Jump to content

భర్తను కాదంది...ప్రియుడితో సయ్యంది : జీవితం విషాదాంతమైంది


MiryalgudaMaruthiRao

Recommended Posts

tnews-882435a6bce5541720ba4ba2c85cbb8c1a

  • ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిపై మోజు
  • అతనితో సహజీవనం చేసినా పెళ్లికి నిరాకరణ
  • మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య

జీవితం ఒకసారి దారితప్పితే ముగింపు ఎలా ఉంటుందనేందుకు ఆమె ఉదాహరణ. ఇంట్లో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని కాదని భర్తకు విడాకులు ఇచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిపై మోజుపడి అతనితో రెండేళ్లుగా సహజీవనం చేస్తోంది. మోజుతీరాక అతను పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి చెందిన చేబ్రోలు విమల (24)కు 2017లో కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించారు. భర్తతో కాపురానికి వెళ్లిన విమల అతనితో సరిపోవడం లేదంటూ మూడు నెలలకే వదిలి వచ్చేసింది. అనంతరం భర్తతో విడాకులు తీసుకుంది. పుట్టింట్లో ఉండగా ఫేస్‌బుక్‌లో ఆమెకు కరీంనగర్‌ జిల్లా పోరండ్లకు చెందిన పవన్‌కుమార్‌తో పరిచయం అయ్యింది. ఈ పరిచయం కాస్త శారీరకంగా ఒక్కటయ్యేందుకు దారితీసింది.

దీంతో కరీంనగర్‌లోనే ఇల్లు అద్దెకు తీసుకుని రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఎన్నాళ్లీ సహజీవనం అనుకున్న విమల పెళ్లి చేసుకోవాల్సిందిగా పవన్‌ను కోరింది. అతను మాయమాటలతో వాయిదా వేస్తూ వస్తుండడంతో ఇటీవల గట్టిగా నిలదీసింది. దీంతో అతను తన మనసులో మాట చెప్పేశాడు. ‘ఇప్పటికే నువ్వు పెళ్లయి విడాకులు తీసుకున్న దానివి. నీతో నాకు పెళ్లేంటి. నచ్చితే ఇష్టమైనన్నాళ్లు కలిసి కాపురం చేద్దాం. జీవితాన్ని ఎంజాయ్‌ చేద్దాం. ఆ తర్వాత ఎవరి దారి వారిదే’ అని తెగేసి చెప్పేసరికి హతాశురాలైంది.

ప్రియుడు మనస్థత్వం అర్థంకావడంతో తట్టుకోలేక  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు ఆత్మహత్యకు పవన్‌కుమారే కారణమని విమల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

తాగివచ్చి నిత్యం వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

 
Tue, Sep 24, 2019, 09:33 AM
FacebookGoogleTwitterLinkedInEmail
tnews-11615e2c72449c2b01b3aaa6529371bc0e
  • తమ్ముడితో కలిసి ఓ భార్య ఘాతుకం
  • చంపాక నోట్లో యాసిడ్‌పోసి ఆత్మహత్యగా చిత్రీకరణ
  • పోలీసుల విచారణలో బయటపడిన నిజం
మద్యానికి బానిసై నిత్యం తాగివచ్చి వేధిస్తున్న భర్తను వదిలించుకునేందుకు ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తమ్ముడితో కలిసి భర్తను ఉరిబిగించి చంపేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అతని నోట్లో యాసిడ్‌ పోసింది. పోలీసుల కథనం మేరకు.... హైదరాబాదులోని జీడిమెట్ల, గాజుల రామారం నెహ్రూనగర్‌కు చెందిన నర్సింహులు (43) భార్య సునీత (40)తో కలసి రాయదుర్గంకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. మద్యానికి బానిసైన నర్సింహులు నిత్యం తాగివచ్చి భార్యను కొడుతుండేవాడు. భర్త తీరును తమ్ముడు సద్దు శ్రీనివాస్‌ (34)కు చెప్పి సునీత నిత్యం వాపోయేది.

రోజురోజుకీ భర్త వేధింపులు ఎక్కువ కావడంతో నర్సింహులు హత్యకు అక్కా, తమ్ముడు పథకం వేశారు. ఈనెల 19వ తేదీ రాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన భర్త తలపై సునీత కర్రతో బలంగా కొట్టింది. కిందపడిన అతని మెడకు నైలాన్‌ తాడుబిగించి హత్య చేశారు. అనంతరం నర్సింహులు నోట్లో యాసిడ్‌ పోశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది.

తన భర్త గత కొంతకాలంగా దగ్గు, ఆస్తమాతో బాధపడుతున్నాడని, బాధను తట్టుకోలేక యాసిడ్‌తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కట్టు కథ వినిపించింది. మొదట అది నిజమేననుకున్న పోలీసులు, నర్సింహులు శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి, విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంత అక్కాతమ్ముళ్లను అరెస్టు చేశారు
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...