Jump to content

Jagan ruling meda reviews ivandhi


walter18

Recommended Posts

ప్రజలపై పెను భారం: ఏపీ అప్పులు తీరాలంటే మరో 20 ఏళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న రూ.2.45 లక్షల కోట్లు అప్పు ఉంది. వీటిని వడ్డీతో సహా తీర్చాలంటే మరో ఇరవై ఏళ్లు పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు కట్టింది. బహిరంగ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి, నాబార్డ్, ఉదయ్, విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న అన్ని రుణాలు కలిపి అక్షరాలా రూ.2,44,941.30 కోట్ల రుణాలు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి లెక్కిస్తే వీటిని తీర్చడానికి 2039-2040 వరకు సమయం పడుతుందట. తీసుకున్న రుణాలను ఎప్పుడు ఎంత చెల్లించాల్సి ఉందో లెక్కలు వేసింది. విభాగాల వారీగా లెక్కలు, వడ్డీలు లెక్కించింది.

 

Link to comment
Share on other sites

ఎక్కడి నుంచి ఎన్ని రుణాలు తీసుకున్నారంటే?

బహిరంగ మార్కెట్ నుంచి రూ.1,55,376 కోట్లు కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు రూ.10,229 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు నుంచి రూ.12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్, ఇతర సంస్థల నుంచి రూ.14,767 కోట్లు, డిపాజిట్స్, రిజర్వ్ నిల్వలు రూ.52,064 కోట్లు ఉన్నాయి. మొత్తం రూ.2,44,941.30 కోట్ల రుణాలు ఉన్నాయి.

వీటిని తీర్చాలనుకున్నా...

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అవి చెల్లించడంతో పాటు మళ్లీ ఎప్పటికి అప్పుడు వివిధ విభాగాల్లో రుణాలు పెరుగుతుంటాయి. అప్పుడు చెల్లింపులపై ప్రభావం పడుతుంది. నాబార్డు, ఉదయ్ కింద తీసుకున్న రుణాలు రానున్న పది, పన్నెండేళ్లలో తీరుతాయని అంచనా.

అప్పులతో నెట్టుకు రావడమేనా?

గత చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు జగన్ ప్రభుత్వం అప్పులు చేసి నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇప్పటికే జగన్ నవరత్నాలలో భాగంగా వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. వీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వీటితో పాటు పోలవరం వంటి ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంది. పోలవరం బాధ్యత కేంద్రానిదే కావడం ఊరట కలిగించే అంశం. ఇటీవల రుణాలపై ఎస్బీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఏపీని ఎలా ముందుకు తీసుకు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది. నిన్న చంద్రబాబు, నేడు జగన్ రుణాలు తీసుకొని పాలిస్తున్నారని, కానీ ఈ భారం పడేదంతా ప్రజల పైనే అంటున్నారు.

Link to comment
Share on other sites

11 minutes ago, walter18 said:

ప్రజలపై పెను భారం: ఏపీ అప్పులు తీరాలంటే మరో 20 ఏళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న రూ.2.45 లక్షల కోట్లు అప్పు ఉంది. వీటిని వడ్డీతో సహా తీర్చాలంటే మరో ఇరవై ఏళ్లు పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు కట్టింది. బహిరంగ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి, నాబార్డ్, ఉదయ్, విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న అన్ని రుణాలు కలిపి అక్షరాలా రూ.2,44,941.30 కోట్ల రుణాలు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి లెక్కిస్తే వీటిని తీర్చడానికి 2039-2040 వరకు సమయం పడుతుందట. తీసుకున్న రుణాలను ఎప్పుడు ఎంత చెల్లించాల్సి ఉందో లెక్కలు వేసింది. విభాగాల వారీగా లెక్కలు, వడ్డీలు లెక్కించింది.

 

Thank you CBN 

Link to comment
Share on other sites

9 minutes ago, snoww said:

Thank you CBN 

Eedi bokkalo visionary, eedu Ami chesina visionary antaru . Aapulu chesadu ante part of visionary and next 5 years lo Anni appulu teerchesi vadu antadu

Link to comment
Share on other sites

జగన్ మైండ్ గేమ్ : మోడీ విషయంలో మారిన వ్యూహం

రాజకీయం అంటేనే మైండ్ గేమ్. ప్రత్యర్థిని చిత్తు చేయాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలి. వ్యూహం రచించాలి. దెబ్బకు దెబ్బ తియ్యాలి. అదే సమయంలో అవసరమైతే కలిసిపోవాలి. సిటుయేషన్ డిమాండ్ చేస్తే కయ్యానికైనా, వియ్యానికైనా వెనుకాడకూడదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడే సక్సెస్ అవుతాడు. ఏపీలో ఇప్పుడు ఇలాంటి రాజకీయమే నడుస్తోంది. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబులా కాకుండా.. సీఎం జగన్ తెలివిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులా తప్పుల మీద తప్పులు చేయకుండా.. మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయంలో. ఓ వైపు బీజేపీ బలపడకుండా చూసుకుంటూనే.. ఆ పార్టీతో స్నేహగీతం ఆలపిస్తున్నారు. చంద్రబాబులా మొండిగా వెళ్లకుండా.. అవసరమైనప్పుడు తగ్గుతున్నారు. మోడీతో ఢీ అంటే ఢీ అనకుండా సాఫ్ట్ గా మ్యాటర్ ని హ్యాండిల్ చేస్తున్నారు. బీజేపీతో వైరం కారణంగా ఏపీ రాష్ట్రం నష్టపోవడమే కాదు.. పార్టీ పరంగా వ్యక్తిగతంగా బాబుగారు బాగానే లాస్ అయ్యారు. కానీ జగన్ మాత్రం అలా కాకుండా చూసుకుంటున్నారు.

