్‌ సౌతిండియన్‌ మ్యూజిషియన్‌’ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘సినిమా వారికి విజయవాడ ప్రత్యేకం. సినిమాలపై ఇక్కడొచ్చే టాక్‌ గురించి అందరూ ఆసక్తిగా చూస్తుంటారు. నాకు లైవ్‌ షో చేయాలంటే మొదట గుర్తొచ్చేది విజయవాడనే. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సమయంలో నా తొలి లైవ్‌ షో చేసింది ఇక్కడే. ఇక్కడి ప్రజలకు ధన్యవాదాల’’న్నారు. సోషల్‌ మీడియాలో మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి ఎవరన్న ప్రశ్నకు ‘‘శంకర్‌ మహదేవన్‌. ఆయన చేసే కార్యక్రమాలను తప్పక అనుసరిస్తుంటాన’’ని సమాధానమిచ్చారు దేవిశ్రీ. ఈ కార్యక్రమంలో హెబ్బా పటేల్‌ నృత్యాలు అలరించాయి.  సుధీర్‌బాబు, మన్నారా చోప్రా తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...