Jump to content

వరద కాలువనూ వదలని స్థిరాస్తి వ్యాపారులు


snoww

Recommended Posts

ఆక్రముం చేస్తున్నారు

వరద కాలువనూ వదలని స్థిరాస్తి వ్యాపారులు
అరకిలో మీటరు పొడవునా ఆక్రమణ
హిమాయత్‌సాగర్‌కు వరద వెళ్లే మార్గం కబ్జా
శంషాబాద్‌ విమానాశ్రయం వంతెనకూ ముప్పు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి,
శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే

4story1a_1.jpg

హైదరాబాద్‌ నగరం ముంపు బారిన పడకుండా వరద నీరు ఒక చెరువు నుంచి మరో చెరువుకు వెళ్లేలా నిజాం కాలంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఏర్పాటైంది. అంతటి మహోన్నతమైన వ్యవస్థ కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల స్వార్థంతో ప్రమాదంలో పడింది. శంషాబాద్‌ దగ్గర కొంతమంది ఏకంగా అర కిలో మీటరు పొడవునా ఉన్న వరద కాలువను ఆక్రమించారు. వరదనీరు తమ వెంచర్లలోకి రాకుండా సిమెంట్‌ పైపులతో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాజధానికి తాగునీరు అందిస్తున్న హిమాయత్‌సాగర్‌లోకి వరద నీరు చేరకుండా అడ్డుకట్ట పడింది. శంషాబాద్‌ పరిసర ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. ఇంత జరుగుతున్నా సాగునీటి శాఖ కళ్లకు ఎందుకు కనిపించడంలేదో మరి!!

ఇటీవల కొన్ని చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా.. రెండు చెరువులను కలిపే కాలువలపై కన్ను పడలేదు. ఇప్పడు ఈ కాలువలూ ఆక్రమణల వలలో చిక్కుకుంటున్నాయి. శంషాబాద్‌ పరిధిలో విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, బెంగళూరు జాతీయ, రాష్రీˆ్టయ రహదారులు విస్తరించడంతో ఇక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మండల పరిధిలోని జలవనరులోన్లే అక్రమ లేఅవుట్లను నిర్మించిన రియల్‌ వ్యాపారులు వరద కాలువలపై కన్నేశారు. తాజాగా శంషాబాద్‌లోని కాముని చెరువు-జోష్‌ కుంట మధ్య అర కిలో మీటరు పొడవునా వరద కాలువను కొంతమంది రియల్‌ వ్యాపారులు ధ్వంసం చేశారు. ఇక్కడ తమ వెంచర్లలో మురుగునీరు తరలించడానికి వీలుగా వరద కాలువ స్థానే భూగర్భ డ్రెయినేజీని ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ రెండు చెరువులు నిండిన తరువాత వరదనీరు అంతా నగరానికి నీటిని అందిస్తున్న హిమాయత్‌సాగర్‌కు చేరాలి. తాజా పరిస్థితితో హిమాయత్‌సాగర్‌లోకి నీరు చేరే అవకాశం లేదు. వరద నీటితో శంషాబాద్‌ పరిసర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం పడితే ఈ ప్రాంతమంతా చెరువుగా మారే ప్రమాదం ఉంది.
* ట్రంపెట్ వంతెన నిర్మాణానికి ముప్పు
కాముని చెరువు-జోష్‌ కుంట మధ్య ఉన్న వరద కాలువపైన వాహనాలు విమానాశ్రయానికి నేరుగా వెళ్లడానికి ట్రంపెట్ (ఏనుగు తొండం ఆకారం)వంతెనను అధికారులు నిర్మించారు. వంతెనకు ఇబ్బంది లేకుండా మూడు అతి పెద్ద భూగర్బ పైపులువేసి కాలువలో నీరు ఈ పైపుల ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రియల్‌ వ్యాపారులు కేవలం చిన్నపైపు వేసి ఇక్కడ కాలువను మళ్లించారు. మ్యాన్‌హోల్స్‌ నిర్మిస్తున్నారు. భారీ వర్షం పడితే ఈ వంతెన దగ్గర నీరు నిలిచి చెరువుగా మారి ట్రంపెట్‌ వంతెనకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

4story1b.jpg

* మా దృష్టికి రాలేదు
వరద కాలువలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని నీటి పారుదల శాఖ సహాయ ఇంజినీర్‌ జగదీష్‌ అన్నారు. కాముని చెరువు-జోష్‌ కుంట మధ్య వరద కాలువ ధ్వంసానికి, కట్టడాల నిర్మాణానికి ఏమైనా అనుమతులు ఇచ్చారా అని ‘ఈనాడు’ వివరణ అడగ్గా ఆ పనులు తమ దృష్టికి రాలేదన్నారు. వెంటనే సందర్శించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

- జగదీష్‌, నీటి పారుదల శాఖ సహాయ ఇంజినీర్‌
Link to comment
Share on other sites

Majority of the real estate ventures near cheruvulu in Hyderabad are just one flood away from facing disaster . It will be exposed soon. 

Be careful  before buying and do some research.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...