 

 

మ్యాటర్ ఏంటంటే.. జగన్ వ్యూహం మామూలుగా లేదు. అటు బీజేపీకి ఇటు టీడీపీకి.. రెండింటికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు. నిన్న సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ ని ఘనంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ విషయంలో జగన్ వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. జగన్ రాజకీయ చతురతను బయటపెట్టింది. ఈ స్కీమ్ విషయంలో సీఎం జగన్ మొండిగా వ్యవహరించలేదు. వైఎస్ఆర్ రైతు భరోసాకి పీఎం కిసాన్ అనే పేరుని కూడా జోడించారు. అంతేకాదు.. యాడ్స్ లో ప్రధాని మోడీ ఫొటోని హైలైట్ కూడా చేశారు.

రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 నగదు సాయం ఇస్తామని ప్రకటించిన జగన్ సర్కారు.. ఆ పథకం ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఆర్థిక సాయాన్ని రూ.13,500కి పెంచింది. మొదట నాలుగేళ్ల రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ.. దాన్ని ఐదేళ్లకు పొడిగించారు. ఇకపోతే పీఎం కిసాన్ యోజన ద్వారా కేంద్రం రూ.6 వేలు సాయం చేస్తుంది కాబట్టి.. ఈ పథకం పేరును ‘వై‌ఎస్‌ఆర్ రైతు భరోసా పీ‌ఎం కిసాన్ యోజన’గా మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి మోడీ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇటీవలే డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను ఉపయోగిస్తున్నారు.. కాబట్టి దీనికి మోడీ పేరు పెట్టాలని ఆయన సూచించారు. మరి బీజేపీ నేతల మాటలు ప్రభావం చూపాయో.. మోడీతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో కానీ.. జగన్ తెలివిగా వ్యవహరించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కి పీఎం కిసాన్ అనే పేరుని జోడించారు. అంతేకాదు ప్రధాని మోడీ ఫొటోని కూడా పెట్టుకున్నారు. జగన్ తీరుతో సొంత పార్టీ నేతలు, టీడీపీ నేతలే కాదు.. బీజేపీ నాయకులు సైతం కంగుతిన్నారు. జగన్ నిర్ణయం వారందరికి షాక్ ఇచ్చింది. జగన్ ఇలా చేస్తారని కమలనాథులు అస్సలు ఊహించలేదు. ఆ విధంగా బీజేపీ నేతలు నోరెత్తకుండా చేశారు సీఎం జగన్.

 

గతంలో.. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబును స్టిక్కర్ సీఎం అని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్రం పైసలు పంపితే.. ఇక్కడ బాబు తన పేర్లతో పథకాలను జనంలోకి తీసుకెళ్లారని మోడీ సైతం విమర్శించారు. రైతు భరోసాకు వైఎస్ఆర్ పేరు పెట్టగానే బీజేపీ నేతలు జగన్ కూడా మరో స్టిక్కర్ సీఎం అవుతున్నారని విమర్శించారు. ఇలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

 

వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో పీఎం పేరు జత చేయడంతో.. ఇక పథకం గురించి బీజేపీ నేతలు నోరు మెదపడానికి అవకాశం లేనట్టే. ఇదొక్కట్టే కాదు.. తనకు, బాబుకు ఎంతో తేడా ఉందని.. పరోక్షంగా బీజేపీ పెద్దలకు జగన్ సంకేతాలు పంపాడని భావించొచ్చు అని అంటున్నారు. బీజేపీ విషయంలో మొండిగా వెళ్లి చంద్రబాబు చాలా నష్టపోయారు. ప్రధాని మోడీతో పెట్టుకోవడం వల్ల.. ఏపీకి తీరని నష్టం జరిగింది. పైగా టీడీపీకి, చంద్రబాబుకి కూడా డ్యామేజ్ జరిగింది. ఇబ్బందులు కూడా తప్పలేదు. చంద్రబాబు అనుభవాలను కళ్లారా చూసిన జగన్.. తాను అలాంటి పొరపాట్లు చేయాలని అనుకోవడం లేదు. అందుకే.. ఇలా తగ్గారని చెప్పుకుంటున్నారు. ప్రధాని పేరు జోడించడం ద్వారా.. వైసీపీకి కానీ జగన్ కి కానీ పెద్ద నష్టమేమీ లేదు. పైగా లాభం కూడా. జగన్ చర్యలు చూస్తుంటే.. మోడీతో శత్రుత్వం కన్నా.. మిత్రత్వం బెటర్ అన్న రీతిలో పావులు కదుపుతున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇకపోతే.. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. జగన్ చర్యలకు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏపీలో బీజేపీ బలపడాలంటే.. వైసీపీని బలహీనపరచాల్సిందే. జగన్ ఏమో.. బీజేపీతో కయ్యం కోరుకోవడం లేదు. దీంతో బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తంగా జగన్ మైండ్ గేమ్ ఆయనకు ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.

Link to comment
Share on other sites

  • 5 weeks later...

Below are Pro's in long run. It's not 20-20 match to decide in 1 month/ year. It's test match - result only after 5 yrs

Volunteer job

Alcohl  ban 

Praja kshetram kulchivetha 

Change capital 

Reverse trending 

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...