Jump to content

బెంగాల్‌లో మాజీ ఐపీఎస్‌ ఆత్మహత్య లేఖ కలకలం


snoww

Recommended Posts

బెంగాల్‌లో మాజీ ఐపీఎస్‌ ఆత్మహత్య లేఖ కలకలం

23kcm-bengalips.jpg

కోల్‌కతా : తన చావుకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కారణమంటూ కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ మాజీ ఐపీఎస్‌ అధికారి రాసిన లేఖ పశ్చిమబెంగాల్‌లో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 19న 1986బ్యాచ్‌కు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి గౌరవ్‌దత్‌ తన నివాసంలో మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆయన మృతదేహం వద్ద లభ్యమైన ఆత్మహత్య లేఖలో తన చావుకు నేరుగా మమతా బెనర్జీనే కారణమని పేర్కొన్నారు. తనకు సంబంధించిన రెండు కేసులను మూసివేసేందుకు మమత నిరాకరించారని లేఖలో దత్‌ ఆరోపించారు. ఈ విషయంపై డీజీ చెప్పినప్పటికీ మమత వినిపించుకోలేదన్నారు. పదేళ్లుగా మమత తనపట్ల క్షక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, అందుకు కారణాలు ఆమెకే బాగా తెలుసన్నారు. తాను ఉద్యోగ జీవితంలో కష్టపడి సంపాదించుకొన్న మొత్తాన్ని దక్కకుండా చేశారని దత్‌ ఆరోపించారు. తన చావు తర్వాతైనా ఆ సేవింగ్స్‌ను విడుదల చేయాలని కోరాడు. పశ్చిమబెంగాల్‌లో తనలా నిజాయతీ గల అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని బయటి ప్రపంచం గుర్తించేందుకే ఈ చర్యకు పాల్పడుతున్నట్లు లేఖలో దత్‌ పేర్కొన్నారు. ‘గౌరవంగా ఒకరు జీవించలేనపుడు..గౌరవంగా చనిపోవడం మేలని’ అందులో వ్యాఖ్యానించారు. గతేడాది గౌరవ్‌ దత్‌ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొన్నారు. ఆయన తండ్రి గోపాల్‌ దత్‌ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వద్ద భద్రతాధికారిగా పనిచేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...