కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, దేశమంతా విస్తృతంగా ఉన్న కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ్ అదృశ్యం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మంగళూరు సమీపంలో ఆయన కనపడకుండా పోయినట్టుగా సమాచారం. డ్రైవర్ తో కలిసి సిద్ధార్థ వెళ్లారట. కారును పార్క్ చేసి ఉంచమని, తను కాసేపు వాకింగ్ చేస్తానంటూ నదీ తీరంవైపు వెళ్లిన సిద్ధార్థ మళ్లీ కనిపించలేదని వార్తలు వస్తున్నాయి. ఆయన నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా కూడా పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి. కొన్నాళ్లుగా సిద్ధార్థ పేర్లు వార్తల్లోకి  ఎక్కు