Jump to content

Tourist Boat capsizes in river at East Godavari - ABN


timmy

Recommended Posts

లాంచీ ప్రమాద ఘటన.. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్

 
Sun, Sep 15, 2019, 04:47 PM
tnews-63d76e8c5dde4c7d295bc1637bd7ec1324
  • ఈ ఘటనపై సీఎం జగన్ మరోమారు సమీక్ష
  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం
  • బాధితులకు అండగా నిలవాలని ఆదేశాలు

గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం జగన్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందజేయాలని ఆదేశించారు.ఈ ఘటనలో బాధితులకు అండగా నిలవాలని, తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆయా బోట్లు ప్రయాణానికి అనుకూలమా? కాదా? అని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, బోట్ల లైసెన్స్ లు పరిశీలించాలని, నిపుణులతో మార్గదర్శకాలు తయారు చేయించి తనకు నివేదించాలని అధికారులకు ఆదేశించారు.

కాగా, లాంచీ మునిగిన ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి. సహాయకచర్యల్లో సుమారు 140 మంది సహాయక సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. విశాఖ, ఏలూరు కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.

https://www.ap7am.com/flash-news-662702-telugu.html

Link to comment
Share on other sites

గోదావరి పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

 
Sun, Sep 15, 2019, 03:46 PM
tnews-5c15dc488201a86246550560ddbed15815
  • గోదావరిలో పర్యాటక బోటు మునక
  • సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్న చంద్రబాబు
  • బోటులో 61 మంది

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. త్వరితగతిన స్పందించి గల్లంతైన వారిని కాపాడాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద 61 మందితో పాపికొండలు దిశగా వెళుతున్న పర్యాటక లాంచీ వరద ఉద్ధృతి కారణంగా మునిగిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు లైఫ్ జాకెట్ల సాయంతో ప్రాణాలు కాపాడుకున్నారు. వారిని స్థానికులు ఒడ్టుకు చేర్చారు. ఈ ప్రమాదంలో భారీ సంఖ్యలో గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు.

https://www.ap7am.com/flash-news-662696-telugu.html

Link to comment
Share on other sites

గోదావరి బోటులో తెలంగాణ వాసులు... పలువురి గల్లంతు!

 
Sun, Sep 15, 2019, 05:41 PM
tnews-96d0af3b50561e44af8b1f0ab5952dcbf3
  • విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్, వరంగల్ వాసులు
  • ఐదుగురు వరంగల్ వాసులు సురక్షితం
  • ఇంకా తెలియని హైదరాబాదీల క్షేమ సమాచారం

వరద ఉద్ధృతితో పరవళ్లు తొక్కుతున్న గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ అనే లాంచీ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు తెలంగాణ వాసులు కూడా ఉన్నట్టు తెలిసింది. 22 మంది హైదరాబాదీలు, 14 మంది వరంగల్ కు చెందినవారు కూడా ఈ బోటులో ఉన్నారు.  అయితే వరంగల్ కు చెందినవారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, 9 మంది గల్లంతయ్యారు. హైదరాబాద్ వాసుల పరిస్థితి తెలియరాలేదు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంలో 61 మందితో ప్రయాణిస్తున్న లాంచీ మునిగిపోయింది. ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు గుర్తించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

https://www.ap7am.com/flash-news-662706-telugu.html

Link to comment
Share on other sites

ఆ ప్రాంతంలో పెద్ద సుడిగుండం ఉంటుంది.. డ్రైవర్లు అదుపు చేయలేకపోయారు: లాంచీ యజమాని

 
Sun, Sep 15, 2019, 06:01 PM
  • కచ్చులూరు దగ్గర నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉంటుంది
  • లాంచీ కెపాసిటీ 90 మంది ప్రయాణికులు
  • అందులో 150 వరకు లైఫ్ జాకెట్స్ ఉన్నాయి
గోదావరిలో లాంచీ ప్రమాదానికి గురైన కచ్చులూరు దగ్గర నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉంటుందని, ఆ ప్రాంతంలో పెద్ద సుడిగుండం ఉంటుందని, డ్రైవర్లు అదుపు చేయలేకపోయారని లాంచీ యజమాని కోడిగుడ్ల వెంకటరమణ అన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఆయన స్పందిస్తూ, లాంచీ కెపాసిటీ 90 మంది ప్రయాణికులు అని, అందులో 150 వరకు లైఫ్ జాకెట్స్ ఉన్నట్టు చెప్పారు. కాగా, వరద ప్రవాహం ఎక్కువగా ఉందని దేవీపట్నం పోలీసులు వారించినా సదరు లాంచీ డ్రైవర్లు మాట వినలేదని సమాచారం. లాంచీ డ్రైవర్లకు కాకినాడ పోర్టు లైసెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

1 hour ago, comradee said:

when

 

When same thing happened in 2018 and CBN was CM,jalaganna aa incident ni kuda politics kosam vadukunnadu. Yes 

 

Apply burnal. Migilindi 23, migiledi pappu gadi dikki

Link to comment
Share on other sites

very sad ...govt should enforce strict rules to wear life jackets all the time while on boat......even public should think about their safety & wear life jackets .....heartfelt condolences to all those who lost their lives

Link to comment
Share on other sites

4 hours ago, comradee said:

Ni eddie mokhaniki aa dialogue tappa inkoti radu le kani,intaki Paytm paisal paddaya leda?

Rey bokkal jara musupettu..leykapothey dichaka dichakee. Burnal kuda scarcity antaaga pulkas kukkal debbaki. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...